-
మావోయిస్టు కరపత్రాల కలకలం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని మణుగూరు మండలం విజయనగరం గ్రామంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. గురువారం మావోయిస్టులు కరపత్రాల ద్వారా కొంతమంది ప్రజాప్రతినిధులకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనుచరులతో పాటు మరి కొంతమందిని మావోయిస్టులు హెచ్చరించారు. ‘విజయనగరం గ్రామంలో ఇసుక దందా, భూ సెటిల్మెంట్స్, భూకబ్జాలకు పాల్పడుతూ.. కుల రాజకీయాలను రెచ్చగొడుతున్న ఎనిమిది మందికి వార్నింగ్. పద్ధతి మార్చుకోకపోతే ఏరివేత తప్పద’ని కరపత్రాలలో పేర్కొన్నారు. మావోయిస్టు చర్ల, దుమ్ముగూడెం ఏరియా కార్యదర్శి పేరిట ఈ కరపత్రాలు వెలిశాయి. -
డబుల్ బెడ్రూం ఇళ్లపై పునరాలోచించండి
♦ బడ్జెట్పై చర్చలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ♦ గ్రామాల్లో పేదలు తమ స్థలంలోనే ఇళ్లు కట్టుకునేలా వెసులుబాటు కల్పించాలి ♦ సీతారామ, రామదాసు ప్రాజెక్టులపై సందేహాలున్నాయ్ సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్లను ఒకేతీరుగా నిర్మించాలనే ప్రణాళికపై ప్రభుత్వం పునరాలోచించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. హైదరాబాద్లో ఒకే నమూనా అమలుకు ఇబ్బంది లేదని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో తమకున్న స్థలంలో పేదలు ఇళ్లు కట్టుకునేలా వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు. దాదాపు నాలుగులక్షల మందికి పెండింగ్లో పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్పై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కరువు, దుర్భిక్ష పరిస్థితులు, ఎండలు మండుతున్నందున రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులకు భరోసానివ్వాలని ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక కమిటీ వేసి ఈ నిధులు ఖర్చు చేయాలని, మైనారిటీలు, బీసీలకు సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానం మేరకు ప్రతి గిరిజన కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టులపై పలు సందేహాలు ఉన్నాయని, వాటిపై నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్లపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇవ్వాలని కోరారు. బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేనంతగా 51శాతం ప్రణాళిక వ్యయాన్ని చూపిం చినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలో.. జాలిపడాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. భారీగా వేసుకున్న ఆదాయపు అంచనాలన్నీ ప్రభుత్వ ప్రగల్భాలుగానే కనిపిస్తున్నాయని విమర్శించారు. ఈ బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
టీఆర్ఎస్ వైఫల్యం వల్లే రైతు ఆత్మహత్యలు
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే 1100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ఆర్సీపీ తెలంగాణ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. రుణమాఫీ చేయకపోవడం వల్లే రైతాంగ సంక్షోభం నెలకొందని ఆయన అన్నారు. వెంటనే రుణమాఫీ చేయడంతో పాటు కరువు మండలాలను ప్రకటించాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. పెండింగులో ఉన్న హౌసింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. -
పీహెచ్సీలో ‘పాయం’ తనిఖీలు
స్టాక్ రికార్డు, హాజరుపట్టిక పరిశీలన కరకగూడెం జెడ్పీఎస్ఎస్ సందర్శన పినపాక : ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల కు మెరుగైన వైద్య సేవలందించాలని పినపాక ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు వైద్యులు, సిబ్బందికి సూ చించారు. మండలంలోని కరకగూడెం ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. అనంతరం స్టాక్ రికార్డును, హాజరుపట్టికను పరిశీలించారు. దూ ర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు వెంటనే వైద్య సేవలందించాలని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా అన్ని సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల తనిఖీ.. కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే పాయం తనిఖీ చేశారు. హెచ్ఎం శ్రీలత ను పాఠశాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం టెన్త్ విద్యార్థులతో మాట్లాడారు. మరుగుదొడ్లు, మూత్రాలలు లేకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నట్లు విద్యార్థినులు ఎమ్మెల్యే ఎదుట వాపోయూరు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని పాయం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉడుముల లక్ష్మీరెడ్డి, ఏడూళ్లబయ్యారం ఎస్సై జీడి సూర్యప్రకాష్, కరకగూడెం సర్పంచ్ వట్టం సమ్మక్క, ఎస్ఎంసీ చైర్మన్ జలగం కృష్ణ, వైఎస్సార్సీపీ మండల నాయకులు సారా సాంబశివరావు, పోగు వెంకటేశ్వర్లు, ముద్దం సూర్యనారాయణ, అజ్జు, గొగ్గలి రవి, ఎర్రా సురేష్, బాతిని మురళి, జాడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ వార్డెన్పై ఎమ్మెల్యే ‘పాయం’ ఆగ్రహం
మెనూ పాటించడం లేదని మండిపాటు ఎస్సీ బాలుర హాస్టల్ ఆకస్మిక తనిఖీ ఎమ్మెల్యేకు సమస్యలు విన్నవించిన విద్యార్థులు మణుగూరు : ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం విద్యార్థులకు పెట్టాలని మెనూ సక్రమంగా పాటించని వార్డెన్నుపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆగ్రహించారు. ఈ మేరకు గురువారం ఉదయం మణుగూరు ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికి హాస్టల్లో వార్డెన్ లేకపోవడంతో మీరు లేకుండా విద్యార్థులు ఎలా ఉంటారని వార్డెన్ను ప్రశ్నించారు. విద్యార్థులకు వండిన వంటను పరిశీలించారు. చారు నీళ్లలా ఉందని, మెనూ ప్రకారం తమకు భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే హాస్టల్ రికార్డులను పరిశీలించారు. స్టోర్ రూమ్లో ఉన్న సామాన్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తమకు స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో భోజనాలు పెట్టడం లేదని ఎస్ఎంహెచ్ హాస్టల్ విద్యార్థులు ఎమ్మెల్యేకు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. హాస్టల్లో తాగునీటి సమస్య, మరుగుదొడ్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవని విద్యార్థులు ఆయనకు తెలిపారు. సమస్యలను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తనన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు హాస్టల్ వార్డెన్ కృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి వట్టం రాంబాబు, మండల గౌరవ అధ్యక్షుడు పల్లపు తిరుమలేశ్, కార్యదర్శి గాండ్ల సురేష్, జిల్లా నాయకులు పెద్ది నాగకృష్ణ, మండల యూత్ నాయకుడు రంజిత్, నాయకులు మేడ నాగేశ్వరరావు, జె సురేష్ వార్డు సభ్యులు మిట్టపల్లి కిరణ్కుమార్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement