-
కర్ణాటక క్రీడాశాఖ మంత్రి ఇంటిపై దళితుల దాడి
-
మంత్రి ఇంటి ముట్టడికి యత్నం
ఒంగోలు టౌన్: జీఓ నెం 279 రద్దుచేసి, ఆర్టీఎంఎస్ విధానాన్ని ఎత్తివేయాలని కోరుతూ మునిసిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి మూడో రోజుకు చేరుకొంది. సమ్మెలో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు ఇంటిని ముట్టడించాలని జిల్లా నాయకత్వం నిర్ణయించింది. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి కార్మికులు, నాయకులు ప్రదర్శనగా బయలుదేరి మంగమూరురోడ్డులోని మంత్రి ఇంటిని ముట్టడించేందుకు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడంతో రోడ్డు మొదట్లోనే ఆందోళనకారులను అడ్డుకున్నారు. తాము లోపలికి వెళతామంటూ ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరకు మంత్రిని కలిసేందుకు ముఖ్య నాయకులకు అనుమతి ఇచ్చారు. మంత్రి శిద్దా రాఘవరావు ఛాంబర్ వద్దకు చేరుకొన్నారు. అక్కడే కలెక్టర్ వినయ్చంద్, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి ఉన్నారు. వారి సమక్షంలో మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అంతకు ముందు మునిసిపల్ కార్మికులను ఉద్దేశించి సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ మునిసిపల్ కార్మికుల ఉనికికి గొడ్డలి పెట్టు అయిన జీఓ నెం 279ని ప్రభ్వుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తుంటే, ఆర్టీఎంఎస్ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. జేఏసీ నాయకుడు శ్రీరాం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో పారిశుద్ధ్య కార్మికులు అంకితభావంతో విధులు నిర్వర్తించడం వల్లనే రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని గుర్తెరగని నగర పాలక సంస్థ కమీషనర్ కార్మికులను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోకి పారిశుధ్య కార్మికులు ప్రవేశించకుండా ఉండాలన్న ఉద్ధేశంతో గేట్లకు తాళాలు వేయించడం సరికాదన్నారు. కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. జేఏసీ నాయకుడు ఎస్డీ సర్ధార్ మాట్లాడుతూ జీఓ నెం 279 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ ప్రకారం వేతన సవరణ చేయాలన్నారు. మునిసిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తంబి శ్రీనివాసులు, టి.మహేష్, కె.శ్రీనివాసరావు, యూ రత్నకుమారి పాల్గొన్నారు. 14 మందిపై కేసు నమోదు ఒంగోలు: నగరపాలక సంస్థ కమిషనర్ సంకురాత్రి వెంకట కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మందిపై ఒంగోలు వన్టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈనెల 4వ తేదీ నుంచి ఔట్ సోర్సింగ్ కార్మికులు ఎక్కువమంది సమ్మె చేస్తున్నారు. కొందరు మాత్రం విధులకు హాజరవుతున్నారు. శనివారం కార్మికులు చేస్తున్న పనికి ఆటంకం కలిగించడంతోపాటు శానిటరీ ఇన్స్పెక్టర్ల విధులకు కోర్నిపాటి శ్రీనివాసరావు, కొల్లాబత్తిన గోపి, ఊదరగుడి సామ్రాజ్యం, కాకర్లమూడి సామ్రాజ్యం, తంబి శ్రీనివాసులు(సీఐటీయూ), ఊరగాయల నాగరాజు, రంపతోటి శ్రీనివాసరావు, కోర్నెపాటి రవికుమార్, కోర్నెపాటి బాలకృష్ణ, తేళ్ల విజయ, బందెళ సుబ్బారావు, శ్రీరామ్ శ్రీనివాసరావు, పిల్లి శారద, బండ్ల ఏడుకొండలు అనే వారు ఆటంకం కలిగిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మందిపై కేసు నమోదు చేశారు. -
మంత్రి ఇంట్లో రగడ
సేలం అన్నాడీఎంకేలో డిష్యుం..డిష్యుం టీనగర్: అన్నాడీఎంకేలో ఎమ్మెల్యే సీటు పొందేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ నేత ఒకరు మంత్రి సమక్షంలోనే బాహాబాహీ తలపడ్డారు. ఇందులో ఎమ్మెల్యే చొక్కా చిరిగింది. సేలంలో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్నాడీఎంకే నేతలు పలువురు దరఖాస్తులు చేస్తున్నారు. సేలం జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా పార్టీ నేతలలో తీవ్ర పోటీ నెలకొంది. ఇందులో తన మద్దతుదారుల్లోనే రెండు వర్గాలుగా కార్యకర్తలను విడదీసి చోద్యం చూస్తున్నట్లు మంత్రిపై పార్టీ వర్గాలలోనే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సదరు నేత మళ్లీ పోటీ చేసేందుకు దరఖాస్తు చేశారు. అదేవిధంగా అదే నియోజక వర్గం మంత్రి మద్దతుతో సబర్బన్ ప్రాంతానికి చెందిన సహకార సంఘం నిర్వాహకుడు ఒకరు బరిలోకి దిగారు. ఆయన కూడా ప్రస్తుతం సీటు కోరుతూ నగదు చెల్లించారు. మంత్రి మద్దతు సహకార ప్రముఖుడికి ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో దిగ్భ్రాంతి చెందిన నగర ప్రముఖుడు గత కొన్ని రోజుల క్రితం మంత్రిని కలిసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ సహకార ప్రముఖుడు ఉన్నారు. వీరి మధ్య ఏర్పడిన వాగ్వాదం హఠాత్తుగా ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరువురూ బాహాబాహీ తలపడ్డారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చొక్కా చిరిగింది. వేరొక గదిలో ఉన్న మంత్రి దీన్ని గమనించి ఇద్దరినీ మందలించారు. తన చొక్కాను ఎమ్మెల్యేకు ఇచ్చి సహకరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం బయటికి పొక్కి ఏదైనా జరిగితే తాను ఇరువురినీ కాపాడలేనని సదరు మంత్రి తెలపడం అన్నాడీఎంకేలో సంచలనం కలిగించింది. -
మంత్రి ఇల్లు ముట్టడి
జడ్చర్ల(మహబూబ్నగర్): ఎన్నికలకు ముందు ఇంటింటికి మంచినీళ్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు నీటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని మహిళలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి ఎదుట ఈ రోజు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శనలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ఆయన ఇంటి ముందు.. పట్టణంలోని తాలూక క్లబ్, విద్యానగర్, మసీదు ఏరియా ప్రాంతాలకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో వచ్చి ఆందోళన చేపట్టారు. .....................
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement