-
ట్రైనీ ఐపీఎస్ మృతిపై మొదలైన విచారణ
హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి మనూ ముక్త్ మానవ్ అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఇందుకోసం గురువారం రాజేంద్రనగర్ పోలీసులను సీబీఐ విచారిస్తోంది. కేసుకు సంబందించిన అన్ని విషయాలను సీబీఐ అధికారులు సేకరిస్తున్నారు. గత ఏడాది ఆగష్టు లో నేషనల్ పోలీస్ అకాడమీ స్విమ్మింగ్ పూల్లో మనూ ముక్త్ మానవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన కొడుకును హత్య చేశారని మానవ్ తండ్రి రామ్ నివాస్ మానవ్ అప్పట్లో ఆరోపించారు. తన కుమారుడి మృతి పట్ల విచారణ జరపాలని మానవ్ తల్లిదండ్రులు కేంద్రాన్ని కోరారు. ఈనెల 6 తేదీన మానవ్ మృతిపై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం సీబీఐ ను ఆదేశించింది. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన మను ముక్త్త్ మానవ్ (30) 2013లో హిమాచల్ప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్గా ఎంపికయ్యారు. ఆకాడమీలో శిక్షణ పొందుతున్న వారంతా ఆఫీసర్స్ క్లబ్లో విందు చేసుకున్నారు. ఈ విందులో మద్యం సేవించిన మానవ్ మరో ఇద్దరు ట్రైనీలతో కలిసి ఎన్పీఏలో ఉన్న స్విమింగ్ పూల్లో ఈత కొట్టేందుకు వెళ్లారు. స్విమ్మింగ్పూల్లో దిగిన కొద్దిసేపటికే మానవ్ నీటిలో మునిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. -
ట్రైనీ ఐపీఎస్ మృతిపై సీబీఐ విచారణ
హైదరాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి మనూ ముక్త్ మానవ్ అనుమానాస్పద మృతిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సీబీఐ విచారణకు ఆదేశించింది. గత ఏడాది నేషనల్ పోలీస్ అకాడమీ స్విమ్మింగ్ పూల్లో మనూ ముక్త్ మానవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్ట్లో తోటి ట్రైనీల విందులో మద్యం సేవించి, అనంతరం స్విమ్మింగ్ పూల్లోకి దిగడంతో మనూ ముక్త్ మానవ్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన మను ముక్త్త్ మానవ్ (30) 2013లో హిమాచల్ప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్గా ఎంపికయ్యారు. కాగా శిక్షణ పొందుతున్న వారంతా ఆఫీసర్స్ క్లబ్లో విందు చేసుకున్నారు. ఈ విందులో మద్యం సేవించిన మానవ్ మరో ఇద్దరు ట్రైనీలతో కలిసి ఎన్పీఏలో ఉన్న స్విమింగ్ పూల్లో ఈత కొట్టేందుకు వెళ్లారు. స్విమ్మింగ్పూల్లో దిగిన కొద్దిసేపటికే మానవ్ నీటిలో మునిగి మృతి చెందారు. దాంతో మానవ్ తల్లిదండ్రులు.. తమ కుమారుడి మృతి పట్ల విచారణ జరపాలని కేంద్రాన్ని కోరారు. -
'నా కుమారుడిని హత్య చేశారు'
సిమ్లా: తన కొడుకును హత్య చేశారని ట్రైనీ ఐపీఎస్ మనోముత్తు మానవ్ తండ్రి రామ్ నివాస్ మానవ్ ఆరోపించారు. తన కుమారుడి హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంచి ఈతగాడైన తన కొడుకు స్విమ్మింగ్ లో పడి మృతి చెందారనడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పంజాబ్ యూనివర్సిటీలో చదవి రోజుల్లో మనోముత్తు స్విమ్మింగ్ క్లబ్ సభ్యుడని తెలిపారు. అలాంటి వాడు స్విమ్మింగ్ ఫూల్ లో పడి ఎలా చనిపోతాడని ఆయన ప్రశ్నించారు. మద్యం మత్తులో నీటిలో మునిగిపోయి చనిపోయాడన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అతడికి ఎటువంటి చెడు అలవాట్లు లేవని వెల్లడించారు. హిమచల్ ప్రదేశ్కు చెందిన 31 ఏళ్ల మనోముత్తు మానవ్- జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతూ ఈనెల 29న అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement