-
పోలీసుల కళ్లెదుటే ‘మణిపూర్ ఘోరం’
మణిపుర్లో మైతీ తెగకు చెందిన మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ తెగ మహిళను నగ్నంగా ఊరేగించి.. లైంగిక హింసకు పాల్పడిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్లో షాకింగ్ విషయాలను వెల్లడించింది. బాధిత మహిళలు సాయం చేయమని కోరినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, వారు ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిగుంపుకే సహకరించేలా వ్యవహరించారని తెలిపింది.కాంగ్పోక్పీ జిల్లాలో మైతీ అల్లరిగుంపు చేతికి చిక్కిన ఇద్దరు కుకీ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులే స్వయంగా బాధితులను ఆ అల్లరిగుంపకు అప్పగించినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అల్లరి మూక ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.బాధితురాళ్లలో ఒక మహిళ తమను కాపాడి, సురక్షిత ప్రాంతాని తీసుకుళ్లాలని పోలీసులను కోరారు. అయితే జీపు తాళాలు తమ వద్ద లేవని పోలీసులు అబద్దాలు చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్ పేర్కొంది. మరోవైపు.. అల్లరిగుంపు చేతికి చిక్కిన మూడో మహిళ వారి నుంచి త్రుటిలో తప్పించుకొంది.గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు అయింది.ఈ దాడుల్లో అల్లరిగుంపు చేతిలో మృతిచెందిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు తెలిపింది. మైతీ గుంపు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి.. పోలీసులు పారిపోయినట్లు సీబీఐ మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది. -
Manipur: తోటి సిబ్బందిపై కాల్పులు జరిపి జవాన్ ఆత్మహత్య
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. అస్సాం రైఫిల్స్కు చెందిన ఓ సైనికుడు తోటి సిబ్బందిపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకొని మరణించాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దక్షిణ మణిపూర్లోని మయన్మార్ సరిహద్దు సమీపంలో మోహరించిన అస్సాం రైఫిల్స్ బెటాలియన్లో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ కాల్పులకు మణిపూర్లో కొనసాగుతున్న జాతుల ఘర్షణతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు వెల్లడించారు. కాగా కాల్పులకు పాల్పడిన సైనికుడిది రాష్ట్రంలో హింసకు కేంద్ర బిందువైన మయన్మార్ సరిహద్దు ప్రాంతం చురాచాంద్పుర్ కావడం గమనార్హం. అతడు కుకీ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే గాయపడిన ఆరుగురు సైనికులు మణిపూర్కు గానీ, మైతీ చెందిన వారు కాదని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షతగాత్రులను ఆర్మీ ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. మణిపూర్లో గత ఏడాది మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం విదితమే. అప్పటి నుంచి అడపాదడపా హింసాత్మక సంఘటనలు నమోదవుతునే ఉన్నాయి. అధికారులు, పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఇటీవల ఈశాన్య రాష్ట్రంలో మరోసారి కాల్పుల మోత మోగింది. వివిధ ఘటనల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: రాహుల్ భద్రతపై అమిత్షాకు ఖర్గే లేఖ -
మణిపూర్ హింసాకాండ.. మేం 4 రోజుల్లో ఆపేవాళ్లం: రాహుల్
కలియబోర్: ప్రధానమంత్రి పదవిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఉండి ఉంటే మణిపూర్లో హింసకు నాలుగు రోజుల్లోనే పుల్స్టాప్ పడి ఉండేదని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం అస్సామ్లోని నగావ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ తలుచుకుంటే మణిపూర్ హింసను సైన్యం సాయంతో మూడు రోజుల్లో ఆపగలిగేవారని అన్నారు. కానీ, అలా చేయడం బీజేపీకి ఇష్టం లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘మణిపూర్ నాలుగు నెలలుగా మండుతున్నా, మన ప్రధాని ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదు. అదే కాంగ్రెస్ ప్రధానే ఉంటే మూడు రోజుల్లోనే అక్కడికి వెళ్లి ఉండేవారు. నాలుగో రోజుకల్లా అక్కడ హింస ఆగిపోయి ఉండేది’అని ఆయన చెప్పారు. ‘నేతలు వస్తుంటారు, పోతుంటారు. కానీ, మనస్సు నిండా విద్వేషాన్ని, అహంకారాన్ని నింపుకున్న వారు త్వరలోనే కనుమరుగవుతారు’అని రాహుల్ పేర్కొన్నారు. జై శ్రీ రాం, మోదీ నినాదాలు, రాహుల్ ఫ్లయింగ్ కిస్లు... నగావ్ జిల్లాలో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్కు నిరసన సెగ తగిలింది. ఒక చోట బీజేపీ కార్యకర్తలు జై శ్రీ రాం, మోదీ, మోదీ.. అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్లు విసురుతూ వారిని కలుసుకునేందుకు వెళ్లారు. సంబంధిత వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. తర్వాత ర్యాలీలో మాట్లాడుతూ.. ‘సుమారు 3 కిలోమీటర్ల దూరంలో 20 నుంచి 25 మంది వరకు బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని మా బస్సు ముందుకు వచ్చారు. నేను బస్సు దిగి వచ్చే సరికి వారంతా పారిపోయారు. ప్రధాని మోదీ, సీఎం హిమంత బిశ్వశర్మ ఎవరొచ్చినా మేం భయపడేది లేదు’అని రాహుల్ తెలిపారు. -
Manipur: భద్రతా బలగాలపైకి మిలిటెంట్ల దాడులు
ఇంఫాల్: జాతుల వైరంతో ఘర్షణలమయమైన మణిపూర్లో ఈసారి భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్లకు మధ్య పరస్పర కాల్పుల పర్వం కొనసాగుతోంది. తొలుత మయన్మార్ సరిహద్దులోని మోరె పట్టణంలో భద్రతా బలగాల పోస్ట్పై మిలిటెంట్లు దాడి చేయడంతో ఈ ఎదురుకాల్పులు మొదలయ్యాయి. గత ఏడాది అక్టోబర్లో మోరె సబ్డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చంగ్థమ్ ఆనంద్ను కుకీ మిలిటెంట్లు హత్య చేసిన ఘటనలో మంగళవారం మోరె పట్టణంలో పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్ట్చేశారు. ఈ అరెస్ట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొందరు మహిళల బృందం పోలీస్స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మోరె పట్టణంలోని భద్రతాబలగాల పోస్ట్పై కాల్పులు జరిపారు. రాకెట్ ఆధారిత గ్రనేడ్లు విసిరారు. బలగాల పోస్ట్ వద్ద వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. వెంటనే తేరుకున్న బలగాలు మిలిటెంట్లపై కాల్పులు జరిపాయి. మోరె పట్టణం సహా ఛికిమ్ గ్రామంలో, వార్డ్ నంబర్ ఏడులోనూ ఇలా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఒక ఆలయం సమీపంలో మిలిటెంట్లు జరిపిన మెరుపుదాడిలో స్టేట్ పోలీస్ కమాండో వాంగ్కెమ్ సోమర్జిత్ మరణించారు. మరో చోట జరిపిన కాల్పుల్లో మరో పోలీస్ తఖెల్లబమ్ శైలేశ్వర్ ప్రాణాలు కోల్పోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో తెంగ్నౌపాల్ జిల్లాలో మణిపూర్ సర్కార్ కర్ఫ్యూను విధించింది. ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ మేజి్రస్టేట్ తొమ్మిది రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. హెలికాప్టర్లు ఇప్పించండి రోడ్డు మార్గంలో బలగాల తరలింపు సమయంలో మిలిటెంట్ల మెరుపుదాడుల నేపథ్యంలో బలగాల తరలింపు, మొహరింపు, క్షతగాత్రుల తరలింపు, వైద్య సేవల కోసం హెలికాప్టర్లను ఇవ్వాలని కేంద్ర హోం శాఖను మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అభ్యరి్థంచింది. రాష్ట్రంలో మళ్లీ మొదలైన ఘర్షణలు, ఉద్రిక్తతలపై ముఖ్యమంత్రి బీరెన్æ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తాజా ఉద్రిక్తతల్లో మయన్మార్ శక్తుల ప్రమేయం ఉండొచ్చని సీఎం అనుమానం వ్యక్తంచేశారు. -
మణిపుర్ హింసకు పరిష్కార మార్గం
ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో నూతన సంవత్సర ప్రారంభంలోనే తిరిగి హింసాకాండ చెలరేగింది. రెండు వైపులా భారీగా సాయుధ మిలిటెంట్ల ఉనికి ఉండటంతో సమూహాల మధ్య విశ్వాసం పాదుకోవడం కష్టమవుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి అక్కడి ప్రధాన తెగలైన మైతేయిలు, కుకీలు, నాగాల మధ్య సంబంధాలు సంఘర్షణ, ఉద్రిక్తతలు, అపార్థాలతో నిండి ఉన్నప్పటికీ... వారు కలిసి జీవించారు. పరస్పర వివాహాలు చేసుకున్నారు. నెల్సన్ మండేలా నేతృత్వంలో దక్షిణాఫ్రికాలో సయోధ్యకు చేపట్టిన చర్యలే... మణిపుర్ ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడానికి పరిష్కార మార్గం. ముందుగా మణిపుర్ కొండలు, లోయలలో కాల్పుల శబ్దాలు ఆగవలసి ఉంటుంది. ఈ పని బహుశా కేంద్ర బలగాలు మాత్రమే చేయగలవు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే సుందర మైన ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో తాజా దశ హింసాకాండ చెలరేగింది. మొదటి దశలో నమోదైన జాతిపర మైన ఉన్మాదం, ఇప్పుడు సాయుధ సమూహాల మధ్య క్రూరమైన పాశ్చాత్య తరహా తుపాకీ కాల్పుల స్థాయికి దిగజారింది. మొదటి కొన్ని నెలల హింస ఫలితంగా అక్కడ కనిపించని జాతిపరమైన సరిహద్దులు ఏర్పడ్డాయి. మైతేయిలు ఎల్లప్పుడూ ఆధిపత్యం వహించే ఇంఫాల్ లోయ నుండి కుకీలు, జోలు, ఇతర గిరిజనులు నిష్క్రమించారు. గిరిజనుల ఆధ్వర్యంలో నడిచే కొండ జిల్లాలను మైతేయిలు ఖాళీ చేశారు. 1947లో పంజాబ్లో మతపరమైన ఉద్రిక్తతలతో జరిగిన నిర్మూలనా కాండను ఇది తలపిస్తోంది. అస్సాం రైఫిల్స్, ఆర్మీ రెజిమెంట్లు మైతేయి ప్రాంతాలు, కుకీలు, పైతీలు వంటి ఇతర గిరిజనులు నివసించే ప్రాంతాలకు మధ్య తటస్థ జోన్ లను సృష్టించాయి. దీనివల్ల తమ ఆధిపత్య ప్రాంతాన్ని విస్తరించడానికి కొన్ని సమయాల్లో ఏదో ఒక వర్గం చేసే ప్రయత్నాల వల్ల అస్థిరమైన శాంతి కొనసాగుతోంది. కాంగ్లీపాక్ తిరుగుబాటు వర్గాలకు చెందిన విçస్తృతమైన నెట్వర్క్ ఒకప్పుడు ఇంఫాల్ లోయను పీడించింది. గత రెండు దశాబ్దాల కాలంలో దాన్ని అణచిపెట్టారు. అది ఇప్పుడు పునరుజ్జీవితమైందనీ, రాష్ట్ర పోలీసు దళం నుండి ‘దోచు కున్న’ ఆయుధాలతో కొందరు సాయుధులయ్యారనీ తెలుస్తోంది. లొంగిపోయి, అస్సాం రైఫిల్స్ నిఘా కళ్ల నీడన, శిబిరాల్లో నివసిస్తున్న కొంతమంది కుకీ మిలిటెంట్లు కూడా ఇదే విధమైన కక్షతో తప్పించుకుని ఉండవచ్చు. కొండ జిల్లాల్లోని సాయుధ గ్రామ అప్రమత్త కమిటీలలో చేరి ఉండవచ్చు కూడా. యుద్ధంలో యుద్ధం సమూహాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో రాష్ట్రంలో ‘యుద్ధంలో యుద్ధం’ జరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అదే సమయంలో సాధారణ శాంతిభద్రతలను సద్వినియోగం చేసు కుంటూ దోపిడీ, తుపాకుల సేకరణ, మాదక ద్రవ్యాల వ్యాపారంలో కూడా మునిగిపోతున్నారు. చారిత్రకంగా ఇది వారికి అలవాటైన విద్యే. వీటి సాయంతోనే సాధారణ ప్రజలను లూటీ చేసేవారు. మణి పుర్లోని చిన్న మైతేయి ముస్లిం సమాజమైన పంగల్లను మైతేయి మిలిటెంట్ గ్రూప్ లక్ష్యం చేసుకోవడం పరిస్థితుల పతనానికి పరా కాష్టగా కనబడుతోంది. అయితే, జాతుల మధ్య సంబంధాలను చక్కదిద్దే ప్రయత్నాలు శాంతి కమిటీల ద్వారా జరుగుతున్నాయి. అయినప్పటికీ, రెండు వైపులా భారీగా సాయుధ మిలిటెంట్ల ఉనికి ఉండటంతో విశ్వాసం పాదుకోవడం కష్టమవుతోంది. హింసను, సంక్షోభాన్ని పరిష్కరించ డంలో ప్రభుత్వ యంత్రాంగ అసమర్థత ఇప్పటికే కనీసం 180 మంది ప్రాణాలను బలిగొంది. దాదాపు 40,000 మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలలో ఆశ్రయం పొందారు. మయన్మార్ నుండి కుకీలు వెల్లువలా వచ్చి చేరడం, ఆ పొరుగు దేశంలో సంఘర్షణ ఫలితంగా ప్రవేశిస్తున్న శరణార్థులు కూడా మైతేయిల్లో అభద్రతా భావాన్ని పెంచాయి. కుకీ నేషనల్ ఆర్గనైజేషన్, కుకీ నేషనల్ ఆర్మీ (బర్మా) తమ ఏకైక పోరాటం మయన్మార్ రాజ్యా నికి వ్యతిరేకంగానేననీ, మణిపుర్లో తాము ఎటువంటి కాల్పులకు పాల్పడలేదనీ పదేపదే ప్రకటనలు జారీ చేస్తూ వచ్చాయి. అయినా వారి సిబ్బందిలో కొందరు స్వతంత్ర పద్ధతిలో వ్యవహరించడాన్ని తోసిపుచ్చలేము. కుకీ కొండ ప్రాంతాలలో దాదాపు పూర్తిగా మైతేయిలకు చెందిన రాష్ట్ర పోలీసు కమాండోలను ఉంచడాన్ని మణిపుర్ ప్రభుత్వం బలపరుస్తున్నందుకు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. భారతీయ శిక్షా స్మృతిలోని వివిధ సెక్షన్లను, అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను స్థానిక వార్తాపత్రికలకు చెందిన ఇద్దరు సంపాద కులను అరెస్టు చేయడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ దశలోనే హింసాకాండ జరిగింది. తరచుగా ఇంటర్నెట్ నిషేధాలు, ఇతర అవ రోధాల కారణంగా రిపోర్టింగ్ తీవ్రంగా నిరోధించబడిన రాష్ట్రంలో, తాజా అరెస్టులు ఏమాత్రం మంచివి కావు. సంఘర్షణ – స్నేహ చరిత్ర మణిపుర్లో సంఘర్షణలతో పాటు వర్గాల మధ్య స్నేహానికి కూడా సుదీర్ఘ చరిత్రే ఉంది. రాజులు ఇంఫాల్ లోయను పాలించినప్పుడు, నాగాలు, కుకీలు, ఇతర గిరిజనులు నివసించే కొండలపై వారి పట్టు చాలా తక్కువగా ఉండేది. గిరిజనులు కొండలను ‘సొంతం’ చేసుకున్నారు, తమ సొంత ఆచారాల ప్రకారం వారి జీవితాలను గడి పారు. రాజులు కూడా దానిని అంగీకరించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి మణిపుర్లోని మూడు ప్రధాన కమ్యూనిటీలైన మైతేయిలు, కుకీలు, నాగాల మధ్య సంబంధాలు కూడా సంఘర్షణ, ఉద్రిక్తతలు, అపార్థాలతో నిండి ఉన్నప్పటికీ, వారు కలిసి జీవించారు. పరస్పర వివాహాలు కూడా చేసుకున్నారు. తద్వారా సయోధ్యకు, శాంతికి అవకాశం ఏర్పడింది. 1944లో మూడు వర్గా లకు చెందిన యువకులు సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరారు. అది బర్మా నుండి భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. ఆజాద్ హింద్ ఫౌజ్ వెనుకంజ వేయడంతో చాలామంది తిరిగి రంగూన్ కు వెళ్లారు. స్వాతంత్య్రం కోసం యుద్ధంలో స్వచ్ఛందంగా పాల్గొన్న వారిలో మణిపుర్ మొదటి ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. పరిష్కారమేంటి? క్రైస్తవ మిషనరీలు కొండలపైకి తీసుకువచ్చిన విద్య మణిపుర్ గిరిజనుల సాధారణ శ్రేయస్సు స్థాయిని పెంచింది. షెడ్యూల్డ్ తెగ లుగా వారికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. మరోవైపు, రాష్ట్రంలోనే అత్యుత్తమ సాగు భూమి ఇంఫాల్ లోయలో ఉంది. ఇది చారిత్రకంగా మైతేయిలు ఆధిపత్యం చలాయించిన ప్రాంతం. గిరిజనులు తొమ్మిది రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉన్న కొండ ప్రాంతాలలో ఉన్నారు. కానీ వీటిలో సాగు యోగ్యమైనవి తక్కువ. జనాభాలో 53 శాతం ఉన్న మైతేయిలు వ్యవసాయం, పరిశ్ర మల్లో ముందంజలో ఉన్నారు. 2022లో ఎన్నికైన బీజేపీ నేతృత్వంలోని మణిపుర్ ప్రభుత్వం, కుకీ–జో ప్రజలు సాంప్రదాయ గిరిజన భూములుగా పిలిచే వాటిని రిజర్వుడ్ ఫారెస్టులుగా చెబుతూ వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేసింది. అలా ఉద్రిక్తతకు అవకాశం ఏర్ప డింది. ఇక, గతేడాది మే ప్రారంభంలో మెజారిటీగా ఉన్న మైతేయి లకు షెడ్యూల్డ్ తెగ హోదాను కల్పించే చర్యకు పూనుకున్నారు. దానికి వ్యతిరేకంగా గిరిజన సమూహాలు చేసిన ప్రదర్శనల ద్వారా హింసకు నాంది పడింది. అయితే, ఈ చర్యలను ప్రభుత్వం విరమించుకుంది. కుకీ–జో ప్రజలు మయన్మార్ నుండి తమ బంధువులను తీసుకు వస్తున్నారనీ, రాష్ట్రాన్ని ముంచెత్తడం ద్వారా రాష్ట్ర జనాభా నిష్పత్తుల రీతిని మార్చుతున్నారనీ మైతేయిల ఆందోళన. మాదక ద్రవ్యాలు, తుపాకీల సేకరణతో మాదక ద్రవ్యాల వ్యాపారానికి గేట్లు ఎత్తారనీ వీరి ఆరోపణ. (వాస్తవానికి ఇరు వర్గాలకు చెందిన సాయుధ మిలిటెంట్లు ఈ లాభదాయక ‘వ్యాపారం’లో పాల్గొంటున్నారు.) నెల్సన్ మండేలా నేతృత్వంలో దక్షిణాఫ్రికాలో సయోధ్యకు చేపట్టిన చర్యలే... మణిపుర్ ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడానికి పరిష్కార మార్గం. కాకపోతే దానికి మణిపూర్ కొండలు, లోయలలో కాల్పులు నిశ్శబ్దం కావలసి ఉంటుంది. రాష్ట్ర పోలీసులు పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నారని చాలామంది ఆరోపిస్తున్నారు కాబట్టి, ఈ పని బహుశా కేంద్ర బలగాలు మాత్రమే చేయగలవు. జయంత రాయ్ చౌధురీ వ్యాసకర్త ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఈశాన్య ప్రాంత మాజీ హెడ్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement