-
మహేందర్ది హత్యా ? ఆత్మహత్యా ?
నందిపేట్(ఆర్మూర్): సుపారీ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు.. పలు కేసుల్లో అత్యంత వివాదాస్పదుడు నందిపేట మండలం లక్కంపల్లి తాజామాజీ సర్పంచు సుమలత భర్త మూడ మహేందర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆర్మూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రధాన అనుచరుడిగా పేరుపొందిన ఆయన శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు మొదట ప్రచారం జరిగింది. అయితే శనివారం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో పోస్టుమా ర్టం నిర్వహించడంతో మహేందర్ది హత్యా ? ఆత్మహత్యా ? అనుమానాలతో చర్చనీయాంశమైంది. గత నెల 22న ఇద్దరు స్నేహితులు, ఇద్దరు పోలీసు శాఖకు చెందిన వారితో కలిసి గోవాకు వెళ్లిన మహేందర్ అక్కడ నిషేధిత డ్రగ్స్ అతిగా తీసుకుని పక్షవాతానికి గురైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసి ఆయన భార్య మరుసటి రోజు గోవాకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడి ఆస్పత్రిలో నాలుగు రోజుల చికిత్స అనంతరం ఒక పోలీస్ అధికారి సహాయంతో హైదారాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరిన మహేందర్ మృతి చెందాడు. కాగా ఆయనకు పక్షవాతం వచ్చిన విషయాన్ని, చివరికి చనిపోయిన మూడు గంటల వరకు ఎందుకు ఎవరికీ తెలియనీయలేదని, గుండె పోటుతో మరణిస్తే ఎందుకు పోస్టు మార్టం చేస్తారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్య ఫిర్యాదు.. గోవాలో మెడికల్ లీగల్ కేసుగా నమోదైనందున ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మహేందర్ మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు నందిపేట ఎస్సై రాహుల్ తెలిపారు. ఫిట్స్తో పాటు గుండెపోటుతో మృతి చెందినట్లు మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శనివారం స్వగ్రామంలో జరిగిన మహేందర్ అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, పలువురు తాజా మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. స్టేటస్లో ఫొటోలు.. ఓ వైపు పక్షవాతానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు మహేందర్ ఫోన్ స్టేటస్లో ప్రతిరోజు గోవాలో తిరుగుతున్నట్లు ఆయన ఫొటోలు దర్శన మిచ్చాయి. చివరికి ఆయన చనిపోయిన రోజు కూడా ఉదయం 10.36 గంటలకు స్టేటస్లో గోవా బీచ్ ఫొటోలు కనిపించాయి. మహేందర్ మృతి ఘటన వెనుక రహస్యాలను మరుగు పర్చడానికే ఇలా స్టేటస్లో ఫొటోలు అప్లోడ్ చేసి ఉంటారని అంటున్నారు. గోవాలో నిషేధిత డ్రగ్స్ స్వయంగా తీసుకున్నాడా.. అతనికి ఉన్న క్రిమినల్ నేపథ్యం వెనుక సూత్రధారులెవరైనా బలవంతంగా ఎక్కువ డోసులు ఇచ్చారా అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. -
తాంత్రికుడు వస్తున్నాడు
మహేందర్ వడ్లపట్ల, సన్నీ కునాల్, రాజేష్, అనూష, త్రివేణి నటించిన చిత్రం ‘తాంత్రికుడు’. సౌమ్య వడ్లపట్ల సమర్పణలో మహేందర్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం టీజర్ని మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాల చారి రిలీజ్ చేశారు. ‘‘మంచి చిత్రం తీయాలని అమెరికా నుండి వచ్చి, ‘తాంత్రికుడు’ తీశా’’ అన్నారు మహేందర్ వడ్లపట్ల. ఈ చిత్రానికి సంగీతం: కె. ఆనంద్, కెమెరా: వంశీ. -
ఉద్యోగం రాలేదని దివ్యాంగుడి ఆత్మహత్య
హైదరాబాద్: ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన ఓ దివ్యాంగుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం కోదాశపల్లికి చెందిన బి.మహేందర్(28) వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని మెడికేర్ ఆస్పత్రి సమీపంలోని దివ్యాంగుల వసతి గృహంలో పదేళ్లుగా ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ప్రభుత్వోద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామనుకున్న ఆ యువకుడి యత్నాలు తరచూ విఫలమ వుతుండటంతో మనస్తాపానికి గురై మంగళవారం ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో తోటి విద్యార్థులు కిటికీలో నుంచి చూడగా మహేందర్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
షాద్నగర్లో గోల్డెన్ గ్రీన్ కౌంటీ
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని అభిరామన్ డెవలపర్స్ పలు వెంచర్లకు శ్రీకారం చుట్టింది. అందుబాటు ధరల్లో సామాన్యుల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పలు భారీ ప్రాజెక్ట్లను అభివృద్ధి చేస్తున్నామని పదమూడేళ్లుగా స్థిరాస్తి రంగంలో అనుభవమున్న సంస్థ ఎండీ టీ మహేందర్ తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ♦ షాద్నగర్లోని సోలిపూర్ గ్రామంలో 25 ఎకరాల్లో గోల్డెన్ గ్రీన్ కౌంటీ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో మొత్తం 289 ఓపెన్ ప్లాట్లుంటాయి. 147 నుంచి వెయ్యి గజాల మధ్య ప్లాట్లున్నాయి. ధర గజానికి రూ.6,500. ♦ ఇప్పటికే వందకు పైగా ప్లాట్లు బుకింగ్ అయ్యాయి. 40, 60 ఫీట్ల రోడ్లు, పార్క్, ఓవర్ వాటర్హెడ్ ట్యాంక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటి వసతులుంటాయి. ♦ రావిర్యాలలోని వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్కు ఎదురుగా 6 ఎకరాల్లో వండర్ విల్లాస్ ప్రాజెక్ట్ను చేస్తున్నాం. ఇందులో 66 ప్లాట్లుంటాయి. 200 గజాల నుంచి 680 గజాల మధ్య ప్లాట్ల విస్తీర్ణాలున్నాయి. ధర గజానికి రూ.19 వేలు. ఇప్పటికే 40 ప్లాట్లు బుకింగ్ అయ్యాయి. ♦ శ్రీశైలం హైవే లోని ఫ్యాబ్సిటీ ప్రధాన ద్వారం ఎదురుగా డైమండ్ విల్లాస్ పేరిట 54 ఎకరాల్లో భారీ వెంచర్ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందు లో మొత్తం 218 ప్లాట్లుంటాయి. 120 గజాల నుంచి 1,200 గజాల మధ్య ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.10 వేలు. ఇప్పటికే 50 శాతం బుకింగ్ పూర్తయ్యాయి. రోడ్లు, పార్క్ వంటి అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి. అందుబాటుకే ఆదరణ సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వేలు చెబుతున్నాయి. దీంతో బడా డెవలపర్లు పునరాలోచనలో పడ్డారు. దిగ్గజాలైన నిర్మాణ సంస్థలు ఆర్ధిక మాంద్యం దెబ్బతో నీరసపడ్డాయి. ప్రవాస భారతీయులు, ఐటీ నిపుణులు అనుకున్నంత స్థాయిలో కొనుగోళ్లు జరపకపోవటమే ఇందుకు కారణం. దీంతో తక్కువ విస్తీర్ణం గల ఇళ్లకు శ్రీకారం చుట్టాయి. నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. విస్తీర్ణం తక్కువ గల ఫ్లాట్లను నిర్మించడానికి ప్రజయ్, జనప్రియ సంస్థలు ముందుకొచ్చాయి. కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.25 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువ. హైదరాబాద్ నిర్మాణ రంగం ఐటీ నిపుణుల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఆర్థిక మాంద్యం కనుమరుగు కావటంతో ఐటీ నిపుణులు అధికంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి. వీరికి స్థానిక అంశంతో సంబంధం లేదు. పైగా పుణె, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్లో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టి సారిస్తున్నారు. -
ఆర్టీసీ డిపో మేనేజర్ ఆత్మహత్య
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఆర్టీసీ డిపో మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్టీసీ డిపో మేనేజర్ మహేందర్ మంగళవారం ఉదయం రోడ్డుపై శవమై కనిపించారు. ఆయన పక్కనే పురుగుల మందు డబ్బా కూడా ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మహేందర్ రెండు రోజులుగా సెలవులో ఉన్నారు. కరీంనగర్-2 డిపోలో పనిచేసి పదోన్నతిపై మే నెలలో నారాయణ ఖేడ్ కు వచ్చారు. సోమవారం కరీంనగర్ నుంచి వచ్చిన ఆయన తన జీపు డ్రైవర్కు కొడుకు ఫోన్ నెంబరు ఇచ్చారని, మధ్యాహ్నం డిపో అసిస్టెంట్ మేనేజర్కు తన సెల్ఫోన్ అప్పగించాడని చెబుతున్నారు. ఈ ఉదయం వాకింగ్కు వెళ్లిన మహేందర్ రోడ్డుపై పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు డిపో అసిస్టెంట్ మేనేజర్ ద్వారా మహేందర్ గా గుర్తించారు. అతని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మహేందర్ స్వస్థలం కరీంనగర్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement