-
రెండో స్థానంలో లలిత్బాబు
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎం.ఆర్ లలిత్బాబు సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీలోని లీలా అంబియెన్స్ కన్వెన్షన్ హోటల్లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఏడు రౌండ్లు ముగిసేసరికి 5.5 పాయింట్లతో లలిత్ మరో నలుగురితో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన ఏడో రౌండ్లో మాజీ జాతీయ చాంపియన్ జి. ఆకాశ్పై లలిత్బాబు విజయం సాధించాడు. సంకల్ప్ గుప్తా, దేబాశిష్ దాస్, పి. కార్తీకేయన్, నుబర్షా షేక్ కూడా 5.5 పాయింట్లతో ఉన్నారు. ఆరు పాయింట్లు సాధించిన వైభవ్, నితిన్ ప్రస్తుతం ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. -
లలిత్కు మూడో గెలుపు
కోల్కతా: కోల్కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు మూడో విజయం నమోదు చేశాడు. నితిన్ (రైల్వేస్)తో ఆదివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్లో తెల్లపావులతో ఆడిన లలిత్ 34 ఎత్తుల్లో గెలుపొందాడు. రత్నాకరన్ (భారత్)తో జరిగిన మరో గేమ్లో తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్ 42 ఎత్తుల్లో విజయం సాధించాడు. హర్ష భరతకోటి, రవితేజ మధ్య జరిగిన గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఏడో రౌండ్ తర్వాత లలిత్, అర్జున్ 5.5 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. -
విజేత లలిత్ బాబు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబు దేశవాళీ ప్రతిష్టాత్మక జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. బిహార్లోని పట్నాలో శుక్రవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో లలిత్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 14 మంది అగ్రశ్రేణి క్రీడాకారుల మధ్య 13 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 24 ఏళ్ల లలిత్ బాబు పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్పీబీ) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆరు గేముల్లో గెలిచిన అతను ఒక గేమ్లో ఓడిపోయి, మరో ఆరు గేమ్లను ‘డ్రా’ చేసుకున్నాడు. రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) గ్రాండ్మాస్టర్ స్వప్నిల్ ధోపాడేతో జరిగిన చివరిదైన 13వ రౌండ్ గేమ్ను లలిత్ కేవలం 14 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. అంతకుముందు లలిత్ 44 ఎత్తుల్లో ఎస్. నితిన్ (ఆర్ఎస్పీబీ)పై; 29 ఎత్తుల్లో దేబాశిష్ దాస్ (ఒడిశా)పై; 57 ఎత్తుల్లో ఆర్.ఆర్. లక్ష్మణ్ (ఆర్ఎస్పీబీ)పై; 46 ఎత్తుల్లో అరవింద్ చిదంబరం (తమిళనాడు)పై; 54 ఎత్తుల్లో జయకుమార్ (మహారాష్ట్ర)పై; 39 ఎత్తుల్లో సునీల్దత్ నారాయణన్ (కేరళ)పై గెలిచాడు. శ్యామ్ నిఖిల్ (ఆర్ఎస్పీబీ)తో 26 ఎత్తుల్లో; హిమాంశు శర్మ (ఆర్ఎస్పీబీ)తో 57 ఎత్తుల్లో; ఆర్గ్యదీప్ దాస్ (ఆర్ఎస్పీబీ)తో 21 ఎత్తుల్లో; అభిజిత్ కుంతే (పీఎస్పీబీ)తో 28 ఎత్తుల్లో; దీపన్ చక్రవర్తి (ఆర్ఎస్పీబీ)తో 56 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మురళి కార్తికేయన్ (తమిళనాడు) చేతిలో మాత్రం 31 ఎత్తుల్లో ఓడిపోయాడు. మరోవైపు 8.5 పాయింట్లతో అరవింద్ చిదంబరం రన్నరప్గా నిలువగా... 7.5 పాయింట్లతో మురళి కార్తికేయన్ మూడో స్థానాన్ని సంపాదించాడు. ఎన్నాళ్లకెన్నాళ్లకు... జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్షిప్కు 62 ఏళ్ల చరిత్ర ఉంది. ఆంధ్ర స్టేట్ చెస్ సంఘం ఆధ్వర్యంలో 1955లో ఏలూరులో తొలిసారి ఈ చాంపియన్షిప్ జరిగింది. రామచంద్ర సాప్రే (మహారాష్ట్ర), డి. వెంకయ్య (ఆంధ్రప్రదేశ్) సంయుక్త విజేతలుగా నిలిచారు. 1955లో వెంకయ్య తర్వాత ఈ పోటీల్లో లలిత్ బాబు రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్కు టైటిల్ దక్కడం విశేషం. మాన్యుయల్ ఆరోన్ (తమిళనాడు) అత్యధికంగా తొమ్మిదిసార్లు ఈ టైటిల్ను దక్కించుకోగా... ప్రవీణ్ థిప్పే (మహారాష్ట్ర) ఏడుసార్లు, సూర్యశేఖర గంగూలీ (బెంగాల్) ఆరుసార్లు, కృష్ణన్ శశికిరణ్ (తమిళనాడు) నాలుగుసార్లు, విశ్వనాథన్ ఆనంద్ (తమిళనాడు) మూడుసార్లు ఈ చాంపియన్షిప్లో విజేతలుగా నిలిచారు. తొలిసారి జాతీయ చాంపియన్షిప్ టైటిల్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. గత రెండేళ్లుగా నా ప్రదర్శన ఆశించినస్థాయిలో లేదు. తాజా ఫలితం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం రెండు నెలలుగా కోచ్ మురళీకృష్ణతో కలిసి ప్రాక్టీస్ చేశాను. ఈ సన్నాహాలు టోర్నీ సందర్భంగా ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ టోర్నీలో నేను తొమ్మిది మంది గ్రాండ్మాస్టర్లతో తలపడ్డాను. నలుగురిపై గెలిచి, మరో నలుగురితో గేమ్లు ‘డ్రా’ చేసుకున్నాను. వచ్చే సీజన్లోనూ మరింత నిలకడగా ఆడి మరిన్ని విజయాలు సాధించాలని పట్టుదలతో ఉన్నాను. – ‘సాక్షి’తో లలిత్ బాబు -
రెండో సీడ్గా లలిత్ బాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ లలిత్ బాబు ఢిల్లీ అంతర్జాతీయ చెస్ టోర్నీలో రెండో సీడ్గా బరిలోకి దిగుతున్నాడు. సోమవారం మొదలయ్యే ఈ టోర్నీలో మూడు కేటగిరీల్లో 28 దేశాలకు చెందిన 1800 మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. రూ. 51 లక్షల 51 వేల ప్రైజ్మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో తజికిస్తాన్ జీఎం ఫరూఖ్కు టాప్ సీడింగ్ దక్కింది. -
లలిత్, ప్రత్యూష గెలుపు
తాష్కెంట్: ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎం.ఆర్.లలిత్ బాబు, బొడ్డ ప్రత్యూష విజయాలు సాధించారు. శనివారం జరిగిన ఓపెన్ కేటగిరి మూడో రౌండ్లో లలిత్ బాబు 41 ఎత్తుల్లో మసూద్ (ఇరాన్)పై గెలుపొందగా... మహిళల విభాగంలో ప్రత్యూష 35 ఎత్తుల్లో బషీరా (యూఏఈ)పై విజయం సాధించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
మరోసారి ఉల్లంఘిస్తే జైలు తప్పదు..
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement