-
కృష్ణా పుష్కరాలకు 202 రైలు సర్వీసులు
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా పుష్కరాలకు ైరె ల్వే శాఖ ఈసారి కాస్త ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కృష్ణా పుష్కరాలకు కూడా ‘గోదావరి’ తరహాలో రద్దీ ఉంటుందని భావిస్తున్న రైల్వే తొలిదఫాగా 202 సర్వీసులను ప్రకటించింది. పుష్కరాలు మొదలయ్యాక పరిస్థితిని బట్టి మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఉమాశంకర్కుమార్ బుధవారం విడుదుల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-కాకినాడ పోర్టు మధ్య ఆగస్టు 11 నుంచి 24 వరకు రెండు వైపులా కలిపి 28 సర్వీసులుంటాయి. తిరుపతి-కాకినాడ మధ్య ఆగస్టు 11 నుంచి 24 వరకు 28 సర్వీసులు, కాచిగూడ-కాకినాడ మధ్య ఆగస్టు 15 నుంచి 22 వరకు నాలుగు సర్వీసులు, తిరుపతి-విశాఖపట్నం మధ్య 12 నుంచి 19 వరకు నాలుగు సర్వీసులు, విజయవాడ-విశాఖపట్నం మధ్య 11 నుంచి 14, 18 నుంచి 21 వరకు 16 సర్వీసులు, హైదరాబాద్-గద్వాల మధ్య 11, 18 తేదీల్లో నాలుగు సర్వీసులుంటాయి. మణుగూరు-తెనాలి మధ్య 12 నుంచి 23 తేదీ వరకు 24 సర్వీసులు, విజయవాడ-ఒంగోలు మధ్య 12, 14, 16, 18, 20, 22 తేదీల్లో 12 సర్వీసులు, హైదరాబాద్-గుంటూరు మధ్య 12 నుంచి 23 తేదీ వరకు 24 సర్వీసులుంటాయి. తిరుపతి-రాజమండ్రి మధ్య 14 నుంచి 21 వరకు రెండు వైపులా 10 సర్వీసులు, గుంతకల్-కృష్ణా మధ్య రెండు వైపులా 12, 14, 16, 18, 20, 22 తేదీల్లో 12 సర్వీసులు, గుంతకల్-విజయవాడ మధ్య 12, 14, 16, 18, 20, 22 తేదీల్లో తిరుగుప్రయాణంలో 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో 12 సర్వీసులుం టాయి. సికింద్రాబాద్- గద్వాల మధ్య 12 నుంచి 23 వరకు 24 సర్వీసులు నడుస్తాయి. రైలు నెంబర్లు, సమయాలు దక్షిణ మధ్య రైల్వే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్ బుకింగ్స్ గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. -
టీడీపీ, బీజేపీ మధ్య వార్!
సాక్షి, విజయవాడ : కృష్ణాపుష్కరాల పేరుతో విజయవాడలో కలెక్టర్ అహ్మద్ బాబు, ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడ్డగోలుగా దేవాలయాలు కూల్చివేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటివరకు కిందిస్థాయి నేతలే టీడీపీ చర్యల్ని ఖండిస్తుంటే.. తాజాగా బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు దేవాలయాలు, గోశాలల కూల్చివేతపై మండిపడ్డారు. టీడీపీ నేతలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చారిత్రక ఆలయాలు.. పురాతన గోశాల.. పుష్కరాలకు అభివృద్ధి పేరుతో ఎంతో చారిత్రకమైన సీతమ్మవారి పాదాలు, శనీశ్వరస్వామి దేవాలయం, భూగర్భ వినాయకుడు, సాయిబాబా మందిరం తదితర 25కి పైగా దేవాలయాలను, 350 ఆవులకు ఆశ్రయమిచ్చే గోశాలను అధికారులు అడ్డగోలుగా కూల్చివేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత విపరీతమైన పోలీసు బందోబస్తు మధ్య భక్తులు అడ్డుకుంటున్నా లెక్కచేయకుండా కూల్చివేయడం నగరంలోనే పెద్ద సంచలనంగా మారింది. గోశాలను కూల్చివేయవద్దంటూ ఎంపీ కేశినేని శ్రీనివాస్కు విన్నవించుకునేందుకు వెళ్లిన గోశాల నిర్వాహకులు ఆయన ఛీత్కారాలను చవిచూశారు. వారిని లాలూప్రసాద్ యాదవ్తో పోల్చుతూ గడ్డి తింటారా..? అంటూ ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలు వీడియోల రూపంలో నగరంలోని ప్రతిఒక్కరి వాట్స్యాప్లో దర్శనమిచ్చాయి. దేవాలయాలను అడ్డంగా కూల్చివేయడం, వ్యాపారుల్ని ఎంపీ కేశినేని చులకనగా భావించడం బీజేపీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. నగరంలో టీడీపీ చేస్తున్న అరాచకాలను బీజేపీ జాతీయ నేతలకు స్థానిక నేతలు ఎప్పటికప్పుడు చేరవేశారు. రంగంలోకి దిగిన ఎంపీ గోకరాజు ముఖ్య దేవాలయాలను టీడీపీ నేతలు కూల్చివేసిన ఘటన టీడీపీ, బీజేపీకి మధ్య ఉన్న విభేదాలను మరింతగా పెంచింది. అధిష్టానం ఆదేశాల మేరకు నరసాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు రంగంలోకి దిగి టీడీపీ నేతలు చేస్తున్న దేవాలయాల కూల్చివేత కార్యక్రమానికి తాము ఎంతమాత్రం మద్దతు తెలపబోమంటూ గురువారం బహిరంగంగానే ప్రకటించారు. టీడీపీ నేతలు పోలీ సులను సైతం ఏరా, ఓరే అంటూ పిలుస్తూ పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నారన్నారు. గోశాల కూల్చివేతను అడ్డుకునే వ్యాపారులను ఏ విధంగా వ్యాపారాలు చేస్తారంటూ బెదిరించారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరూ బెదిరింపులకు భయపడాల్సిన పరిస్థితి లేదని, బాధితులకు తాము అండగా ఉంటామని గంగరాజు హామీ ఇచ్చారు. అభివృద్ధి పేరుతో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. గంగరాజు చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఖండిస్తూ.. అభివృద్ధిని ఎంపీ గంగరాజు అడ్డుకుంటే తాము సహించబోమంటూ హెచ్చరికలు చేశారు. దేవాలయాల కూల్చివేత కార్యక్రమాన్ని పీఠాధిపతులు సీరియస్గానే తీసుకుంటున్నారు. నగరానికి సమీపంలో ఉండే శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి గోకరాజు గంగరాజుతో కలిసి నాలుగో తేదీన నగరంలో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో 352 మంది స్వాములు, పీఠాధిపతులు పాల్గొంటారని శివస్వామి చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement