-
కొక్కొరొకో.. ఎంత సొగసో.. అందాల పోటీలకు సై అంటున్న కోడిపుంజులు
‘‘నడత హుందాగా ఉండాలి..నడకలో హొయలొలకాలి..రంగు మెరిపించాలి.. పొంగు భళా అనిపించాలి..’’ ఇవి గ్లామర్ కాంటెస్ట్లో పోటీపడే బ్యూటీలకు కావాల్సిన అర్హతలని చదువుతుంటేనే అర్థమైపోతుంది. అయితే ఆ అందం గంప కింద నుంచి రావాలి అనే కొత్త రూల్ చదివితే మాత్రం మైండ్ బ్లాంకైపోతుంది. అవును.. ఆ గంప కింద ఉన్న కోడి ఇప్పుడు అందాల ర్యాంప్పైన కూస్తోంది. తోటి కోళ్లతో పోటీపడి మరీ వయ్యారాలొలకబోస్తోంది. అందాల కోడి కిరీటం కోసం ‘సై’ అంటోంది. కోడేమిటి? అందాల పోటీలేమిటి? సమాధానమే ఈ కథనం..ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా మరి.. కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ బాష ..పక్షి ప్రేమికుడు. ఇతని వద్ద రకరకాల పక్షులతోపాటు వివిధ రకాల కోడి పుంజులు, పెట్టలు ఉన్నాయి. ప్రత్యేకంగా కనిపిస్తున్న పుంజుల గురించి అడగగా..ఇవి అందాల పోటీల కోళ్లని చెప్పడంతో ఆశ్చర్యపోయాం.. వాటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది. అందాల పోటీలా? ఎక్కడ జరుగుతున్నాయి..? ఏంటి ప్రత్యేకతలు అని ప్రశ్నించాం.. మనకు సంప్రదాయ బద్ధంగా సంక్రాంతికి గోదారోళ్లు నిర్వహించే కోడి పందేల్లా..తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దాదాపు 50 సంవత్సరాలుగా అందాల పోటీలు నిర్వహిస్తున్నారని చెప్పాడు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఈ పోటీలకు హాజరవుతున్నాం. ఈ సారి రాష్ట్రంలోని పెంపకందారులం అందరం కలసి అసోసియేషన్గా ఏర్పడ్డాం. అనంతపురం జిల్లాలో తొలిసారిగా సంక్రాంతికి కోడి అందాల పోటీలు నిర్వహించారని చెప్పాడు. తమిళనాడు, కేరళ, కర్నాటక, చత్తీస్ఘడ్, ఒడిసా, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల వారు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. వయ్యారాలొలకబోసే కోడి పుంజుల ప్రత్యేకతలు తెలుసుకుందాం.. ఆహార్యం..అద్భుతం ఈ పోటీల్లో పాల్గొనే పుంజులు ప్రత్యేక ఆహార్యాన్ని కలిగి ఉండాలి. తల నుంచి బాడీ, తోక, కాళ్ల వరకూ అన్నీ విభిన్నంగా ఉండాల్సిందే. మెడ నిటారుగా 90 డిగ్రీలో బాడీ ఉండాలి. తెల్ల కళ్లు బెస్ట్ క్వాలిటీ..తలపై భాగం జుట్టు ఎర్రగా ఉండి గుండ్రంగా గులాబి రేకుల్లా ముద్దగా పువ్వు అతికించినట్టుగా ఉండాలి. బాడీ దృఢంగా ఉండి కాళ్లు..కాళ్లు మధ్య ఎడం ఉండాలి. బాడీ బిల్డర్ ఎలా నడుస్తాడో అలా నడకలో స్టైల్ ఉండాలి. కాళ్ల వేళ్లు పొడవుగా చక్కగా ఉండాలి. తోక అందంగా ఉండి ఈకలు దుబ్బగా ఉండాలి. తెలుపు, రెడ్, బ్లాక్ కిరీ ఇలా కోడి మొత్తం ఫ్యాన్సీ కలర్లో ఉంటే అందరూ ఇష్టపడతారు. ఎంపిక ఇలా.. అందాల పోటీల ఎంపిక ఇలా ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన కోళ్లను ముందుగా నిర్వాహకులు పరిశీలిస్తారు. అర్హమైన వాటిని గుర్తిస్తారు. వాటికి నంబర్తో కూడిన ట్యాగ్లు ఇస్తారు. ఐదుగురు న్యాయనిర్ణేతలు ఉంటారు. అందులో ప్రభుత్వాధికారులు (పశుసంవర్ధకశాఖకు చెందిన) కూడా ఉంటారు. మధ్యలో ఒక టేబుల్ ఏర్పాటు చేస్తారు. నంబర్ ప్రకారం పిలుస్తారు. టేబుల్పై ఉంచిన పుంజును జడ్జిలు పరిశీలించి మార్కులు ఇస్తారు. ఒకరు ముక్కు నుంచి మెడ వరకూ ఎంత దూరం ఉంది అని పరిశీలిస్తారు. మరొకరు బాడీ స్టైల్, రంగు, కాళ్లు, కళ్లు ఇలా అన్నీ పరిశీలిస్తారు. ఈ ఐదుగురు ఇచ్చిన మార్కులను కలుపుతారు. అందులో ఎక్కువ మార్కులు వచ్చిన పుంజును విజేతగా ప్రకటిస్తారు. ప్రత్యేక శిక్షణ: పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పోటీలకు మూడు నెలల నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ శిక్షణ ఇస్తారు. బెదురు పోయేందుకు బాడీని నిమురుతారు. అలాగే నీళ్లతో తడుపుతారు. ఇసుకలో పొర్లిస్తారు. ఇలా చేయడం ద్వారా ఈక ఒత్తుగా ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెండేళ్లు పెంచుతారు. పోటీలకు సిద్ధమయ్యే పుంజులు ఏడు నుంచి ఎనిమిది కేజీల బరువు ఉండేలా చూసుకుంటారు. డబుల్ బాడీ వచ్చేలా ఫీడింగ్ ఇస్తారు. గంభీరంగా బాడీబిల్డర్లా ఉంటుంది. కాళ్లు దృఢంగా, పాదాలు పెద్ద పెద్దగా ఉండేలా చూసుకుంటారు. వీటిని ఎక్కువగా అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పెంచుతారు. పౌష్టికాహారం... ఈ పోటీలకు సిద్ధం చేసే పుంజులకు ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. జొన్నలు, రాగులు, గోధుమలు, సజ్జలు, మొక్కజొన్న, పెసలు, గుడ్డు, ఖర్జూరం, పిస్తా, బాదం, జీడిపప్పు, పండ్లు తినిపిస్తారు. రోజూ మూడు విడతలుగా ఆహారం ఇస్తారు. అరటి, ద్రాక్ష, దానిమ్మ, సమ్మర్లో వేడి తగ్గించేందుకు పుచ్చకాయ పెడతారు. ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకూ కొలత ప్రకారం జొన్నలు, రాగులు, సజ్జ, మొక్కజొన్న, పెసలు, గోధుమలు ఇస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు కోడి గుడ్డు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినిపిస్తారు. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు అరటి, దానిమ్మ, ద్రాక్ష పండ్లు ఇస్తారు. ఇలా క్రమం తప్పకుండా ఆహారం ఇవ్వడంతో శరీరం బలిష్టంగా ఉంటుంది. అందాల పోటీలకు ఒక కోడిని తయారు చేసేందుకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. చిన్నప్పటి నుంచి మంచి ఆహారాన్ని ఇస్తే ఎదుగుదల బాగుంటుంది. క్రాస్ బ్రీడింగ్.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉండే బ్రీడర్ దగ్గర నుంచి బ్రీడ్ తెచ్చుకుంటారు. ఇక్కడ పెట్టలతో క్రాస్ బ్రీడ్ చేస్తారు. అలా వచ్చిన పుంజులను రెండేళ్లపాటు పెంచుతారు. వీటి గుడ్డు కూడా చాలా విలువైంది. నాణ్యతను బట్టి రేటు ఉంటుంది. మన జిల్లాలో రూ.1000 ఉంటుంది. తమిళనాడులో అయితే రూ.5 వేల వరకూ ఉంటుంది. చిన్న, చిన్న పిల్లలను ఆసక్తి ఉన్నవారికి విక్రయిస్తుంటారు. ఆసక్తితోపాటు ఆదాయం.. చిన్నప్పటి నుంచి పక్షులను పెంచడం హాబీగా ఉండేది. తమిళనాడులో అందాల పోటీలు నిర్వహిస్తున్నారని మిత్రుడు చెప్పాడు. ఒకసారి వెళ్లి చూసి వచ్చిన తర్వాత కోడి పుంజులను పెంచాలన్న ఆసక్తి నెలకొంది. మంచి బ్రీడ్లను తీసుకొచ్చాను. అలా పుంజులను పోటీలకు సిద్ధం చేస్తున్నా. అనంతపురంలో తొలిసారిగా నిర్వహించిన పోటీలకు పుంజును తీసుకువెళ్లా. ఈ పోటీల్లో నాలుగో స్థానం వచ్చింది. వీటిని పెంచి ఆసక్తి ఉన్నవారికి విక్రయించడం ద్వారా ఉపాధి కూడా ఉంటోంది. – సయ్యద్ బాష, రాజుపాలెం, కొమరోలు మండలం చదవండి: బ్రాండెడ్ గుడ్డు గురూ.. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్! -
‘ఆ నలుగురూ’.. స్నేహితులే
కొమరోలు: కరోనా దెబ్బకు బంధాలన్నీ బలహీనమైపోతున్నాయి. కొన్ని రోజుల కిందట వరకు నవ్వుతూ పలకరించిన వారే.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. చుట్టుపక్కల ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే చాలు.. ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోతున్నారు. అంత్యక్రియలు చేసేందుకు సైతం ముందుకు రాలేనంతగా హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా కొందరు ముందుకు వచ్చి సాయం చేస్తూ ‘ఆ నలుగురు’గా నిలుస్తున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెబుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు గాదంశెట్టి గుప్తా(40) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 4 రోజుల కిందట రక్త పరీక్ష చేయించగా టైఫాయిడ్ అని తేలింది. దీంతో మందులు వాడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున జ్వరం అధికమై.. పరిస్థితి విషమించి మృతి చెందాడు. వైద్య సిబ్బంది వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. అయినా కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులెవరూ ముందుకురాలేదు. ఆయన కరోనాతోనే చనిపోయి ఉంటాడని బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఎవరూ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఇరుగు పొరుగు వాళ్లు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. వృద్ధులైన తల్లిదండ్రులేమో కుమారుడికి అంతిమ సంస్కారాలు నిర్వహించే స్థితిలో లేరు. బిడ్డలు కూడా లేరు. భార్య ఏమీ చేయలేక సాయం కోసం రోజంతా ఎదురుచూసింది. చివరకు స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ మౌలాలి, కొమరోలు, దద్దవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శులు రమణయ్య, సుబ్బారావు, మాజీ పోస్టల్ ఉద్యోగి థామ్సన్, ‘సాక్షి’ రిపోర్టర్ కృష్ణారెడ్డి... సోమవారం సాయంత్రం గాదంశెట్టి గుప్తా మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతేకాకుండా ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు.. కొంత నగదు సేకరించి అండగా నిలిచారు. చదవండి: కరోనా విషాదం: వలంటీర్లే ఆ నలుగురై -
ఆ ఊరే.. ఒక సైన్యం
కొమరోలు: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు ఆర్మీ జవాన్లు. ఆ ఊరిలో 86 కుటుంబాలు ఉంటే అందులో 130 మంది సైనికులు, మాజీ సైనికులే. వీరంతా ముస్లింలే కావడం మరో విశేషం. ప్రస్తుత కాలంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నా తమ ప్రాధాన్యత మాత్రం దేశ రక్షణకే అంటోంది.. ఈ గ్రామం. ఐదు దశాబ్దాల క్రితం నుంచే ఊరు మొత్తం దేశసేవకే అంకితమవుతూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఆ గ్రామమే.. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని మల్లారెడ్డిపల్లె. ఇండియన్ ఆర్మీకి వీర సైనికులను అందిస్తున్న ఈ గ్రామంపై ప్రత్యేక కథనం.. ఆయన పేరుతోనే ఊరు.. శతాబ్దం కిందట ఈ గ్రామ ప్రాంతానికి మల్లారెడ్డి అనే రైతు వలస వచ్చి వ్యవసాయం చేసుకుంటూ కొన్నాళ్లు అక్కడే ఉన్నారు. దీంతో ఊరిపేరు మల్లారెడ్డిపల్లెగా స్థిరపడిపోయింది. కాలక్రమేణా మల్లారెడ్డి కుటుంబీకులు గ్రామం నుంచి వలస వెళ్లిపోయారు. తర్వాత ముస్లింలు గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ముస్లింలు తప్ప మరే సామాజికవర్గానికి చెందినవారు లేరు. మల్లారెడ్డిపల్లె గ్రామం వ్యూ 5 దశాబ్దాల క్రితం నుంచే దేశసేవ.. మల్లారెడ్డిపల్లెలో మొత్తం 86 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఐదు దశాబ్దాల క్రితమే అంటే.. 1970 నుంచే దేశ సేవలో ఉన్నారు. పెద్దవాళ్లు ఉద్యోగ విరమణ చేశాక తమ పిల్లలను సైతం దేశ రక్షణకు అంకితం చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 130 మంది ఆర్మీ జవాన్లు, మాజీ సైనికులు ఉండగా వీరిలో ప్రస్తుతం 80 మంది దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒకరూ లేదా ఇద్దరు సైనికులుగా సేవలందిస్తుండటం విశేషం. పాకిస్థాన్తో జరిగిన పలు యుద్ధాల్లో పాల్గొని తమ సత్తా చాటిన సైనికులు ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామంలోనే ఉంటున్నారు. వ్యవసాయం చేసుకుంటూ అందులోనూ రాణిస్తున్నారు. మదరసా నిర్వహణ దేశ రక్షణలో రాణిస్తున్న మల్లారెడ్డిపల్లె గ్రామస్తులు తమ మాతృభాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. తమ మండలంలో ఉర్దూ పాఠశాల, ఉర్దూ ఉపాధ్యాయులు లేకపోవడంతో గ్రామస్తులే చందాలు వేసుకుని ఉర్దూ ఉపాధ్యాయుడిని నియమించుకున్నారు. ప్రైవేటు మదరసా నిర్వహిస్తూ 35 మంది విద్యార్థులకు ఉర్దూను నేర్పిస్తున్నారు. ప్రభుత్వం తమ గ్రామంలో ఉర్దూ పాఠశాల ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. సైన్యంలో 23 ఏళ్లపాటు విధులు నిర్వహించా.. 1981లో ఆర్మీలో జవానుగా చేరి 23 ఏళ్లపాటు విధులు నిర్వహించాను. కార్గిల్ యుద్ధంతోపాటు పలు యుద్ధాల్లో పాల్గొన్నా. – షేక్ మహబూబ్, మాజీ సైనికుడు 1971 పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొన్నా 1970లో ఆర్మీలో చేరాను. 1971లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడాను. ఆర్మీలో 24 ఏళ్లపాటు విధులు నిర్వహించి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నా. నా ముగ్గురు కుమారులు కూడా ఆర్మీలోనే ఉన్నారు. – షేక్ మదార్ వలి, మాజీ సైనికుడు నా ఇద్దరు కుమారులు కూడా ఆర్మీలోనే ఉన్నారు.. భారత సైన్యంలో 17 ఏళ్లపాటు జవాన్గా విధులు నిర్వహించాను. ప్రస్తుతం సైనికులకు గౌరవప్రదమైన వేతనాలు ఇస్తున్నారు. దేశం మీద ప్రేమతో నా ఇద్దరు కుమారులను కూడా ఆర్మీలోనే చేర్పించాను. – ఎం.మహబూబ్ బాషా, మాజీ సైనికుడు -
చెదలు పడుతున్న చరిత్ర
- పర్యాటక శోభను కోల్పోతున్న గుంటి లక్ష్మినరసింహస్వామి ఆలయం - శిలాజాలుగా మారుతున్న శాసనాలు - పట్టించుకోని దేవాదాయశాఖ - ఆలయ అభివృద్ధికి రాజకీయ గ్రహణం - స్వామి వారి ఆస్తులకు రక్షణ కరువాయే ఎంతో చరిత్ర ఉన్న, రాజులు కట్టించిన అతి పురాతన దేవాలయాలను ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో ఆ పురాతన దేవాలయ శోభను కోల్పోతుంది. అద్భుతమైన, ఆహ్లదకరమైన, ఎత్తైన, అతి పురాతన దేవాలయం కొమరోలు మండలం ఇడమకల్లు గ్రామానికి దక్షిణం వైపు వెలసిన శ్రీ గుంటి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం దుస్థితిపై ప్రత్యేక కథనం. ఇడమకల్లు (కొమరోలు): కొమరోలు మండలం ఇడమకల్లు గ్రామానికి దక్షిణం వైపు వెలసిన గుంటి లక్ష్మినరసింహ స్వామి దేవాలయాన్ని 15వ శతాబ్దపు కాలంలో విద్యారణ్య స్వాముల వారి పోద్బలంతో హిందు మతోద్దరణకు హరిహరరాయులు , బుక్కరాయులు దేవాలయాన్ని నిర్మించారు. 30 సంవత్సరాల కిందట వరకు కూడా ఈ దేవాలయం పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పటి పరిస్థితి అందుకు విరుద్ధం. ఆ దేవాలయంలో మూలవిరాట్ అయిన గుంటి లక్ష్మినరసింహ స్వామి శిలా ప్రతిమను దొంగలు తవ్వి అందులో ఉన్న బంగారాన్ని అపహరించి శిలను మాత్రం అక్కడే పడవేసి వెళ్లిపోయారు. ఆ తరువాత శిలాశాసనం, ధ్వజ స్తంభాన్ని కూడా వదలలేదు. వాటిని కూడా తవ్వకాలు జరిపారు దొంగలకు భారీగా బంగారు నిల్వలు దొరికినట్లు స్థానికులు తెలుపుతున్నారు. అతి పురాతన దేవాలయం కావటం, దేవాలయం రాజుల నాటివి కావడంతో భద్రత కరువైందని ప్రజలు, భక్తులు వాపోతున్నారు. చెక్కు చెదరని శాసనాలు: ఈ ప్రాంత దేవాలయాల్లోకెల్లా అతి పురాతనమైంది గుంటి లక్ష్మినరశింహస్వామి దేవాలం. దేవాలయం ఎత్తైన కొండ మీద ఉండటంతో ఆ ప్రాంతం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక్కడ అద్భుతమైన శిల్పాలు, శాసనాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా పర్యాటకులకు దర్శనమిస్తాయి. ఇంకో విశేషమేమిటంటే కొండ మీద పకృతి సహజసిద్ధంగా వెలసిన ఎత్తైన ఒంటి రాయి చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికీ ప్రతి శనివారం ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కొండపైన 15వ శతాబ్ధపు శిలా శాసనం కూడా ఉంది. రాజులు తయారుచేసిన శాసనాలను గతంలో పురావస్తుశాఖ వారు పరిశీలించేందుకు ఇక్కడి నుంచి కర్నూలుకు శాసనాలు ఉండే రాళ్లను తరలించారు. ఈ దేవాలయానికి కావల్సిన సాగు భూమి దాదాపు 30 ఏకరాలు ఉందని ఆ భూముల సర్వేనెంబర్లు వున్న అవి ఎక్కడ ఉన్నయో తెలియని పరిస్థితి. ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకొచ్చినా రాజకీయ కారణాలతో వెనుదిరగాల్సిన పరిస్థితి. పట్టించుకోని టీటీడీ, దేవాదాయశాఖ అధికారులు: గుంటి లక్ష్మి నరసింహస్వామి దేవాలయాన్ని గ్రామస్తులు టీటీడీని ఆశ్రయించి దేవాలయాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా కోరారు. అప్పటి గ్రామ పెద్ద లింగరాజు రామయోగీశ్వర రావు అప్పటి టీటీడీ ఈఓ రమణాచారికి వినతిపత్రం ఇచ్చినా అక్కడి నుంచి ముందుగా ఎండోమెంట్ అనుమతి తీసుకున్న తర్వాతే టీటీడీ దత్తత తీసుకుంటామని తేల్చి చెప్పారు. గ్రామస్తులు అందరూ కలిసి మార్కాపురం ఎండోమెంట్ అధికారికి సమాచారం ఇచ్చారు. దానికి వారి నుంచి స్పందన కరువైంది. అతిపురాతన దేవాలంయం శిథిలమైపోతున్నా మన దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ దేవాలయానికి చెందిన భూమిని కొందరు మహానుభావులు ఆక్రమించుకొంటున్నారు. దేవాలయానికి ఉన్న భూములు ఎక్కడ ఉన్నాయే రెవెన్యూ అధికారులైనా తెల్పాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆలయానికి దొంగల బెడద: గుంటి లక్ష్మినరసింహస్వామి దేవాలయంలో దొంగలు గుప్తనిధుల కోసం గర్భగుడి కింది భాగంలోని గుహలో తవ్వకాలు జరుపుతుండగా గబ్బిలాలు బిగ్గరగా అరిశాయి. దీంతో గ్రామస్తులు అనుమానంతో ఆలయం వద్దకు వచ్చేసరికి దొంగలు పరారయ్యారు. ఇలాంటి తవ్వకాలు తరచూ జరుపుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారు. రాజులు ప్రతిష్ఠిచిన శిలలు, శాసనాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఆలయంలో రక్షణ ఏర్పాట్లను చేయాలని భక్తులు కోరుతున్నారు. దేవాలయానికి ధర్మకర్త గా వ్యవహరిస్తున్న మాజీ సర్పంచ్ బొంతా శేషారెడ్డి బంధువులు, గ్రామస్తులు కలసి గర్భగుడిలో దొంగలు పెకిలించిన లక్ష్మినరసింహస్వామి శిలా విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి మళ్లీ పూజలు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ వారు, తిరుపతి–తిరుమల దేవస్థానం అధికారులు ఈ దేవాలయాన్ని స్వాధినం చేసుకొని పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. శాశ్వత పూజారితో పూజలు నిర్వహించాలి: మా దేవాలయాన్ని టీటీడీ దత్తత తీసుకొని అభివృధ్ధి చేయాలి. ఆలయంలో దేవాదాయశాఖ ద్వార నిత్యం పూజలు చేసేందుకు ఓ పూజారిని నియమించాలి. - బి. శేషారెడ్డి, మాజీ సర్పంచ్ పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి: పురాతన దేవాలయమైన గుంటి లక్ష్మినరసింహస్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి. దేవాలయానికి ఉన్న భూములను గుర్తించి దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోవాలి. ఆలయ భద్రతను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి. - హెచ్. సార్వభౌమరావు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ -
విధులకు వెళ్తూ ఆర్మీ జవాను మృతి
* తమ్ముడ్ని కోల్పోయిన బాధతో ప్రాణాలు విడిచిన అక్క * ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో విషాదం కొమరోలు: సెలవులకు ఇంటికి వచ్చిన ఆర్మీ జవాను తిరిగి విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ గుండెపోటుతో మరణించాడు. ఆ వార్త తెలుసుకున్న అతడి సోదరి గుండెలవిసేలా రోదించి ప్రాణాలొదిలింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చోటుచే సుకుంది. కొమరోలు శివాజీనగర్లో నివాసం ఉంటున్న ఇసుకల రవి (35) 15 ఏళ్ల నుంచి ఆర్మీలో జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత నెలలో సెలవులపై ఇంటికి వచ్చాడు. భారత్- పాక్ సరిహద్దులో యుద్ధ వాతారణం నెలకొన్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులకు హాజరయ్యేందుకు రవి బుధవారం బయల్దేరాడు. విజయవాడ సమీపంలో గుండెనొప్పి రావటంతో కారులోనే ఉన్న బంధువులు దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా కొద్దిసేపటికే మృతి చెందాడు. గురువారం ఉదయం భౌతిక కాయూన్ని స్వగ్రామం కొమరోలుకు తీసుకొచ్చారు. తమ్ముడి మృతదేహాన్ని చూసి అక్క సత్వేలి విజయకుమారి(40) బోరున విలపిస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయకుమారికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement