-
ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి మృతికి సీఎం జగన్ నివాళి
-
ప్రెసిడెంట్ మెడల్ అనేది టీడీపీ బ్రాండ్: ఎమ్మెల్యే పార్థసారథి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యాపాన నిషేధాన్ని ఎత్తేసేందుకు చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ.. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతోందని ఆనాడు చంద్రబాబు మద్యానికి తలుపులు తెరిచారని అన్నారు. డిస్టిలరీస్ నుంచి రూ.వేల కోట్లు వసూలు చేశారని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ప్రెసిడెంట్ మెడల్ అనేది టీడీపీ బ్రాండ్ అని ఎద్దేవా చేశారు. ప్రెసిడెంట్ మెడల్ అనేదానికి చంద్రబాబే పర్మిషన్ ఇచ్చారని అన్నారు. ఊరూరా మద్యాన్ని ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. -
మోసం చేశామని టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పాలి: కొలుసు పార్థసారధి
సాక్షి, తాడేపల్లి: అన్నపూర్ణ లాంటి ఆంద్రప్రదేశ్ను చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి నిప్పులు చెరిగారు. కేవలం టీడీపీ తాబేదార్లకు లాభం చేకూర్చేలా దోచుకున్నారని ధ్వజమెత్తారు. అయిదేళ్లలో చేసిన పాపానికి చంద్రబాబును జనం ఛీత్కరించినా సిగ్గురాలేదని విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలు దేహీ అని ఆదుకునే పరిస్థితి కల్పించాడని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై టీడీపీ చార్జ్షీట్ వేయ్యడంపై ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత 90శాతం మేనిఫెస్టో అమలు చేసిన తమపై ఛార్జ్ షీట్ వేయడం హాస్యాస్పదమన్నారు.. అదీ ఈఎస్ఐ స్కాం చేసిన అచ్చెన్నాయుడు ఛార్జ్ షీట్ వేయడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన దానిపై చర్చించటానికి తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకులకు కొలుసు పార్థసారథి సవాల్ విసిరారు. హామీలను అమలు చేయకుండా తప్పించుకుపోయిన చంద్రబాబు సిగ్గులేకుండా చార్జ్ షీట్ వేస్తాడా అని ప్రశ్నించారు. చదవండి: గెలిచింది మేమే.. బుర్ర పనిచేయడం లేదా?: కొడాలి నాని అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షన్నర మందికి కొత్త ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ‘ఆ రోజు ఎస్సీ, బీసీ, మహిళలను కించపరిచిన వ్యక్తి చంద్రబాబు. మేము వాళ్ళ అభ్యున్నతికి చట్టాలు చేసి రిజర్వేషన్లు ఇస్తే మాపై చార్జ్ షీట్ వేయడానికి సిగ్గులేదా..? అధికారంలో ఉన్నప్పుడు ఏ పేదవారికైనా ఇళ్లస్థలం ఇచ్చావా..? జగనన్న 30 లక్షల మంది మహిళకు ఇల్లు కట్టిస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇచ్చారు తప్ప రైతులకు కాదు. తుఫాను పరిహారం సైతం మీరు ఎగ్గొట్టలేదా..? ఏదన్నా చార్జ్ షీట్ వేయాల్సి వస్తే టీడీపీపై వేయాలి. ఎంతసేపు విధ్వంసం చేయడం తప్ప ఈ రాష్ట్ర బాగు కోసం ఏమైనా చేశారా..? మీ దోపిడీ మాఫియా కోసం ఆఖరికి మహిళా అధికారులను సైతం జుట్టుపట్టుకుని దాడి చేశారు. మీ అయిదేళ్ల అధికార మదంతో కాల్ మనీ వ్యవహారం నడిపిన విషయం ప్రజలు మర్చిపోలేదు. స్కోచ్ అవార్డుల్లో మొదటి స్థానం రావడం ఓర్వలేక ఈ చార్జ్ షీట్ నాటకం ఆడుతున్నారు. ఆఖరికి సీఎంఆర్ఎఫ్లో లంచాలు మేసిన మీరు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారా..? చదవండి: ప్రతి మండలానికి రెండు జూనియర్ కళాశాలలు: సీఎం జగన్ మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో ఫలితాలు చూడలేదా...మీరు ఎలా గెలుస్తారు..? ఇక చంద్రబాబును అండమాన్ పంపాల్సిన అవసరం వచ్చినది అని వాళ్ళ పార్టీ వారే అనుకుంటున్నారు. పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడే ఛార్జ్ షీట్ వేయడం విడ్డూరం. చార్జ్ షీట్ కాదు మేము ప్రజల్ని మోసం చేశామని టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి క్షమాపణలు చెప్పాలి. తప్పకుండా రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి...అప్పుడు చూద్దాం అచ్చెన్నాయుడు’ అని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి పేర్కొన్నారు -
రైతులపై కాల్పుల ఘటనకు 21 ఏళ్లు
సాక్షి, అమరావతి: విద్యుత్ ధరలు తగ్గించాలని పోరాటం చేస్తున్న రైతులపై హైదరాబాద్లోని బషీర్బాగ్లో చంద్రబాబు కాల్పులు జరిపించి నేటికి 21 ఏళ్లు పూర్తి అవుతాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తెలిపారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ కాల్పుల్లో ముగ్గురు అన్నదాతలను పొట్టనబెట్టుకున్నారన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్థసారధి మీడియాతో మాట్లాడారు. బషీర్బాగ్ ఘటనను నేటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేదన్నారు. బాబు తొలి నుంచి రైతు వ్యతిరేకి అని మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ అంటే హేళన చేసిన చరిత్ర బాబు సొంతమన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల్లో ఘోర పరాజయం పాలయ్యాక మతి భ్రమించి ఉన్మాదిలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను దేశంలో అందరూ మెచ్చుకుంటుంటే చంద్రబాబు, ఎల్లో మీడియా మాత్రం దుష్ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు జరిగితే చూసి ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. పెట్రోల్, డీజిల్ మీద ఒకేసారి రూ.4 టీడీపీ ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. రూ.2.5 లక్షల కోట్లు అప్పులు చేసి.. ఒక్క కొత్త రోడ్ను వేయలేదని.. ఉన్న రోడ్లకు మరమ్మతులు కూడా చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో ఒక్క రూపాయి సెస్తో వచ్చే ఆదాయంతో రోడ్లను బాగు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చంద్రబాబు తన హయాంలో అమ్మఒడి, నాడు–నేడు, ఆర్బీకేలు, సచివాలయాలు వంటి ఒక్క కార్యక్రమాన్ని అయినా చేపట్టారా అని ప్రశ్నించారు. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా.. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా రూ. 1,04,241 కోట్లను ప్రజల ఖాతాల్లో జగన్ ప్రభు త్వం జమ చేసిందన్నారు. పరోక్షంగా మరో రూ.36 వేల కోట్లను ప్రజల జీవితాల మెరుగుకు వెచ్చించిందన్నారు. రెండు, మూడు రకాల పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వారిని లెక్కిస్తే రాష్ట్రంలో ఆరు కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారన్నారు. రాష్ట్రానికి ఆదాయం రాకుండా బాబు తన మనుషుల ద్వారా ఆర్బీఐ, కేంద్రానికి ఫిర్యాదులు చేయించడంతోపాటు బ్యాంకర్ల దగ్గరకు వెళ్లి ప్రభుత్వానికి అప్పులు ఇవ్వొద్దని చెబుతున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2.50 లక్షల కోట్లు అప్పులు చేశారని.. ఆ డబ్బులో 10 శాతం కూడా ప్రజలకు చేరకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినందుకు ధర్నా చేస్తారా అని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లీటర్ డీజిల్, పెట్రోల్పై రూ.25 నుంచి రూ.30 వరకు ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ఎప్పుడూ కేంద్రంపై ఒత్తిడి చేయలేదన్నారు. ఇవీ చదవండి: రాహుల్ హత్య.. కారణాలివే: విజయవాడ సీపీ చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ -
పంచాయతీలకు మించిన ఫలితాలు రాబోతున్నాయి..
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. స్థానిక ఎమ్మెల్యే పార్థసారధి ఆధ్వర్యంలో అభ్యర్ధులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 20 వార్డుల్లో మహిళా అభ్యర్థులు ఏకంగా 13 వార్డుల నుంచి బరిలో నిలిచారు. ప్రచారంలో ఎమ్మెల్యే పార్థసారధి అన్నీ తానై వ్యవహరిస్తూ, వైఎస్సార్సీపీ అభ్యర్ధులని ఆశీర్వదించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపోల్స్లో ప్రచార సరళిపై ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ.. ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిపాలనకు ప్రజలు బహ్మరధం పడుతున్నారన్నారు. మున్సిపోల్స్లో పంచాయితీలకు మించిన ఫలితాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సీఎం జగన్ మీద ఉన్న నమ్మకానికి ఫలితాలు ప్రతిబింబంగా నిలుస్తాయన్నారు. టీడీపీ హయాంలో ప్రజా సంక్షేమం అటకెక్కిందని, దాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం జగన్ ఏడాదిన్నర కాలంగా అహర్నిశలా శ్రమిస్తున్నారన్నారు. సంక్షేమం అంటే ఎలా ఉంటుందో సీఎం జగన్ ప్రజలకు చూపించారన్నారు. ప్రజల గుండెల్లో సీఎం జగన్ చెరగని స్థానం సంపాదించుకున్నారని ఆకాశానికెత్తారు. పల్లె తీర్పుతో చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ప్రస్తుత టీడీపీ పరిస్థితి నడి సముద్రంలో మునుగుతున్న నావ లాంటిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు వేసినా తెలుగుదేశాన్ని ఒడ్డుకు చేర్చలేరని, ఆయన రిటైరెంట్ తీసుకొంటే ఉన్న కాస్త పరువైనా మిగులుతుందని సూచించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement