-
Mayank: అభిమానులకు బ్యాడ్న్యూస్: ఇప్పట్లో కష్టమే!
ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్ శుక్రవారం సొంత మైదానంలో మరో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా స్టేడియంలో తలపడేందుకు సిద్దమైంది. అయితే, ఈ మ్యాచ్కు లక్నో యుంగ్ స్పీడ్గన్ మయాంక్ యాదవ్ దూరం కానున్నాడు. తదుపరి కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్కు కూడా అతడు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. కాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ సందర్భంగా 21 ఏళ్ల పేస్ సంచలనం మయాంక్ యాదవ్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క ఓవర్ వేసి మైదానం వీడిన మయాంక్.. తీవ్రమైన తొంటి నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విలువైన ఆటగాడిని కాపాడుకోవాలని.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించిన తర్వాతే అతడిని మళ్లీ బరిలోకి దించాలని లక్నో యాజమాన్యం భావిస్తోంది. ఈ విషయం గురించి లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్తో ఏప్రిల్ 19 నాటి మ్యాచ్ కోసం మయాంక్ను ఫిట్గా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. మయాంక్ లాంటి ప్రతిభావంతుడి సేవలను ప్రతీ మ్యాచ్లో ఉపయోగించుకోవాలని భావించడం సహజమేనన్న లాంగర్.. అన్నింటికంటే అతడి ఫిట్నెస్గా ఉండటం ముఖ్యమని పేర్కొన్నాడు. ఢిల్లీతో మ్యాచ్లో బరిలోకి దిగేందుకు మయాంక్ సిద్ధమయ్యాడని.. అయితే పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే మళ్లీ ఆడిస్తామని లాంగర్ తెలిపాడు. ఢిల్లీతో పాటు కేకేఆర్తో మ్యాచ్కు కూడా మయాంక్ దూరంగా ఉంటాడని ఈ సందర్భంగా జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. కాగా గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతున్న మయాంక్ యాదవ్ అరంగేట్రంలోనే ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ యూపీ పేసర్ 3/27తో సత్తా చాటాడు. లక్నోను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్లోనూ మూడు వికెట్లు పడగొట్టి మరోసారి ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తూ గాయం కారణంగా వరుస మ్యాచ్లకు మయాంక్ యాదవ్ దూరం కానున్నాడు. అతడి స్పీడ్ డెలివరీలను చూడాలనుకున్న అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్న్యూస్!! చదవండి: IPL 2024 MI VS RCB: ఆర్సీబీ ఖాతాలో మరో చెత్త రికార్డు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ముంబైకి గుడ్బై.. ఆ జట్టులో చేరనున్న రోహిత్ శర్మ?!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టును వీడనున్నాడా? ఐపీఎల్-2025 ఆరంభానికి ముందై ఎంఐతో తెగదెంపులు చేసుకోనున్నాడా?.. అవమానాన్ని తట్టుకోలేక ఫ్రాంఛైజీకి గుడ్బై చెప్పాలనుకుంటున్నాడా?.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభమైన నాటి నుంచే హిట్మ్యాన్ గురించి క్రీడా వర్గాల్లో ఈ చర్చ నడుస్తూనే ఉంది. కాగా ఐపీఎల్-2024కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను భారీ ధరకు ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. రోహిత్ శర్మపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదుసార్లు జట్టుకు ట్రోఫీ అందించిన రోహిత్ను కాదని పాండ్యాను కెప్టెన్గా నియమించింది. ఇందుకు బదులుగా రోహిత్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముంబై ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయంపై తమకున్న కోపాన్ని పాండ్యాపై నేరుగానే ప్రదర్శిస్తున్నారు అభిమానులు. మైదానంలో అతడిని హేళన చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. రోహిత్ వద్దని వారించినా వారు వినే స్థితిలో లేరు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ పట్ల కూడా హార్దిక్ ప్రవర్తన కాస్త భిన్నంగానే ఉంది. పదే పదే అతడి ఫీల్డింగ్ పొజిషన్ మార్చడంతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను కూడా సరిగ్గా వాడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్లు ఓడి.. నాలుగో మ్యాచ్లో గెలిచినా రోహిత్ ముఖంలో పెద్దగా సంతోషం కనిపించకపోవడం జట్టులోని విభేదాలను తేటతెల్లం చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఎవరూ ఊహించని జట్టులోకి రోహిత్? ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రచారం తెర మీదకు వచ్చింది. ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రోహిత్ శర్మను సొంతం చేసుకోనుందని అందులోని సారాంశం. ఈ వార్త పుట్టుకు రావడానికి ఓ కారణం ఉంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా లక్నో కోచ్ జస్టిన్ లాంగర్కు ఓ ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్లో మీరు ఏ ఆటగాడిని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. ‘‘ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలా? ఎవరి పేరైనా చెప్పవచ్చా? నేను ఎవరి పేరు చెబుతానని మీరు అనుకుంటున్నారు’’ అని లాంగర్ తిరిగి ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా.. ‘‘మేము చాలా మంది పేర్లు అనుకుంటున్నాం గానీ రోహిత్ శర్మను మీరు జట్టులో చేర్చుకోగలరా?’’ అని పేర్కొన్నారు. దీంతో ఆశ్చర్యపోయిన లాంగర్.. ‘‘ఏంటీ రోహిత్ శర్మనా? ఒకే అతడిని ముంబై నుంచి మేము ట్రేడ్ చేసుకుంటాం. నాకు తెలిసి ఈ డీల్ మీరే కుదర్చగలరు’’ అని సరదాగా సమాధానమిచ్చాడు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కాగా 2011లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన రోహిత్ శర్మ 13 సీజన్లుగా అదే జట్టుకు ఆడుతున్నాడు. కెప్టెన్గా ఐదుసార్లు టైటిల్ గెలిచాడు. చదవండి: రోహిత్, కోహ్లి కాదు.. భూగ్రహం మొత్తం మీద అతడే బెస్ట్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'సచిన్, లారా కాదు.. నా లైఫ్లో నేను చూసిన బెస్ట్ ప్లేయర్ అతడే'
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్లు మూడింట విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. అయితే లక్నో విజయాల వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉంది. అతడే లక్నో హెడ్ కోచ్, ఆసీస్ లెజెండరీ క్రికెటర్ జస్టిన్ లాంగర్. ఈ ఏడాది సీజన్తో లక్నో హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన లాంగర్ తన అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అయితే లాంగర్ తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన లైఫ్లో చూసిన అద్బుతమైన క్రికెటర్లు గురించి లాంగర్ చర్చించాడు. "ఇప్పటివరకు నా జీవితంలో నేను చూసిన బెస్ట్ ఆటగాడు విరాట్ కోహ్లినే. ఈ విషయాన్ని నేను ఇప్పటికే చాలా సార్లు పబ్లిక్గా చెప్పాను. నాకు లెజండరీ క్రికెటర్లు వివ్ రిచర్డ్స్, అలన్ బోర్డర్, మార్టిన్ క్రోవ్లు అంటే కూడా నాకు ఇష్టం. మార్టిన్ క్రోవ్కు ప్రత్యర్ధిగా కూడా నేను ఆడాను. అదేవిధంగా బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్ కూడా గొప్ప ఆటగాళ్లు. కానీ విరాట్ ఎనర్జీ వీరిందరి కంటే అద్భుతం. అతడు చాలా ఫిట్గా ఉన్నాడు. విరాట్ మైదానంలో వికెట్ల మధ్య పరిగెత్తడం, ఫీల్డింగ్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి అతని ఆట చూడటం నాకు చాలా ఇష్టం. మాతో మ్యాచ్లో కోహ్లిని తొందరగా ఔట్ చేయడం ఔట్ చేయడం చాలా సంతోషంగా అన్పించిందని" లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలో లాంగర్ పేర్కొన్నాడు. -
లక్నో సూపర్ జెయింట్స్లో కీలక పరిణామం.. అసిస్టెంట్ కోచ్పై వేటు
ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ విజయ్ దాహియాపై ఫ్రాంచైజీ యాజమాన్యం వేటు వేసింది. ఈ విషయాన్ని ఇరు పక్షాలు ధృవీకరించాయి. ఎల్ఎస్జీతో రెండేళ్ల బంధాన్ని తెంచుకుంటున్నట్లు దాహియా తన సోషల్మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించగా.. లక్నో మేనేజ్మెంట్ దాహిదాకు ఆల్ ద బెస్ట్ చెప్పింది. హెడ్ కోచ్గా జస్టిన్ లాంగర్ బాధ్యతలు చేపట్టాక లక్నో ఫ్రాంచైజీలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల గౌతమ్ గంభీర్ లక్నో మెంటార్షిప్ను వదులకుని తన హోం ఫ్రాంచైజీ అయిన కేకేఆర్కు వెళ్లిపోగా.. లాంగర్ పట్టుబట్టి శ్రీధరన్ శ్రీరామ్ను అసిస్టెంట్ కోచ్గా తన బృందంలో చేర్చుకున్నాడు. తాజాగా దాహియా కూడా ఫ్రాంచైజీని వీడటంతో జట్టులొ అంతర్గతంగా ఎదో జరుగుతుందని అంతా అనుకుంటున్నారు. View this post on Instagram A post shared by Vijay Dahiya (@vijay.dahiya.1973) కాగా, కొన్ని రోజుల కిందట లక్నో యాజమాన్యం ఆండీ ఫ్లవర్ను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో జస్టిన్ లాంగర్ను కూర్చోబెట్టింది. లాంగర్కు ఆసీస్ హెడ్ కోచ్గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీంతో ఎల్ఎస్జీ యాజమాన్యం అతని కోసం భారీ మొత్తాన్ని వెచ్చించి అక్కున చేర్చుకుంది. ఎల్ఎస్జీతో జతకట్టినప్పటి నుంచి లాంగర్ తనదైన ముద్రను వేసుకుంటున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 వేలంలోనూ అతను చాలా కీలకంగా వ్యవహరించాడు. ఈ వేలంలో లక్నో ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దాహియా స్థానంలో కొత్త అసిస్టెంట్ కోచ్గా సురేశ్ రైనాను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి రైనా తన స్థాయికంటే చిన్నదైన అసిస్టెంట్ కోచ్ పదవి చేపడతాడో లేదో వేచి చూడాలి. మరోవైపు రైనాను గంభీర్ స్థానంలో లక్నో మెంటార్గా నియమిస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. All the best for your next chapter, @vijdahiya !🙏💙 pic.twitter.com/7RhyyOuXnD — Lucknow Super Giants (@LucknowIPL) January 1, 2024 కాగా, లక్నో సూపర్ జెయింట్స్ 2022 సీజన్తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు ఓ మోస్తరు ప్రదర్శనలు చేసి ఫైనల్ ఫోర్ వరకు చేరింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలో ఈ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. మరోవైపు లక్నోతో పాటే ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ ఓ సారి ఛాంపియన్గా, మరోసారి రన్నరప్గా నిలిచింది. లక్నో కోచింగ్ సిబ్బంది: హెడ్కోచ్ : జస్టిన్ లంగర్ అసిస్టెంట్ కోచ్ : శ్రీధరన్ శ్రీరామ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ : మోర్నీ మోర్కెల్ ఫీల్డింగ్ కోచ్ : జాంటీ రోడ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్ : ప్రవీణ్ తాంబే -
ఐపీఎల్ ఒలింపిక్స్తో సమానం.. చాలా సంతోషంగా ఉంది: లక్నో హెడ్ కోచ్
ఐపీఎల్పై ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ ఒలిపింక్స్తో సమానమని లాంగర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్రధాన కోచ్గా నియమించుకుంది. ఆండీ ప్లవర్ స్ధానాన్ని లంగర్తో లక్నో ఫ్రాంచైజీ భర్తీ చేసింది. ఐపీఎల్లో హెడ్కోచ్ పదివి చేపట్టడం లంగర్కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. లంగర్కు కోచ్గా అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడి నేతృత్వంలోనే ఆసీస్ తొలి టీ20 వరల్డ్కప్(2021)ను సొంతం చేసుకుంది. అదే విధంగా బిగ్బాష్ లీగ్లో కూడా లంగర్ కోచ్గా విజయవంతమయ్యాడు. ఈనేపథ్యంలో లక్నో ఫ్రాంచైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లంగర్ మాట్లాడుతూ.. "రికీ పాటింగ్కు ఐపీఎల్ టోర్నీ అంటే చాలా ఇష్టం. అతడితో నేను ఎప్పుడు మాట్లాడిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్తో తన ప్రయాణం గురించే చెబుతూ ఉంటాడు. అదే విధంగా నా బెస్ట్ ఫ్రెండ్ టామ్ మూడీ సైతం ఐపీఎల్లో చాలా కాలంగా తన సేవలు అందిస్తున్నాడు. అతడు కూడా చాలా సార్లు ఈ టోర్నీ కోసం నాతో మాట్లాడాడు. ఐపీఎల్ అనేది ఒలింపిక్స్ క్రీడలు వంటిది. ఇది చాలా పెద్ద ఈవెంట్. ప్రతీ మ్యాచ్ ఒక అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్కు ఆదరణ ఉంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియాలు దద్దరిల్లిపోతాయి. ఇటువంటి లీగ్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. చదవండి: PAK vs AUS: పాకిస్తాన్తో మూడో టెస్టు.. ఆసీస్ జట్టు ప్రకటన! వార్నర్కు ఆఖరి మ్యాచ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement