-
రాణించిన ఉనాద్కట్, జయంత్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో బరిలోకి దిగిన భారత క్రికెటర్లు జైదేవ్ ఉనాద్కట్, జయంత్ యాదవ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. లెస్టర్షైర్ క్లబ్తో జరిగిన డివిజన్–2 మ్యాచ్లో ససెక్స్ జట్టు తరఫున ఆడిన ఉనాద్కట్ మ్యాచ్లో తొమ్మిది వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో ఉనాద్కట్ 23 పరుగులిచ్చి 3 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 94 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ససెక్స్ జట్టు 15 పరుగుల తేడాతో గెలిచింది. లాంకషైర్తో జరిగిన డివిజన్–1 మ్యాచ్లో మిడిల్సెక్స్ జట్టుకు ఆడిన జయంత్ యాదవ్ 131 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ‘డ్రా’ అయింది. తొలిసారి కౌంటీ క్రికెట్లో ఆడుతున్న భారత లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (3/63, 2/43) కెంట్ తరఫున ఐదు వికెట్లు తీసుకున్నాడు. -
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. భారత జట్టులోకి జయంత్ యాదవ్, పుల్కిత్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు కోసం ఇప్పటికే నలుగురు నెట్ బౌలర్లను ఎంపిక చేసిన భారత సెలక్టర్లు.. తాజాగా మరో ఇద్దరి స్పిన్నర్లను కూడా ఈ జాబితాలో చేర్చారు. వారిలో భారత వెటరన్ స్పిన్నర్ జయంత్ యాదవ్, ఢిల్లీకి చెందిన ఫస్ట్క్లాస్ క్రికెటర్ పుల్కిత్ నారంగ్ ఉన్నారు. అంతకుముందు సెలక్టర్లు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఉత్తర్ప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్, రాజస్థాన్ లెగ్ స్పిన్నర్, టీమిండియా బౌలర్ రాహుల్ చాహర్, తమిళనాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, సాయి కిషోర్ను నెట్ బౌలర్లగా చేశారు. తీవ్రంగా శ్రమిస్తోన్న టీమిండియా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి జరగనుంది. ఈ క్రమంలో ఇరు జట్లు తమ ప్రాక్టీస్ సెషన్స్లలో బీజీబీజీగా గడుపుతున్నాయి. బెంగళూరులో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్లో ఆసీస్ సాధన చేస్తుండగా.. భారత జట్టు నాగ్పూర్లోని ఓల్డ్ విదర్భ క్రికెట్ ఆసోషియషన్ గ్రౌండ్లో చెమటడ్చుతోంది. కాగా ఇరు జట్లు కూడా ముఖ్యంగా స్పిన్నర్లపైనే ఎక్కువగా దృస్టిసారించాయి. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ యాక్షన్ను పోలి ఉన్న బరోడా స్పిన్నర్ మహేష్ పిథియాతో కమ్మిన్స్ సేన ప్రాక్టీస్ చేస్తుంది. అదే విధంగా ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయాన్ను సమర్ధవంతంగా ఎదుర్కొవడానికి భారత్ కూడా తమ వ్యూహాలను రచిస్తోంది. ఆస్ట్రేలియా భారత పర్యటన షెడ్యూల్: ఫిబ్రవరి 09- మార్చి 22.. టెస్టు సిరీస్తో ప్రారంభం- వన్డే సిరీస్తో ముగింపు నాలుగు టెస్టుల సిరీస్ ► ఫిబ్రవరి 9- 13: నాగ్పూర్ ► ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ ► మార్చి 1-5: ధర్మశాల ► మార్చి 9- 13: అహ్మదాబాద్ మూడు వన్డేల సిరీస్ ► మార్చి 17- ముంబై ► మార్చి 19- వైజాగ్ ► మార్చి 22- చెన్నై చదవండి: IND vs AUS: శుబ్మన్ గిల్ వద్దు.. శ్రేయస్ అయ్యర్ స్థానంలో అతడే సరైనోడు -
ఒక్క మ్యాచ్ ఆడలేదు.. కోటికి పైగా వెనకేశారు! టైటిల్ కూడా!
IPL 2022: కొంతమంది ఆటగాళ్లు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. మరికొంత మంది ఒక్కసారి తమ ప్రతిభ నిరూపించుకుంటే చాలు.. అదృష్టం వెంటపడి మరీ వరిస్తుంది. అలా కాలు మీద కాలేసుకుని కూర్చున్నా కనకవర్షం కురిపిస్తుంది. ఇక ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్లీగ్లో ఇలాంటి ఘటనలు జరగడం సహజమే! కొన్ని ఫ్రాంఛైజీలు వేలంలో కోట్లు పోసి కొన్న క్రికెటర్లను కూడా బెంచ్కే పరిమితం చేసే పరిస్థితులు ఉంటాయి. జట్టు అత్యుత్తమ కూర్పులో భాగంగా కొందరిని పక్కనపెడతాయి. అయినా సరే వాళ్లకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించక తప్పదు కదా! అలా ఐపీఎల్-2022లో బెంచ్కే పరిమితమై కోటి రూపాయలకు పైగా సంపాదించిన టాప్-3 క్రికెటర్లను పరిశీలిద్దాం! వీరిలో ఇద్దరు ఆడకుండానే టైటిల్ గెలిచిన జట్టులో భాగం కావడం విశేషం. 1.జయంత్ యాదవ్ ఐపీఎల్ మెగా వేలం-2022లో టీమిండియా ఆల్రౌండర్ జయంత్ యాదవ్ను 1.7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. కనీస ధర కోటితో ఆక్షన్లోకి వచ్చిన అతడిని లక్నో సూపర్ జెయింట్స్తో పోటీ పడి మరీ సొంతం చేసుకుంది. రషీద్ ఖాన్తో కలిసి అతడిని బరిలోకి దింపుతారనే అంచనాలు ఉన్నా.. అలా జరుగలేదు. సీజన్ ఆసాంతం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జయంత్కు ఒక్కసారి కూడా తుది జట్టులో చోటు లభించలేదు. రషీద్, సాయి కిషోర్, రాహుల్ తెవాటియాలతో పోటీలో అతడు వెనుకబడిపోయాడు. ఇక ఐపీఎల్-2022తో ఎంట్రీ ఇచ్చిన సీజన్లోనే గుజరాత్ చాంపియన్స్గా నిలిచిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. View this post on Instagram A post shared by Jayant Yadav (@jyadav19) 2. డొమినిక్ డ్రేక్స్ ఐపీఎల్లో అత్యంత అదృష్టవంతుడైన ప్లేయర్గా కరేబియన్ ఆల్రౌండర్ డొమినిక్ డ్రేక్స్ పేరొందాడు. కనీసం ఒక్కసారైనా క్యాష్ రిచ్ లీగ్ టైటిల్ గెలిచిన జట్టులో భాగమవ్వాలని ప్రతి ఒక్క ఆటగాడి కల. డొమినిక్ డ్రేక్స్కు ఇది రెండుసార్లు నెరవేరింది. అది కూడా ఒక్క మ్యాచ్ ఆడకుండానే. గత సీజన్ రెండో అంచెలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. ఇక ఆ 2021 ఎడిషన్లో చెన్నై టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022 మెగావేలంలో ఆర్సీబీతో పోటీ పడి మరీ గుజరాత్ టైటాన్స్ డొమినిక్ను దక్కించుకుంది. ఇందుకోసం ఏకంగా 1.1 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ఒక్క మ్యాచ్లో ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో అతడు బెంచ్కే పరిమితమైనా కోటితో పాటు మరో ఐపీఎల్ టైటిల్ను ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by Filter Cricket ⬇️ (@filtercricket) 3. రాజ్వర్ధన్ హంగర్కర్ భారత అండర్-19 జట్టులో సభ్యుడైన రాజ్వర్ధన్.. వన్డే ప్రపంచకప్లో అదరగొట్టి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో సీఎస్కే ఈ యువ ఆల్రౌండర్ను 1.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ.. తుదిజట్టులో చోటు కల్పించలేదు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగల.. జట్టుకు అవసరమైన సమయంలో బ్యాటింగ్ చేయగల రాజ్వర్ధన్కు అవకాశం ఇవ్వలేదు. చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా: ప్రొటిస్ కెప్టెన్ Hardik Pandya - Kiran More: 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్ -
'జయంత్ కోసం రవీంద్ర జడేజా త్యాగం'
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా విజయంలో అగ్రభాగం రవీంద్ర జడేజాదే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందు బ్యాటింగ్లో 175 పరుగులు నాటౌట్.. ఆ తర్వాత బౌలింగ్లో 9 వికెట్లు తీసి ఆల్రౌండర్గా రాణించాడు. ఇక ఫాలో ఆన్ ఆడిన లంకను రెండో ఇన్నింగ్స్లో జడేజాతో కలిసి అశ్విన్ దెబ్బతీశాడు. ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించారు. ఇదే మ్యాచ్లో అశ్విన్ కపిల్ దేవ్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. మొత్తంగా 436 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ 9వ స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం అశ్విన్ మాట్లాడుతూ జడేజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' నిస్సందేహంగా జడ్డూదే ఈ టెస్టు మ్యాచ్. మొదట బ్యాటింగ్లో 175 నాటౌట్.. ఆ తర్వాత బౌలింగ్లో 9 వికెట్లు కూడా సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అయితే జడేజా గురించి మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఈ మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్పిన్నర్గా జయంత్ యాదవ్కు అవకాశం ఇచ్చాడు. కానీ మా ఇద్దరి వల్ల అతనికి ఎక్కువగా బౌలింగ్ వేసే అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికి జట్టులో మూడో స్పిన్నర్ ఉన్నాడని గుర్తించడానికి జడేజా కొన్ని ఓవర్లను జయంత్ యాదవ్కు కేటాయించి త్యాగం చేశాడు. వాస్తవానికి జడేజాకు మరోసారి ఐదు వికెట్లు తీసే అవకాశం వచ్చి ఉండొచ్చు. కానీ లంక రెండో ఇన్నింగ్స్లో జయంత్ యాదవ్కు బౌలింగ్లో కొన్ని ఓవర్లు ఇవ్వడంతో జడేజా ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. ఈ విషయంలో జడేజా స్వయంగా రోహిత్తో మాట్లాడి జయంత్ యాదవ్కు అవకాశం కల్పించాడు. నేను కూడా జడేజా నిర్ణయాన్ని సమర్థించా. జడేజా చెప్పినదాంట్లో నిజముందని.. జయంత్ను మూడో స్పిన్నర్గా జట్టులోకి తీసుకున్నామని.. అందుకే అతనితో బౌలింగ్ వేయించడానికి రెడీ అయ్యాం. నిజంగా జడ్డూ సూపర్'' అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి 16 వరకు జరగనుంది. చదవండి: PAK vs AUS: వైరల్గా మారిన పాక్ క్రికెటర్ చర్య.. ఏం జరిగింది Ind Vs Eng 1st Test: చెన్నైలో ఇంగ్లండ్తో తొలిటెస్టుపై ఫిక్సింగ్ అనుమానాలు? 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏@ImRo45 begins his Test captaincy stint with a win as #TeamIndia beat Sri Lanka by an innings & 2⃣2⃣2⃣ runs in the first @Paytm #INDvSL Test in Mohali. 👌 👌 Scorecard ▶️ https://t.co/XaUgOQVg3O pic.twitter.com/P8HkQSgym3 — BCCI (@BCCI) March 6, 2022 A round of applause 👏👏 for @imjadeja for his Man of the Match performance 🔝 Victory for #TeamIndia indeed tastes sweet 🍰😉#INDvSL @Paytm pic.twitter.com/8RnNN7r38w — BCCI (@BCCI) March 6, 2022 -
IND vs SA ODI Series: వన్డే సిరీస్కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో జయంత్ యాదవ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా జనవరి 19 నుంచి ప్రొటిస్తో టీమిండియా వన్డే సిరీస్ మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో కేఎల్ రాహుల్కు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా సుదీర్ఘ విరామం తర్వాత శిఖర్ ధావన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ కూడా తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, వాషింగ్టన్ సుందర్ కోవిడ్ కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు. దీంతో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతడి స్థానంలో జయంత్ యాదవ్ను ఎంపిక చేసింది. అదే విధంగా నవదీప్ సైనీని కూడా జట్టులో చేర్చింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ మహ్మద్ సిరాజ్కు బ్యాకప్గా సైనీకి అవకాశం ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, యజువేంద్ర చాహల్, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ క్రిష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ. చదవండి: SA vs IND: అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement