-
జనవరిలో 47 లక్షల కొత్త ఫోలియోలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో జనవరిలో 46.7 లక్షల కొత్త ఫోలియోలు నమోదయ్యాయి. డిజిటల్ మార్గాల ద్వారా ఫండ్స్లో సులభంగా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటుకుతోడు, ఆర్థిక సాధనాల పట్ల పెరుగుతున్న అవగాహన ఈ వృద్ధికి తోడ్పుడుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలాన్ని పరిశీలించినా, నెలవారీగా ఫోలియోల పెరుగుదల 22.3 లక్షలుగా ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) తాజా డేటా వెల్లడిస్తోంది. ఈ ఏడాది జనవరి చివరికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఫోలియోలు 16.96 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది జనవరి చివరికి ఉన్న 14.28 కోట్ల ఫోలియోలతో పోలిస్తే 19 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక 2023 డిసెంబర్ చివరి నుంచి ఈ ఏడాది జనవరి చివరికి ఫోలియోలలో 3 శాతం వృద్ధి నమోదైంది. ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి సంబంధించి ఇచ్చే గుర్తింపును ఫోలియో (పెట్టుబడి ఖాతా)గా చెబుతారు. ఒక ఇన్వెస్టర్కు ఒకటికి మించిన పథకాల్లో పెట్టుబడులు కలిగి ఉంటే, అప్పుడు ఒకటికి మించిన ఫోలియోలు ఉంటాయి. పెరుగుతున్న అవగాహన ‘‘డిజిటల్ పరిజ్ఞానం పెరగడం, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, ఆరి్థక అక్షరాస్యత అనేవి సంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్లు కాకుండా ఇతర సాధనాల వైపు చూసేలా చేస్తున్నాయి. ఇదే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు ఇతోధికం కావడానికి దోహం చేస్తున్నాయి’’అని వైట్ఓక్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రతీక్ పంత్ తెలిపారు. మెజారిటీ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు డిజిటల్ ఛానళ్లనే ఎంపిక చేసుకుంటున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జనవరిలో నమోదైన 46.7 లక్షల ఫోలియోలలో ఈక్విటీలకు సంబంధించి 34.7 లక్షలుగా ఉన్నాయి. దీంతో జనవరి చివరికి ఈక్విటీ పథకాలకు సంబంధించిన ఫోలియోలు 11.68 కోట్లకు చేరాయి. జనవరిలో హైబ్రిడ్ ఫండ్స్కు సంబంధించి 3.36 లక్షల ఫోలియోలు కొత్తగా నమోదయ్యాయి. దీంతో హైబ్రిడ్ పథకాలకు సంబంధించి మొత్తం ఫోలియోల సంఖ్య 1.31 కోట్లకు చేరింది. డెట్ పథకాలకు సంబంధించిన ఫోలియోలు వరుసగా ఐదో నెలలోనూ క్షీణతను చూశాయి. జనవరిలో డెట్ పథకాలకు సంబంధించి 74.66 లక్షల ఫోలియోలు తగ్గాయి. గడిచిన కొన్ని సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్స్లో ఫోలియోలు, పెట్టుబడులు గణనీయంగా పెరిగినప్పటికీ.. దేశ జనాభాలో ఈ సాధనాల వ్యాప్తి ఇప్పటికీ 3 శాతం మించలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 45 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు జనవరి చివరికి రూ.53 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. -
విపరీతంగా వాహన విక్రయాలు.. ఇంతలా కొనేశారేంటి?
న్యూఢిల్లీ: యుటిలిటీ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో జనవరిలో ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. హోల్సేల్ స్థాయిలో గత ఏడాది జనవరితో పోలిస్తే 14 శాతం పెరిగి 3,93,074 యూనిట్లు అమ్ముడయ్యాయి. జనవరి నెలలో పీవీల విక్రయాలకు సంబంధించి ఇవి అత్యుత్తమ గణాంకాలు. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ విడుదల చేసిన డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం టూ–వీలర్ల హోల్సేల్ విక్రయాలు 26 శాతం పెరిగి 14,95,183 యూనిట్లకు చేరాయి. గతేడాది జనవరిలో వీటి సంఖ్య 11,84,376 యూనిట్లుగా ఉంది. వినియోగదారుల సెంటిమెంట్లు సానుకూలంగా ఉండటంతో ప్యాసింజర్ వాహన అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలు కోలుకుంటూ ఉండటంతో టూ–వీలర్ల విభాగం కూడా జనవరిలో వృద్ధి నమోదు చేసిందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. వాణిజ్య వాహనాల విభాగం పనితీరు అంత మెరుగ్గా లేనప్పటికీ వచ్చే రెండు నెలల్లో అమ్మకాలు పుంజుకోగలవని ఆయన పేర్కొన్నారు. త్రిచక్ర వాహనాల టోకు విక్రయాలు 9 శాతం వృద్ధి చెందాయి. 48,903 యూనిట్ల నుంచి 53,537 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను పటిష్టం చేయడంపై, ముఖ్యంగా చార్జింగ్ మౌలిక సదుపాయాలు..ప్రజా రవాణాపై ప్రభుత్వం 2024 బడ్జెట్లో ప్రధానంగా దృష్టి పెట్టడమనేది ఆటో రంగం వృద్ధి గతి కొనసాగేందుకు దోహదపడగలదని అగర్వాల్ పేర్కొన్నారు. జనవరిలో అమ్మకాలు ఇలా.. మార్కెట్ లీడరు మారుతీ సుజుకీ హోల్సేల్ అమ్మకాలు 1,47,348 యూనిట్ల నుంచి 1,66,802 యూనిట్లకు చేరాయి. పోటీ సంస్థ హ్యుందాయ్ మోటర్ ఇండియా విక్రయాలు 50,106 యూనిట్ల నుంచి 57,115కి పెరిగాయి. అటు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) హోల్సేల్ అమ్మకాలు 33,040 వాహనాల నుంచి 43,068కి చేరాయి. మోటర్సైకిల్ విభాగంలో హీరో మోటోకార్ప్ గతేడాది జనవరిలో 3,26,467 వాహనాలను విక్రయించగా ఈసారి 3,83,752 యూనిట్లు విక్రయించింది. అటు హోండా మోటర్సైకిల్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 1,27,912 యూనిట్ల నుంచి 1,83,638 యూనిట్లకు పెరిగాయి. బజాజ్ ఆటో విక్రయాలు 1,38,860 యూనిట్ల నుంచి 1,78,056 యూనిట్లకు చేరాయి. టీవీఎస్ మోటర్ అమ్మకాలు 1,24,664 యూనిట్లుగా (గత జనవరిలో 1,00,354), సుజుకీ మోటర్సైకిల్ విక్రయాలు 78,477 యూనిట్లుగా (గత జనవరిలో 65,991) నమోదయ్యాయి. స్కూటర్లకు సంబంధించి హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అమ్మకాలు 1,50,243 యూనిట్ల నుంచి 1,98,874 యూనిట్లకు చేరాయి. -
ఈక్విటీ ఫండ్స్లోకి జోరుగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జనవరిలో పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాయి. ఈక్విటీ పథకాల్లోకి రెండేళ్ల గరిష్ట స్థాయిలో రూ.21,780 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. స్మాల్క్యాప్ ఫండ్స్, థీమ్యాటిక్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. ఫోకస్డ్ ఫండ్స్ మినహా మిగిలిన అన్ని ఈక్విటీ విభాగాలు పెట్టుబడులను ఆకర్షించాయి. 2023 డిసెంబర్ నెలలో వచి్చన రూ.16,997 కోట్లతో పోల్చి చూసినప్పుడు 28 శాతం అధికంగా పెట్టుబడులు వచి్చనట్టు తెలుస్తోంది. చివరిగా 2022 మార్చి నెలలో రూ.28,443 కోట్లు ఈక్విటీ ఫండ్స్లోకి రాగా, ఇప్పటి వరకు అదే గరిష్ట రికార్డుగా కొనసాగింది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)కు ఆదరణ కొనసాగుతోంది. సిప్ ద్వారా వచ్చే పెట్టుబడులు ఆల్టైమ్ గరిష్ట స్థాయి అయిన రూ.18,838 కోట్లకు చేరాయి. డిసెంబర్ నెలలో వచి్చన సిప్ పెట్టుబడులు రూ.17,610 కోట్లను అధిగమించాయి. జనవరి నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. కొత్తగా 51.84 లక్షల సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాలు జనవరి చివరికి 7.92 కోట్లకు పెరిగాయి. ‘‘జనవరిలో అస్థిరతలు ఉన్నప్పటికీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బలమైన పనితీరు చూపించాయి. మార్కెట్ ఆటుపోట్లలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు స్థిరమైన విశ్వాసాన్ని కొనసాగించడం, దీర్ఘకాలంలో సంపద సృష్టి దిశగా వారి నిబద్ధతను తెలియజేస్తోంది’’అని బ్రోకరేజీ సంస్థ ‘ప్రభుదాస్ లీలాధర్’ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ హెడ్ పంకజ్ శ్రేష్ట పేర్కొన్నారు. జనవరిలో మూడు కొత్త ఈక్విటీ పథకాలు (ఎన్ఎఫ్వోలు) సంయుక్తంగా రూ.967 కోట్లను సమీకరించినట్టు మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అనలిస్ట్ మెలి్వన్ శాంటారియా తెలిపారు. విభాగాల వారీగా.. ► థీమ్యాటిక్ ఫండ్స్లోకి రూ.4,805 కోట్లు, స్మాల్క్యాప్ ఫండ్స్లోకి రూ.3,257 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్ నెలతో పోల్చి చూసినప్పుడు స్మాల్క్యాప్ ఫండ్స్లోకి రూ.600 కోట్ల పెట్టుబడుల రాక తగ్గింది. ► మల్టీక్యాప్ ఫండ్స్లోకి రూ.3,039 కోట్లు వచ్చాయి. ► లార్జ్క్యాప్ ఫండ్స్ రూ.1,287 కోట్లు ఆకర్షించాయి. 19 నెలల తర్వాత ఇదే గరిష్ట స్థాయి. డిసెంబర్ నెలలో లార్జ్క్యాప్ ఫండ్స్ రూ.281 కోట్ల పెట్టుబడులను కోల్పోవడం గమనార్హం. ► డెట్ ఫండ్స్ రూ.76,469 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. డిసెంబర్ నెలలో ఇదే విభాగం రూ.75,560 కోట్ల పెట్టుబడులను కోల్పోవడం గమనార్హం. ► డెట్ విభాగంలో అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్లోకి రూ.49,468 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్లోకి రూ.10,651 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► గోల్డ్ ఈటీఎఫ్ పథకాలలో ఇన్వెస్టర్లు రూ.657 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ► మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ జనవరి నెలలో రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. గత డిసెంబర్లో రూ.40,685 కోట్ల పెట్టుబడులను కోల్పోవడంతో పోలిస్తే పరిస్థితి పూర్తిగా మారింది. ► మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ డిసెంబర్ చివరికి ఉన్న రూ.50.78 లక్షల కోట్ల నుంచి రూ.52.74 లక్షల కోట్లకు పెరిగింది. బంగారంలో హెడ్జింగ్.. ‘‘మిడ్క్యాప్ స్టాక్స్ 15 శాతం, స్మాల్క్యాప్ స్టాక్స్ 20 శాతం మేర ప్రీమియం వ్యాల్యూషన్లలో ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు లార్జ్క్యాప్ స్టాక్స్లో విలువల అంతరాన్ని గుర్తించారు. అందుకు తగ్గట్టు పెట్టుబడుల్లో మార్పులు చేసుకున్నారు’’అని ఫైయర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పటికీ అధికంగా ఉండడంతో బంగారం సురక్షిత సాధనంగా, ద్రవ్యోల్బణానికి మంచి హెడ్జింగ్ సాధనంగా కొనసాగుతుందని మెలి్వన్ శాంటారియా పేర్కొన్నారు. -
జనవరిలో ‘తయారీ’కి కొత్త ఆర్డర్ల బూస్ట్
న్యూఢిల్లీ: భారత్ మొత్తం పారిశ్రామికరంగంలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం జనవరిలో సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జనవరిలో 56.5కి ఎగసింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. డిసెంబర్లో ఈ సూచీ 54.9గా (18 నెలల కనిష్టం) నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల ఉపశమనం, డిమాండ్ బాగుండడం, కొత్త ఆర్డర్లలో పురోగతి ఇందుకు ప్రధాన కారణంగా నిలిచినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పేర్కొంటారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. -
2024లో ఆటో సూపర్స్టార్ట్
ముంబై: దేశ ఆటోమొబైల్ పరిశ్రమకు కొత్త సంవత్సరం శుభారంభం ఇచి్చంది. పలు ఆటో సంస్థలు 2024 జనవరిలో గత సంవత్సరం ఇదే నెలతో పోలి్చతే గణనీయమైన అమ్మకాలు జరిపాయి. మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా జనవరి అమ్మకాల్లో మంచి వృద్ధిని నమోదు చేశాయి. మొత్తం అమ్మకాలలో దేశీయ పరిమాణం జనవరిలో 2,78,155 నుండి 3,82,512 యూనిట్లకు పెరిగింది. ఇక ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 102 శాతం పెరిగి 36,883 యూనిట్లుగా ఉన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement