-
ఔను! ఆ అణుబాంబే ఇలా మారిపోయాడు!
నిన్నమొన్నటివరకు ఇస్లామాబాద్లో ఓ మారుమూల చాయ్ అమ్ముకున్న నీలి కళ్ల కుర్రాడు.. ఇప్పుడు పాకిస్థాన్ టాప్ మోడల్గా హల్చల్ చేస్తున్నాడు. నీలికళ్ల 'చాయ్వాలా' అర్షద్ ఖాన్ సోషల్ మీడియా దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్గా మారిపోయాడు. నిన్న ట్రెండింగ్ అయిన అతడు.. నేడు ట్రెండీగా సరికొత్త అవతారంలో మోడల్స్తో కలిసి ర్యాంప్వాక్ చేస్తున్నాడు. తాజాగా అర్షద్ ఖాన్ పాకిస్థాన్లోనే పాపులర్ టాక్ షో ’గుడ్మార్నింగ్ పాకిస్థాన్’ లో కనిపించాడు. ఏఆర్వై చానెల్లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో సరికొత్త మేకోవర్తో మోస్ట్ స్టైలిష్ లుక్తో అదరగొట్టాడు. అతని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇస్లామాబాద్లోని ఇత్వార్ బజార్లో చాయ్ అమ్ముతూ జీవనం సాగించిన అర్షద్ ఖాన్ అదృష్టం కొన్నిరోజుల కిందట అనూహ్యంగా మారిపోయిన సంగతి తెలిసిందే. నీలికళ్ల ఓరచూపుతో చాయ్ కాస్తున్న అతని ఫొటో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో అతను ఒక్కసారిగా ట్విట్టర్లో ట్రెండ్ అయ్యాడు. భారత్ చేసిన సర్జికల్ దాడులకు పాకిస్థాన్ సమాధానం ఇదిగో అంటూ దాయాది దేశపు నెటిజన్లు అతని ఫొటోను విపరీతంగా షేర్ చేసుకున్నారు. భారత్పై పాకిస్థాన్ ‘అణుబాంబ్’ ఇతనేనంటూ.. ఈ నీలికళ్ల కుర్రాడు భారతీయ అమ్మాయిలపై సర్జికల్ దాడులు చేస్తాడని వ్యాఖ్యానించారు. దీంతో అర్షద్ ఖాన్ దశ తిరిగిపోయి.. ఫిటిఇన్.పీకే ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్కు మోడలింగ్ చేసే అవకాశం అతన్ని వరించింది. -
భారత్పై పాక్ 'అణుబాంబు' అతడేనట!
న్యూఢిల్లీ: ఇస్లామాబాద్కు చెందిన ఓ చాయ్వాలా అన్యూహంగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాడు. నీలికళ్లతో ఉన్న అతన్ని పాకిస్థాన్ అణ్వాయుధమని ఆ దేశ నెటిజన్లు నెత్తికెక్కించుకుంటున్నారు. పాకిస్థాన్లో భారత్ సర్జికల్ దాడులకు ప్రతీకారంగా ఈ నీలికళ్ల కుర్రాడు భారతీయ అమ్మాయిలపై సర్జికల్ దాడులు చేస్తాడని, దెబ్బకు ఇరుదేశాల మధ్య సమీకరణాలు సమానం అయిపోతాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. చాయ్ అమ్ముతున్న ఈ నీలికళ్ల వ్యక్తి ఫొటోను జావేరియా లేదా జియా అలీ అనే ఫొటోగ్రాఫర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది. ఈ ఫొటో వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. రెండు నెలల కిందట జరిగిన ఫొటోవాక్లో భాగంగా ఇస్లామాబాద్లోని ఇత్వార్ బజార్ ప్రాంతంలో ఈ ఫొటో తీశానని, దానిని ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అనూహ్యమైన స్పందన వస్తున్నదని జియా అలీ మీడియాతో ఆనందం వ్యక్తం చేసింది. చాయ్వాలా (#ChaiWala) హ్యాష్ట్యాగ్తో ఈ ఫొటో ట్విట్టర్ పాకిస్థాన్ ట్రెండింగ్లో టాప్ స్థానంలో నిలిచింది. ఇండియన్ కాఫీ వాలా (కరణ్ జోహార్) కంటే పాక్ చాయ్వాలా బెటర్ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇన్నాళ్లు ఇరుదేశాల మధ్య ఉన్న ఘర్షణలే సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అంశాలుగా ఉండగా.. అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన ఈ పాక్ అణుబాంబు చాయ్వాలా.. ఒక్కసారిగా వాతావరణాన్ని సరదాగా మార్చేశాడు. ఈ ఫొటోపై భారతీయ నెటిజన్లు కూడా సరదా వ్యాఖ్యలతో హోరెత్తిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement