-
నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణదినానికి ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: పోలీస్ అమరవీరుల సంస్మరణదినం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం నిర్వహించనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని అమరులైన పోలీసులకు నివాళులర్పించనున్నారు. ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణదినం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ వారం రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం నుంచి 31 వరకు విజయవాడలో ‘ఓపెన్ హౌస్’ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించనుంది. అక్టోబర్ 24 నుంచి 27వరకు పోలీసు ఉద్యోగుల పిల్లలకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, 28న జిల్లా, రాష్ట్ర పోలీస్ కార్యాలయాల్లో వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వారి వైద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ..ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేస్తోంది. ఏపీతోపాటు హైదరాబాద్లో గుర్తించిన 283 ఆసుపత్రుల ద్వారా చికిత్స పొందే అవకాశాన్ని కల్పించింది. గతేడాదిలో 11,486 మంది పోలీసు కుటుంబాలు నగదు రహిత విధానంలో రూ.42.40 కోట్ల విలువైన వైద్య సేవలను పొందాయి. పోలీస్ శాఖ భద్రతా పథకం ద్వారా పోలీసులకు రుణాలు అందిస్తోంది. ఈ ఏడాది కాలంలో గృహ నిర్మాణ రుణాలు రూ.98.85 కోట్లు, ఉన్నత చదువుల కోసం రూ.11.66 కోట్లు, వివాహ రుణాలు రూ.3.95 కోట్లు, వ్యక్తిగత రుణాలు రూ.99.20 కోట్లు మంజూరు చేసింది. పోలీస్ ప్రమాద బీమా పథకం కోసం ఎస్బీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎస్బీఐ ఖాతా ఉన్నవారికి రూ.40 లక్షలు, యాక్సిస్ ఖాతా ఉన్నవారికి రూ.60 లక్షలు, హెచ్డీఎఫ్సీ ఖాతా ఉన్నవారికి రూ.70 లక్షలు బీమా పరిహారం కోసం ఒప్పందాలు చేసుకుంది. బీమా పరిహార మొత్తాన్ని రూ.85 లక్షలకు పెంచేందుకు ఆయా బ్యాంకులతో పోలీస్ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. వాటితోపాటు సాధారణ మృతికి రూ.5 లక్షలు పరిహారం అందిస్తోంది. సర్విస్లో ఉంటూ చనిపోయిన పోలీసుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకం కింద పోస్టింగులు కల్పిస్తోంది. గతేడాదిలో 244 మంది పోలీసులు చనిపోగా వారిలో 186 కుటుంబాల నుంచి కారుణ్య నియామకాల కోసం దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అర్హులైన 436 మందికి ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన ధరఖాస్తులు పలు దశల్లో ఉన్నాయి. వారికి కూడా త్వరలోనే ఉద్యోగాలు కల్పించనున్నారు. -
పోలీసులకు సేవా పతకాల ప్రదానం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో విశిష్ట సేవలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన పలువురు రాష్ట్ర పోలీసులకు సోమవారం సీఎం జగన్ పతకాలను ప్రదానం చేశారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 2020–21 సేవా పతకాలను గ్రహీతలు అందుకున్నారు. వారి వివరాలు.. ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (పీపీఎం)–2020 ► కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, రాష్ట్ర డీజీపీ ► డాక్టర్ ఎ.రవిశంకర్, ఏడీజీపీ, శాంతిభద్రతలు ► కుమార్ విశ్వజిత్, ఏడీజీపీ, రైల్వే ► కె. సుధాకర్, డీఎస్పీ, ఇంటెలిజెన్స్ ► ఎం.శ్రీనివాసరావు, ఏఆర్ఎస్ఐ, ఏసీబీ, విజయవాడ పోలీస్ మెడల్–2021 ► జి. గిరీష్కుమార్, అసిస్టెంట్ కమాండో, గ్రేహౌండ్స్ ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం)–2020, 2021 ► పీహెచ్డి రామకృష్ణ, డీఐజీ, ఏసీబీ ► ఎస్. వరదరాజు, రిటైర్డ్ ఎస్పీ ► ఆర్. విజయ్పాల్, రిటైర్డ్ ఏఎస్పీ, సీఐడీ ► ఎ. జోషి, ఏఎస్పీ, ఐఎస్డబ్ల్యూ, విజయవాడ ► ఎల్వీ శ్రీనివాసరావు, రిటైర్డ్ ఏఎస్పీ ► ఎన్. వెంకటరామిరెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ ► ఎంకేఎస్. రాధాకృష్ణ, అడిషనల్ కమాండెంట్, పీటీసీ, తిరుపతి ► ఈ. సత్యసాయిప్రసాద్, అడిషనల్ కమాండెంట్, ఆరో బెటాలియన్, మంగళగిరి ► సీహెచ్వీఏ రామకృష్ణ, అడిషనల్ కమాండెంట్, ఐదో బెటాలియన్, ఏపీఎస్పీ ► కే ఈశ్వరరెడ్డి, ఏఎస్పీ, విజిలెన్స్ ► ఎం. భాస్కర్రావు, రిటైర్డ్ డీఎస్పీ, సీఐడీ ► జి. వెంకటరమణమూర్తి, ఏసీపీ విజయవాడ ► జి. విజయ్కుమార్, డీఎస్పీ కమ్యూనికేషన్స్ ► ఎం. మహేశ్బాబు, రిటైర్డ్ అడిషనల్ కమాండెంట్ ► వై. శ్యామ్సుందరం, సీఐ పీటీసీ, తిరుపతి ► కె. జాన్మోషెస్ చిరంజీవి, ఆర్ఐ, విజయవాడ ► ఎన్. నారాయణమూర్తి, ఎస్ఐ, శ్రీకాకుళం ► ఎస్. శ్రీనివాసులు, ఎస్ఐ, ఏసీబీ తిరుపతి ► వి. నేతాజి, ఎస్ఐ, శ్రీకాకుళం ► ఎస్ఎస్ కుమారి, ఎస్ఐ, ఒంగోలు ► ఎన్. గౌరిశంకరుడు, ఆర్ఎస్సై, నెల్లూరు ► వై. శశిభూషణ్రావు, ఆర్ఎస్సై, ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ ► పి.విక్టోరియా రాణి, ఎస్సై విశాఖపట్నం రూరల్ ► కెఎన్ కేశవన్, ఏఎస్సై, చిత్తూరు ► బి. సురేశ్బాబు, ఏఎస్సై, నెల్లూరు ► జె. నూర్ అహ్మద్బాషా, ఏఎస్సై, చిత్తూరు ► జె. విశ్వనాథం, ఏఆర్ఎస్సై, ఇంటెలిజెన్స్ ► కె. వాకలయ్య, ఏఆర్ఎస్సై, మచిలీపట్నం ► ఎం. వెంకటేశ్వరరావు, ఆర్ఎస్సై, విజయవాడ ► జె. శ్రీనివాసులు, ఏఆర్ఎస్సై, అనంతపురం ► ఎస్. రామచరణయ్య, ఏఆర్ఎస్సై, అనంతపురం ► వైకుంఠేశ్వరరావు, ఏఆర్ఎస్సై, 6వ బెటాలియన్ ఏపీఎస్పీ ► వై. చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్, ఒంగోలు ► పి.విజయభాస్కర్, హెడ్ కానిస్టేబుల్, విజయవాడ ► ఎన్.రామకృష్ణరాజు, ఆర్హెచ్సీ, విజయనగరం ► సీహెచ్. రంగారావు, హెచ్సీ, ఏసీబీ, విజయవాడ ► కె.గురువయ్య బాబు, ఏఆర్హెచ్సీ, విశాఖపట్నం ► ఎ.సూర్యనారాయణరెడ్డి, ఏఆర్హెచ్సీ, విజయవాడ ► డి. మౌలాలి, ఏఆర్హెచ్సీ, విజయవాడ ► ఎం. జనార్థన్, హెచ్సీ, ఆక్టోపస్ ► వై. నాగేశ్వరరెడ్డి, ఏఆర్హెచ్సీ, విజయవాడ ► జి. రమణ, కానిస్టేబుల్, కర్నూల్ ► ఎన్. సూర్యనారాయణ, ఆర్పీసీ, విజయవాడ ► ఎంవి సత్యనారాయణరాజు, కానిస్టేబుల్, విశాఖపట్నం స్వాతంత్య్ర దినోత్సవ కవాతులో మొదటి బహుమతి అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రెసిడెంట్ ఫైర్ సర్వీసెస్ మెడల్–2020 ► లేట్ కె. జయరామ్ నాయక్ ఫైర్ సర్వీసెస్ మెడల్ ► ఎం. భూపాల్రెడ్డి, రీజనల్ ఫైర్ ఆఫీసర్ ► వి. శ్రీనివాసరెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి, అనంతపురం ► సీహెచ్ కృపవరం, జిల్లా అగ్నిమాపక అధికారి, విశాఖపట్నం ► బి. వీరభద్రరావు, అసిస్టెంట్ డీఎఫ్ఓ, శ్రీకాకుళం ► బి. గొల్లడు, రిటైర్డ్ లీడింగ్ ఫైర్మ్యాన్ ముఖ్యమంత్రి శౌర్య పతకాలు : ఏపీ అవతరణ దినోత్సవం–2021 ► జి. నాగశంకర్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► జి. ప్రసాద్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► బి. రమేశ్, ఆర్ఎస్ఐ, గ్రేహౌండ్స్ ► ఎం. శ్రీనివాసరావు, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► ఎస్. సురేశ్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► జిఎస్ రామారావు, ఆర్ఐ, గ్రేహౌండ్స్ ► కె. జగదీష్, హెడ్ కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► డి. గోవిందబాబు, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► జె. ఈశ్వరరావు, ఆర్ఎస్ఐ, గ్రేహౌండ్స్ ► పి. పెంచల ప్రసాద్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► డి. నాగేంద్ర, ఎస్ఐ, గ్రేహౌండ్స్ -
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
AP: సర్వం.. త్రివర్ణ శోభితం
మువ్వన్నెల పతాకాలతో రాష్ట్రం ముస్తాబైంది.. మన స్వేచ్ఛా జీవితానికి బాటలు వేసిన అమర వీరులకు జోహార్.. భారత్ మాతాకు జై.. అన్న నినాదాలు అన్ని ఊళ్లలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇళ్లు, వాహనాలపై జాతీయ జెండా గర్వంగా తలెత్తుకుని రెపరెపలాడుతోంది.. అన్ని వర్గాల ప్రజల్లో భావోద్వేగం ఉట్టిపడుతోంది. మహనీయుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రజానీకం అడుగులు ముందుకు వేస్తోంది. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/ సాక్షి నెట్వర్క్: ‘దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే.. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ’.. అంటూ యావత్ దేశ ప్రజానీకం మొత్తం త్రివర్ణ పతాకాన్ని చేతబట్టింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్– హర్ ఘర్ తిరంగా పిలుపునందుకుని ఊరూ వాడా నాటి త్యాగధనులను స్మరిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ సంబరానికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధమైంది. ప్రభుత్వ స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో ప్రజలు జెండాలను ఇళ్లపై ఎగురవేశారు. ఎటు చూసినా అదే వేడుక స్వాతంత్య్ర దిన వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర శాసనసభ, సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బందరు రోడ్డు, సీఎం క్యాంప్ కార్యాలయం విద్యుత్ దీప కాంతులతో ప్రకాశిస్తోంది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఎస్పీ బంగ్లాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, చారిత్రక కట్టడాలు దీప కాంతులను నింపుకున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లలో జాతీయ జెండా ఆకృతులను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ఉత్సవాల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 195 మంది ఖైదీలు రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి విడుదలవుతున్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన అనేక మంది ప్రభుత్వం నుంచి పతకాలు అందుకోనున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం 3 కి.మీ పొడవునా జాతీయ పతాకం ఒంగోలులో ఆదివారం ‘త్రివర్ణ ప్రకాశం’ పేరుతో 600 కేజీల బరువు, మూడు మీటర్ల వెడల్పు, 3 కి.మీ పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. నరసరావుపేటలోని ఆజాదీపార్కులో 109 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. శ్రీకాళహస్తిలో వెయ్యి అడుగుల జెండాను ప్రదర్శిస్తున్న జనం ఇందిరా గాంధీ స్టేడియం ముస్తాబు రాష్ట్ర స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవానికి విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం ఇక్కడ జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. వేడుకలను తిలకించేందుకు ఈ ఏడాది ప్రజలకు అనుమతి ఇస్తున్నారు. 300 అడుగుల ఎత్తులో జెండాను ఎగుర వేస్తున్నట్లు ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చే తేనీటి విందు (ఎట్ హోమ్)కు సీఎం వైఎస్ జగన్ హాజరవుతారు. ‘తూర్పు’లో ఆకట్టుకుంటున్న ‘కూర్పు’ తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలు స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని చాటే విధంగా మొక్కల కూర్పులతో ఆకట్టుకుంటున్నాయి. కడియపులంకలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా సత్యనారాయణ (చంటియ్య), పెద సత్యనారాయణలకు చెందిన శ్రీ సత్యదేవ నర్సరీలో పలు రకాల మొక్కలతో కూర్పు ఏర్పాటు చేశారు. హర్ ఘర్ తిరంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75 వసంతాల జెండా పండగలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన ఈ ఆకృతి చూపరులను ఆకట్టుకుంటోంది. – కడియం ‘జల’ జెండా! 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం హసన్బాద జెడ్పీ హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ జి.శ్రీను నీటితో జెండాను రూపొందించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ‘జల’ జెండాను తాకి చిన్నారులు మురిసిపోతున్నారు. జెండా అమరికకు అనుగుణంగా తొలుత ఒక గొయ్యి తవ్వి, కింద హైలమ్ షీట్ అమర్చారు. ఆ గొయ్యిని 3 భాగాలుగా విభజించి, త్రివర్ణ పతాకం రంగులు వచ్చేలా నీటిని నింపారు. – రామచంద్రపురం రూరల్ -
75వ భారత స్వాతంత్య్ర దినోత్సవానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement