-
ఐఐటీ–మద్రాస్ అత్యుత్తమం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తుమ విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ–మద్రాస్ వరసగా నాలుగో ఏడాది తొలి స్థానంలో నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)–బెంగళూరు తొలి స్థానం దక్కించుకుంది. ఫార్మసీ విభాగంలో నైపర్–హైదరాబాద్ రెండో ర్యాంకు, న్యాయ విద్యలో హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నాలుగో ర్యాంకు సాధించాయి. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద 11 విభాగాల్లో ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం విడుదల చేశారు. 2016 నుంచి కేంద్ర విద్యా శాఖ ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. విశ్వవిద్యాలయాల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీకి 22వ ర్యాంకు, ఆంధ్ర యూనివర్సిటీ 36వ ర్యాంకు లభించింది. టాప్–100 ఇంజనీరింగ్ కాలేజీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన 9 కాలేజీలున్నాయి. టాప్–100 ఫార్మసీ కాలేజీల్లో రెండు రాష్ట్రాలకు చెందిన 15 కాలేజీలున్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 12వ ర్యాంకు సాధించింది. మెడికల్ విభాగంలో 50 ర్యాంకులు ప్రకటించగా తెలంగాణ, ఏపీలోని కళాశాలలకు స్థానం దక్కలేదు. ఓవరాల్ ర్యాంకింగ్ ఐఐటీ–మద్రాస్ (87.59 స్కోరు) తొలిస్థానంలో నిలవగా, 83.57 స్కోరుతో ఐఐఎస్సీ–బెంగళూరు రెండోస్థానంలో 82.35 స్కోరుతో ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి. ఐఐటీ–హైదరాబాద్ 62.86 స్కోరుతో 14వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 59.67 స్కోరుతో 20వ ర్యాంకు, ఎన్ఐటీ–వరంగల్ 50.61 స్కోరుతో 45వ ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 50.60 స్కోరుతో 46వ ర్యాంకు సాధించాయి. కాలేజీల విభాగంలో ఆంధ్రా లయోలా కాలేజ్ (విజయవాడ) 52.38 స్కోరుతో 94వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్ ఐఐటీ మద్రాస్ 90.94 స్కోరుతో తొలిస్థానం, ఐఐటీ న్యూఢిల్లీ 88.12 స్కోరుతో రెండో స్థానం, ఐఐటీ బాంబే 83.96 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఐటీ హైదరాబాద్ 68.03 స్కోరుతో తొమ్మిదో స్థానం, ఎన్ఐటీ వరంగల్ 60 స్కోరుతో 21వ ర్యాంకు, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 44వ ర్యాంకు, ఐఐటీ తిరుపతి 48.16 స్కోరుతో 56వ ర్యాంకు, ఐఐఐటీ–హైదరాబాద్ 46.41 స్కోరుతో 62వ ర్యాంకు, జేఎన్టీయూ–హైదరాబాద్ 42.77 స్కోరుతో 76వ ర్యాంకు సాధించాయి. మేనేజ్మెంట్ ఐఐఎం–అహ్మదాబాద్ 83.35 స్కోరుతో తొలి ర్యాంకు, ఐఐఎం–బెంగళూరు 82.62 స్కోరుతో 2వ ర్యాంకు, ఐఐఎం–కలకత్తా 78.64 స్కోరుతో మూడో ర్యాంకు సాధించాయి. ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్–హైదరాబాద్ 54.88 స్కోరుతో 32వ ర్యాంకు, ఐఐఎం–విశాఖపట్నం 54.36 స్కోరుతో 33వ ర్యాంకు, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 51.27 స్కోరుతో 47వ ర్యాంకు సాధించాయి. ఫార్మసీ జామియా హమ్దర్ద్–న్యూఢిల్లీ 79.50 స్కోరుతో తొలి ర్యాంకు, నైపర్–హైదరాబాద్ 79.46 స్కోరుతో రెండో ర్యాంకు సాధించగా, హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ 47.38 స్కోరుతో 44వ ర్యాంకు సాధించింది. -
తమిళనాడులో దాడి, ఖండించిన కేరళ సీఎం
మద్రాస్–ఐఐటీలో బీఫ్ విందు ఇచ్చిన విద్యార్థిపై దాడి తిరువొత్తియూరు (చెన్నై): మద్రాస్–ఐఐటీలో బీఫ్ విందు ఏర్పాటు చేసిన విద్యార్థిపై కొందరు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశువధ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ 80 మంది విద్యార్థులు ఆదివారం రాత్రి బీఫ్ బిరియాని తిన్నారు. ఐఐటీలో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థి సూరజ్ ఈ విందు ఏర్పాటు చేసినట్లు తెలుసుకున్న ఐఐటీలోని మరో వర్గం అతనిపై సోమవారం దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సూరజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు కంటి చూపు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని మద్రాస్–ఐఐటీ అధికార ప్రతినిధి తెలిపారు. సూరజ్పై దాడిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ ఖండించారు. దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పశువులను వధ కోసం అమ్మకుండా, కొనకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. -
మద్రాస్ ఐఐటీలో మరో ఆత్మహత్య!
చెన్నై: మద్రాస్ ఐఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బీ టెక్ (ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్) ఫైనల్ ఇయర్ చదువుతున్న రాహుల్ జీ ప్రసాద్ సోమవారం తనువు చాలించాడు. గంగా హాస్టల్ మూడో అంతస్తులో ఉంటున్న అతను తన గదిలో సీలింగ్కు ఉరి వేసుకొని కనిపించాడు. అయితే ఆత్మహత్య లేఖ లాంటిది ఏమీ దొరకలేదు. మృతుడి స్వస్థలం కేరళలోని కొల్లాం. అతని తల్లిదండ్రులు సాయంత్రానికి ఐఐటీకి చేరుకునే అవకాశముంది. గత నెలలో మద్రాస్ ఐఐటీలో చదువుతున్న వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన నాగేంద్ర రెడ్డి (23) ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోకపోవడం వల్ల ఒత్తిడితో నాగేంద్ర ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. మరో విద్యార్థి మృతి పట్ల ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి కారణాలు ఏమిటన్నది తెలియరాలేదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వృత్తి నిపుణులను అందిస్తున్న జాతీయస్థాయి సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటీ). ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుతున్న 68 మంది విద్యార్థులు గత మూడు దశాబ్దాల్లో ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఐఐటీల్లో జరుగుతున్న ఈ ఆత్మహత్యలపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ముట్టడి
మద్రాసు ఐఐటీలోని అంబేద్కర్-పెరియార్ విద్యార్థి సంఘం గుర్తింపు రద్దు వ్యవహారం రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఆందోళనకు తెరతీసింది. ఇప్పటికే అనేక సంఘాలు ఆందోళన బాటపట్టగా, డీఎంకే, విడుదలై చిరుతైగళ్ కట్చి వేర్వేరుగా సోమవారం పోరాటాలకు దిగాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్రాసు ఐఐటీలో అనేక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉన్నతవిద్య అభ్యసిస్తున్నారు. వీరి సంఖ్యకు తగినట్లుగా అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటైన అంబేద్కర్-పెరియార్ విద్యార్థి సంఘం గత నెల ఒక సమావేశాన్ని నిర్వహించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ పరిపాలనా తీరును తప్పుపట్టింది. కరపత్రాలు ముద్రించి వ్యతిరేక ప్రచారం నిర్వహించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విచారణ జరిపించి సదరు విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అనేక విద్యార్థి సంఘాలతోపాటూ వివిధ రాజకీయపార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా డీఎంకే విద్యార్థి విభాగం ఐఐటీ సమీపంలోని మధ్య కైలాష్ వద్ద ఉదయం 11 నుంచి ఆందోళన చేపట్టింది. అక్కడి నుంచి ఊరేగింపుగా ఐఐటీ వద్దకు చేరుకుని ముట్టడికి ప్రయత్నించాయి. అయితే పోలీసులు అడ్డుకుని 200 మందిని అరెస్ట్ చేశారు. తరువాత విడుదలై చిరుతైగళ్ కట్చి అధ్యక్షులు తిరుమావళవన్ నేతృత్వంలో మరో పోరాటం మొదలైంది. వీరుకూడా ఊరేగింపుగా ఐఐటీ వద్దకు చేరుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించారు. 150 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచ్చిరాపల్లి ప్రధాన బస్స్టేషన్ వద్ద వీసీకే నేతలు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం రైల్వేస్టేషన్లో రైల్రోకోకు ప్రయత్నిం చారు. పోలీసులు రైల్వేస్టేషన్ ప్రవేశద్వారం వద్ద వారిని అరెస్ట్ చేశారు. తిరుచ్చిలో 200 మంది అరెస్టయ్యారు. -
మద్రాస్ ఐఐటీ వివాదాస్పద నిర్ణయం
చెన్నై: మద్రాస్ ఐఐటీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్సదమైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, విధానాలను విమర్శించినందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘంపై నిషేధం విధించింది. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణతో అంబేద్కర్ పెరియార్ స్టూడెంట్ సర్కిల్(ఏపీఎస్సీ)పై వేటు వేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు ఏపీఎస్సీపై నిషేధం విధించినట్టు మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రిస్కా మాథ్యూ లేఖ రాశారు. మోదీ సర్కారును, విధానాలను విమర్శిస్తూ ఏపీఎస్సీ పంచిన కరపత్రాలతో విద్యార్థులు హెచ్ ఆర్డీ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అయితే ఆకాశరామన్న ఉత్తరాలతో తమపై నిషేధం విధించడం పట్ల ఏపీఎస్సీ నిరసన వ్యక్తం చేసింది. హిందూమత సంస్థలే తమపై ఫిర్యాదు చేశాయని ఆరోపించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement