-
కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ: చాడ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. 3 రోజులపాటు మఖ్దూంభవన్లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ సమావేశం వివరాలను చాడ వివరించారు. టీఆర్ఎస్ పాలనపై ఉద్యోగులు, యువకులు, రైతులతోసహా అన్ని వర్గాలు ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నాయ ని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను, కేంద్రంలో బీజేపీని ఓడించడానికి ప్రజాస్వామిక, లౌకిక విశాల కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నయీం దోస్తులంతా ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారని చాడ ఆరోపించారు. ఆర్టీసీలో టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘమే ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉందని, టీఎంయూ నేతృత్వంలోనే బస్భవన్ను ముట్టడించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో కూటమిని ఏర్పాటు చేయడానికి ఇతర పార్టీలతో చర్చిస్తున్నామన్నారు. జూన్ 2న అమరవీరుల ఆకాంక్ష దినం జరుపుతామని, గద్దర్, విమలక్కతో సహా కళాకారులతో ఆటపాటలు, ధూంధాం నిర్వహిస్తామన్నారు . -
బంగారు కాదు.. ఆత్మహత్యల తెలంగాణ
శాలిగౌరారం (నకిరేకల్) : టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని బంగారు కాదు.. ఆత్మహత్యల తెలంగాణగా మార్చిందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్ధంకి దయాకర్ ధ్వజమెత్తారు. బుధవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలోనూ రైతన్నల పరిస్థితి తీవ్ర దుర్భిక్షంగా మారిందన్నారు. రైతుల సంక్షేమం ప్రకటనలకే పరిమితం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలనుంచి గట్టెక్కలేక తీవ్ర ఇబ్బందికర పరిస్థితితుల్లో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతుబంధు పథకం భూస్వామ్య పెట్టుబడిదారులకే ఎక్కువగా ఉపయోగపడేలా ఉందేతప్ప చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం లేదన్నారు. కౌలుదారులకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేసినప్పుడే పేద రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్పార్టీ ప్రజలపక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే తట్టుకోలేక కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంబిస్తూ పాలన సాగిస్తుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి 2019లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు చింత ధనుంజయ్య, గూని వెంకటయ్య, వంగూరి వెంకన్న, సత్తయ్య, బిక్షం, ప్రశాంత్, సురేశ్, నాగరాజు, మహేశ్, కిరణ్కుమార్, బడేసాబ్, నగేశ్, రాజేశ్, కిరణ్, శంకర్, నాగార్జున్, పరమేశ్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణ
అర్వపల్లి (తుంగతుర్తి) : బంగారు తెలంగాణ నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం జాజిరెడ్డిగూడెంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని గ్రహించిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మాట్లాడుతూ వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మొరిశెట్టి ఉపేందర్, మాజీ ఎంపీపీ మీలా చంద్రకళ, పీఏసీఎస్ చైర్మన్ ఇందుర్తి వెంకట్రెడ్డి, దండ వీరారెడ్డి, మీలా కిష్టయ్య, కాపా వెంకటేశ్వర్రావు, కె.సోమిరెడ్డి, పెద్దయ్య, భూమయ్య, కుంభం నర్సయ్య, లింగమల్లు, రాంమ్మల్లు, అనిరెడ్డి శేఖర్రెడ్డి, దోరేపల్లి వెంకటయ్య ఉన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎల్.కిషన్రావు, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మొరిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ దావుల మనీషావీరప్రసాద్, మార్కెట్ చైర్పర్సన్ పాశం విజయయాదవరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కుంట్ల సురేందర్రెడ్డి, అంబయ్య, దావుల వీరప్రసాద్, పాశం యాదవరెడ్డి, బి.రామలింగయ్య, ఎర్రనర్సయ్య, వైస్ ఎంపీపీ వెంకన్న, సర్పంచ్లు ప్రమీల, జీడి వీరస్వామి, వి.గంగయ్య, మన్నె లక్ష్మినర్సు, పద్మ, మామిడి సోమయ్య, మామిడి సత్యనారాయణ, హరిప్రసాద్, కె. మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణకు ‘విజన్ 2024’
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ప్రజల అవసరాలు, ప్రస్తుత పథకాలను సద్వినియోగం చేసుకునే దిశగా కార్యాచరణకు నడుం బిగిస్తోంది. విజన్–2024 పేరుతో రాబో యే ఏడేళ్లకు దూరదృష్టితో డాక్యుమెంట్ సిద్ధం చేస్తోంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) సహకారంతో రాష్ట్ర ప్రణాళిక, ఆర్థిక శాఖలు ఈ ప్రణాళిక రూపొందిస్తున్నాయి. దీనికి అవసరమైన సమాచారాన్ని సీజీజీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అన్ని శాఖలకు ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశాయి. నవంబర్ నెలాఖరులోగా విజన్ 2024 ముసాయిదా తయారు చేసి.. అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల భాగస్వాములతో సంప్రదింపులు జరపాలని భావిస్తోంది. వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేసి డిసెంబర్ 31న తుది డాక్యుమెంట్ ప్రచురించాలని యోచిస్తోంది. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రస్తుత పరిస్థితిని నివేదించడంతోపాటు ఏడేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను డాక్యుమెంట్లో పొందుపరుస్తారు. 10 కేటగిరీలుగా ప్రభుత్వ శాఖలు.. విజన్ డాక్యుమెంట్ తయారీకి వీలుగా ప్రభుత్వ శాఖలు, విభాగాలను 10 కేటగిరీలుగా ప్రభు త్వం వర్గీకరించింది. 10 కేటగిరీలుగా బంగారు తెలంగాణ లక్ష్యాలను నిర్దేశిస్తారు. 2024 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలి.. ఆ దిశగా ప్రభుత్వం చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను విజన్ డాక్యుమెంట్ కళ్లకు కట్టిస్తుందని అధికారులు వెల్లడించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ఇందులో ప్రాధాన్యమిస్తారు. ఉదాహరణకు రాష్ట్రంలో ప్రస్తుతం పాల ఉత్పత్తి ఎంత ఉంది, ప్రస్తుతమున్న జనాభాకు సరిపడేంత స్థాయిలో పాల సరఫరా ఉందా, 2014 నాటికి జనాభా ఎంత మేర పెరుగుతుంది, అప్పటి అంచనాలకు ఎంత మేరకు పాల ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి, అందుకు పశు సంవర్థక శాఖ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ఇలా అంచెల వారీగా లక్ష్యాలను అందుకునేలా విజన్లో ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
‘బంగారు పతకాల తెలంగాణ’ సాధిద్దాం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో మేటిగా ఉంచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని స్పోర్ట్స అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆటల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణకు కొనసాగింపుగా ‘బంగారు పతకాల తెలంగాణ’ సాధించడమే తమ లక్ష్యమని చైర్మన్ వెల్లడించారు. తాను చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ అంశాలపై తీసుకున్న చర్యలు, సమీక్షా సమావేశాలు తదితర అంశాల గురించి బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వెంకటేశ్వర రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ మేనేజింగ్ డెరైక్టర్ ఎ.దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. భారీ ప్రోత్సాహకాలు... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి క్రీడల నిర్వహణతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చైర్మన్ చెప్పారు. 2014 జూన్ 2నుంచి ఇప్పటి వరకు ఇందు కోసం మొత్తం రూ. 15 కోట్ల 8 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన వివరాలు ప్రకటించారు. తాను జరిపిన సమావేశాల్లో ఆటల అభివృద్ధి కోసం క్రీడా ప్రముఖులు, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలనుంచి పలు విలువైన సూచనలు వచ్చాయని, వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంను పూర్తి స్థారుులో క్రీడా కేంద్రంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాని చైర్మన్ స్పష్టం చేశారు. మరో వైపు కొంత మంది క్రీడాకారులకే భారీ మొత్తం ఇవ్వడంపై స్పందిస్తూ... అది వేర్వేరు కారణాలు, అంశాలపై ఆధారపడి ప్రభుత్వం తీసుకున్న విచక్షణాపరమైన నిర్ణయమని ఎండీ దినకర్ బాబు వివరణ ఇచ్చారు. మరోవైపు యోగాలాంటి గుర్తింపు లేని క్రీడల టోర్నీ నిర్వహణ కోసం పెద్ద మొత్తం కేటారుుంచడాన్ని కూడా ఆయన సమర్థించుకున్నారు. చాలా కాలంగా తగిన ప్రోత్సాహం లేకుండా ఉన్న కొన్ని రకాల క్రీడలను గుర్తించి వాటిని కూడా తగిన విధంగా సహాయం అందించడంపై దృష్టి పెట్టామని ఆయన అన్నారు. ప్రతిభ గల యువ ఆటగాళ్లను తగిన విధంగా ఉద్యోగాల ద్వారా, చదువుల్లో రిజర్వేషన్ ద్వారా ప్రోత్సహిస్తామని దినకర్బాబు హామీ ఇచ్చారు. మరో వైపు ‘శాట్స్’లో ఖాళీగా ఉన్న కోచ్ల ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని, గతంలో కొన్ని అక్రమాలు జరిగినా, ఈసారి దానికి అవకాశం ఇవ్వకుండా సమర్థులైన వారినే ఎంపిక చేస్తామని ఎండీ వెల్లడించారు. తెలం గాణలో క్రీడాభివృద్ధి కోసం ఎవరైనా ముందుకొచ్చి సూచనలు చేయవచ్చని, తాము వాటిని తీసుకొని తగిన విధంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చైర్మన్ విజ్ఞప్తి చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement