-
రేషన్షాపులు పరిశీలించిన జేసీ
సాక్షి కథనానికి స్పందన విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని రేషన్ షాపులను జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్ బి లఠ్కర్ మంగళవారం పరిశీలించి తనిఖీ చేశారు. సాక్షి దినపత్రికలో ‘తొలి రోజే తంటాలు’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన వార్తకు స్పందించిన ఆయన జిల్లా కేంద్రం, గంట్యాడ మండలం రామవరంలో ఆయన రేషన్షాపుల్లో ఈ పాస్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్బంగా డీలర్లతో మాట్లాడుతూ ఈ పాస్లో లోపాలుంటే వెంటనే సమాచారాన్ని ఇవ్వాలన్నారు. ఈపాస్ యంత్రాలు, ఈవెయింగ్ మెషీన్లు పనిచేయనపుడు తక్షణమే మరమ్మతు పనులు చేయించుకోవాలన్నారు. ఆయన వెంటన డీఎస్ఓ పి.నాగేశ్వరరావు ఉన్నారు. -
పాక్పై కివీస్ విజయం
వెల్లింగ్టన్: ప్రపంచకప్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్ జట్టు అద్భుత రీతిలో చెలరేగుతోంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో పాకిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో మరో 63 బంతులు మిగిలుండగానే ఏడు వికెట్లతో నెగ్గింది. గ్రాంట్ ఇలియట్ (68 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు), రాస్ టేలర్ (81 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు) ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండు వన్డేల సిరీస్లో భాగంగా వెస్ట్పాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 45.3 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కివీస్ బౌలర్ల ధాటికి 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన స్థితిలో... స్టార్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది (29 బంతుల్లో 67; 9 ఫోర్లు; 3 సిక్సర్లు) చెలరేగడంతో జట్టుకు ఆ మాత్రం స్కోరైనా దక్కింది. కెప్టెన్ మిస్బా (87 బంతుల్లో 58; 4 ఫోర్లు; 2 సిక్సర్లు)తో కలిసి 38 బంతుల్లోనే ఏడో వికెట్కు 71 పరుగులు జోడించాడు. ఇలియట్కు మూడు, మిల్స్, బౌల్ట్, అండర్సన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన కివీస్ 39.3 ఓవర్లలో మూడు వికెట్లకు 213 పరుగులు చేసి నెగ్గింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇలియట్, టేలర్ నాలుగో వికెట్కు అజేయంగా 112 పరుగులు జోడించారు. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో వన్డే 3న నేపియర్లో జరుగుతుంది. -
దక్షిణాఫ్రికాదే తొలి వన్డే
2 వికెట్లతో భారత్పై గెలుపు బెంగళూరు: భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు శుభారంభం చేసింది. సోమవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. స్వల్ప స్కోర్ల ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 38.5 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. జులన్ గోస్వామి (33), హర్మన్ప్రీత్ కౌర్ (31) ఐదో వికెట్కు 63 పరుగులు జోడించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. వాన్ నీ కెర్క్ (4/9), మరిజేన్ కాప్ (4/21) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. 31 పరుగులకే ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. అయితే క్లో ట్రయాన్ (80 బంతుల్లో 50; 7 ఫోర్లు) ఒంటరిగా పోరాడి దక్షిణాఫ్రికాను గెలిపించింది. ఆ జట్టు 41.1 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు సాధించింది. జులన్కు 3 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే మైదానంలో బుధవారం జరుగుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెన్నైకి గేమ్
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement