-
ఆక్రమణలే అడ్డంకులు!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరికి వడ్డాణంలో వంకెలు తిరుగుతూ వయ్యారంగా ఉండే మూసీ నదిని సుందరీకరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే, ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రధాన అడ్డంకులు మూసీ చుట్టూ ఉన్న ఆక్రమణలే. మూసీ నది పరివాహకం వెంబడి 8,500 ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. చారిత్రక మూసీ నదికి ఇరువైపులా బఫర్ జోన్లో, నదీగర్భంలో కూడా భవన నిర్మాణాలు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), రెవెన్యూ, నీటి పారుదల శాఖ సంయుక్తంగా డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) సాంకేతికతను ఉపయోగించి మూసీ నది వెంట విస్తృత సర్వే చేశారు. మూసీ వెంబడి ఉన్న గ్రామ పటాలపై ఆ చిత్రాలను స్పష్టంగా కనిపించేలా (సూపర్ఇంపోజ్) చేశారు. ఆక్రమణలే పెద్ద సవాల్.. మూసీని శుభ్రం చేయడం ఎంత పెద్ద సవాలో అంతకు రెట్టింపు మూసీ నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నది పరివాహకం వెంబడి చాలా చోట్ల చిన్న గుడిసెలు, బస్తీలతో పాటు భవన నిర్మాణాలు ఉన్నాయి. నది గర్భంలో 1,700, బఫర్ జోన్లో 6,800 నిర్మాణాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వరకు మతపరమైన కట్టడాలున్నాయి. వీటిలో చాలా వరకు గత రెండు దశాబ్ధాల కాలంలోనే నిర్మితమయ్యాయి. ముఖ్యంగా హైకోర్టు నుంచి చాదర్ఘాట్ మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన ఈ మతపరమైన కట్టడాలను తొలగించడం చాలా అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంత నివాసితులకు 2 బీహెచ్కే గృహాలను కేటాయించి ఆక్రమణలను తొలగించాలని భావించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. భన్వర్లాల్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా వ్యవహరించిన తరుణంలో మూసీ ఒడ్డున నివసిస్తున్న కాలనీ వాసుల కోసం నందనవనంలో ప్రత్యేకంగా గృహా సముదాయం కట్టించి ఇచ్చినా.. నదీ గర్భంలో ఆక్రమణలు మాత్రం ఆగలేదు. మూసీకి మాస్టర్ ప్లాన్.. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ భూ వినియోగం, ఇతర వివరాలు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉన్నాయి. తాజాగా మూసీ నదిలో వరద స్థాయి, సరిహద్దులను గుర్తించేందుకు 55 కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే చేయాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) నిర్ణయించింది. హద్దుల లెక్క తేలిన తర్వాత గ్లోబల్ కన్సల్టెంట్ల సహాయంతో మూసీ నదీ గర్భంలో రిక్రియేషనల్ జోన్, ల్యాండ్ స్కేపింగ్, కమర్షియల్ జోన్లతో సమగ్ర మాస్టర్ ప్లాన్ను అభివృద్ధి చేయనున్నారు. మూసీని సుందరీకరించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా గ్లోబల్ సిటీ రివర్ ఫ్రంట్గా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి కల. మూసీ అభివృద్ధికి అయ్యే వ్యయంలో కొంత బ్యాంకు నుంచి రుణం, మరికొంత పీపీపీ పద్ధతిలో చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం మున్సిపల్ అధికారులను ఆదేశించారు. -
ఉత్తరాంధ్రపై రామోజీ ఉన్మాదం..
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రజాదరణ కోల్పోయింది.. చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి ఆ పార్టీ పరిస్థితి నానాటికీ పాతాళానికి పడిపోతోంది.. సానుభూతి పవనాలు ఎక్కడా లేవు.. పైగా అరెస్టును నిరసిస్తూ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు మైలేజీ ఇవ్వలేకపోయాయి.. ఎన్ని జాకీలు పెట్టినా ఫలితం శూన్యం. దీంతో పచ్చగ్యాంగ్కు పిచ్చెక్కిపోతోంది. ఒకటే మార్గం కనిపిస్తోంది.. అదీ పదేళ్లకు పైగా చేస్తున్నదే.. ఎప్పటిలాగే జగన్ను టార్గెట్ చేయడం.. ప్రభుత్వాన్ని అభాసుపాల్జేయడం. ఇంకేముంది.. రుషికొండపై జనం సొమ్ముతో జగన్ సోకులు అంటూ శుక్రవారం ఈనాడు తన పైశాచిక ఆనందాన్ని మరోసారి ప్రదర్శించి విశాఖపై తన అక్కసుకు అంతులేదని చాటుకుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటే ప్రభుత్వంపై తెగ విషం చిమ్ముతోంది. ప్రగతిని అడ్డుకోవడంలో ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని దిగజారుడు రాతలు రాస్తోంది. చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా కబ్జాలు చేస్తే కన్నెత్తి చూడని, పెన్నెత్తి రాయని రామోజీ.. ఇప్పుడు ఉన్మాదంతో వెర్రెక్కిపోతున్నారు. బోడిగుండు రాతలు.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో ఈనాడుకు కంటిమీద నిద్ర కరువైంది. అందుకే తన మార్కు వక్రీకరణ రాగం అందుకుంది. రుషికొండ బోడిగుండయ్యిందంటూ అనుమతుల విషయంలో అసత్య ప్రచారం చేసింది. కానీ, ప్రభుత్వం రుషికొండపై నిర్మాణాలు చేస్తున్న విస్తీర్ణం, వాటికున్న అనుమతులు అంకెలతో సహా చెప్పేసరికి దిమ్మతిరిగింది. అయితే.. ఎన్నడూ నిజాలను అంగీకరించని ఈనాడు.. నిస్సిగ్గుగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలకు పదును పెడుతూనే ఉంది. ఇంతలో సీఎం జగన్ విశాఖ కేంద్రంగా సమీక్షలు, సమావేశాలు చేయాల్సి ఉండటంతో, అక్కడ విడిది చేసేందుకు ముఖ్యమంత్రికి, అధికారులకు, ఇతర ప్రభుత్వ శాఖలకు అవసరమైన వసతి సదుపాయాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ప్రభుత్వ భవనాలను గుర్తించే పనిలో ఉంది. ఇందులో భాగంగానే సీఎం క్యాంపు కార్యాలయం కోసం సరైన భవనాలను అన్వేషిస్తూ రుషికొండపై నిర్మాణాలను కూడా పరిశీలిస్తోంది. వాస్తవానికి అవి రిసార్టుల కోసం నిర్మించినవి కావడం, వాటిని సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించాల్సి వస్తే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పటివరకూ దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ, రుషికొండలో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనంటూ గుండెలు బాదుకుంటోంది. రుషికొండపై శాశ్వత భవనాల నిర్మాణం.. ఇక రుషికొండపై నిర్మిస్తున్నవి ప్రభుత్వ భవనాలే. అవి కూడా శాశ్వత భవనాలు. వాటిని టూరిజం ప్రాజెక్టులో భాగంగా పునర్మిర్మిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసింది. దాదాపు ఈ భవనాలు ఇప్పుడు పూర్తికావొచ్చాయి. కానీ, వాటిని ప్రైవేటు భవనాలుగా, ప్రైవేటు వ్యక్తుల కోసం ఉచితంగా నిర్మిస్తున్నట్లు.. వేరెవరికో దోచిపెడుతున్నట్లుగా ఈనాడు రంకెలేస్తోంది. అవి ఎప్పటికీ ప్రభుత్వ భవనాలే అన్న విషయాన్ని దాచేందుకు నానాపాట్లు పడుతోంది. అందుకే రుషికొండలో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనని, వాటిని వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవనాల ఖర్చుతో పోల్చి బొక్కబోర్లా పడింది. నిజానికి.. గత టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.6,070 మాత్రమే ఖర్చయిందంటూ దోపిడీని తక్కువచేసి చూపించింది. వాస్తవంగా అక్కడ చ.అ.కు అయిన ఖర్చు రూ.9,166. ఆ తర్వాత కూడా మరికొంత అదనంగా ఖర్చుచేశారు. ఈ మొత్తం కలుపుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంత ఖర్చుచేసినా అవన్నీ తాత్కాలిక భవనాలే. ఈ విషయాన్ని గత ప్రభుత్వమే చెప్పింది. కేవలం తాత్కాలిక భవనాల నిర్మాణం కోసం చదరపు అడుగుకు ఎక్కడైనా ఇంత ఖర్చు చేస్తారా? పైగా ఈ భవన నిర్మాణాల్లో డొల్లతనం రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే. వర్షం నీరు కారడం, గదుల్లోకి మురుగు పొంగడం, గోడలు బీటలు వారడం చూస్తే వాటి గొప్పతనం అర్థమవుతుంది. కబ్జాలను దగ్గరుండి ప్రోత్సహించలేదా? మరోవైపు.. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని పేరుతో భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆధారాలు లేకుండా ఈనాడు క్షుద్ర రాతలు రాస్తోంది. కానీ, టీడీపీకి చెందిన మాజీ ఎంపీ, బాలకృష్ణ వియ్యంకుడు తద్వారా చంద్రబాబుకు బంధువైన ఎంవీఎస్ మూర్తి ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలోనే ఏకంగా 38.60 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జాచేస్తే ఈనాడు కళ్లు మూసుకుని కూర్చుంది. పైగా ఈ కబ్జా జరిగింది ఎక్కడోకాదు.. రోజూ రుషికొండ చుట్టూ తప్పుడు కథనాలు అల్లుతున్న ప్రాంతానికి సరిగ్గా ఎదురుగానే. ఇంత జరుగుతుంటే అప్పట్లో చంద్రబాబు నోరు పెగల్లేదు.. రామోజీ పెన్ను కదల్లేదు. పైగా వారి కబ్జాలకు వత్తాసు పలికారు. కానీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములను కబ్జాల చెర నుంచి విడిపిస్తోంది. ఇవి తొలగిస్తుంటేనే ఈనాడు దానిని అభివృద్ధి విధ్వంసంగా చిత్రీకరిస్తోంది. వాస్తవానికి ఈ ప్రభుత్వం రుషికొండలో మొదటి విడతలో 19.39 ఎకరాలను, రెండో విడతలో 4.74 ఎకరాలను కలిపి మొత్తంగా 24.13 ఎకరాలను స్వా«దీనం చేసుకుంది. కోర్టు స్టేతో మిగిలిన భూముల స్వా«దీన ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. అభివృద్ధిపైనా ఈనాడు అక్కసు.. ఇక రుషికొండకు సమీపంలో హెలీప్యాడ్, రుషికొండ చుట్టూ గ్రావెల్ రోడ్డు 2019కి ముందే ఉన్నాయి. కానీ, ముఖ్యమంత్రి విలాసాల్లో భాగంగా వీటిని నిర్మించారంటూ ఈనాడు కలరింగ్ ఇచ్చింది. తాజాగా.. టూరిజం ప్రాజెక్టులో భాగంగా ఈ రోడ్డు మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. చివరికి ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధిని కూడా ఈనాడు జీర్ణించుకోలేకపోతోంది. ఒక ప్రాంతాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేటప్పుడు.. ప్రజల నివాసాలు వస్తున్న కొద్దీ కరెంటు, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పిస్తారు. ఇది ఏ ప్రభుత్వమైనా చేసేదే. కానీ, ఈనాడుకు మాత్రం వంకరగా కనిపిస్తోంది. ఎందుకంటే.. రామోజీ బుద్ధే వక్రబుద్ధి కాబట్టి!. ప్రభుత్వ భవనాల్లో ఎక్కడైనా ఉండొచ్చు.. రుషికొండపై సీఎం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేస్తే ఏదో తప్పన్నట్లుగా, చట్టవిరుద్ధమైనట్లు ఈనాడు పెడ»ొబ్బలు పెడుతోంది. విశాఖపట్నం పక్క దేశంలోనో, శత్రుదేశంలోనో ఉన్నట్లు చిత్రీకరిస్తోంది. అసలు రుషికొండలో ఉన్నవన్నీ ప్రభుత్వ భవనాలేనన్న పచ్చి నిజాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతోంది. వాస్తవానికి.. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీనికి రాజ్యాంగబద్ధంగా ఆయనకు సర్వాధికారాలు ఉంటాయి. ఈ నిజాన్ని ఈనాడు అంగీకరించదు. -
గల్లీ నుంచి ఢిల్లీ దాకా..ఆక్రమణదారుల చెరలో 38,496 చెరువులు
సాక్షిప్రతినిధి, వరంగల్: నగరాలు, పట్ణణాలు, పల్లెలు.. ఇవేమీ తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్నారు.. ఫలితంగా వేల సంఖ్యలో జలవనరులు కనుమరుగవుతున్నా యి. ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చినవాటి లో కొన్ని ఆక్రమణలపాలై కనుమరుగు కాగా మరికొన్ని మురుగునీటి కాసారాలుగా మారాయి. ఇటీవల కేంద్ర మైనర్ ఇరిగేషన్ స్టాటిస్టిక్స్ విభాగం విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ‘ఇరిగేషన్ సెన్సెస్’నిర్వహించింది. అనేక చెరువులు కనుమరుగైనట్లు, మరి కొన్ని ప్రమాదంలో ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. ఓరుగల్లు చెరువులు ఎంతెంత పోయాయంటే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలో కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలతో కుచించుకు పోయాయి. 100 ఎకరాలకుపైగా ఉండే చిన్నవడ్డేపల్లి చెరువు సుమారు 20 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు కొద్ది రోజుల క్రితం రెవెన్యూ శాఖనే తేలి్చంది. మామునూరు పెద్ద చెరువు 170 ఎకరాలకుగాను సుమారు 40 ఎకరాలు, 126 ఎకరాల్లో విస్తరించి ఉన్న పాతబస్తీ ఉర్సు రంగ సముద్రం (ఉర్సు చెరువును) సుమారు 26 ఎకరాలు, హనుమకొండ హంటర్రోడ్ న్యూశాయంపేటలో 150 ఎకరాల విస్తీర్ణంలోని కోటి చెరువులో సుమారు 25–30 ఎకరాల వరకు ప్రైవేటుపరమయ్యాయి. హన్మకొండ, కాజీపేట ప్రాంతవాసుల తాగునీటి అవసరాలు తీర్చే హన్మకొండ వడ్డేపల్లి చెరువులో 40 ఎకరాలకు వరకు, 336 ఎకరాల భద్రకాళి చెరువులో సుమారు 40 ఎకరాల పైచిలుకు కనుమరుగైందని అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఆక్రమణకు గురైనవి 3,032 దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చిన్ననీటి వనరులు కుచించుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా 38,496 చెరువులు, ట్యాంకులు, సరస్సులు తదితర చిన్ననీటి వనరులు ఆక్రమణకు గురికాగా, సుమారు 14,535 చోట్ల ప్రమాదంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కాగా అత్యధికంగా ఆక్రమణలకు గురైన ఐదు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 64,056 చిన్ననీటి వనరుల్లో 3,032 ఆక్రమణలకు గురైనట్లు నివేదిక తేల్చింది. ఈ 3,032 చెరువుల్లో ఎక్కువ హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్, కరీంనగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు సెంటిమీటర్ల వాన పడితే నగరం మునుగుడే కాకతీయ రాజులు నిర్మించిన అనేక చెరువులు వరంగల్ నగరం చుట్టూ ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణల వల్ల గొలుసుకట్టు చెరువుల సిస్టం దెబ్బతిని ఐదు సెంటిమీటర్ల వర్షం పడితే చాలు నగరం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆక్రమణలను నియంత్రించకపోతే ఆ చెరువులు పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయే ప్రమాదం ఉంది. – చీకటి రాజు, రాష్ట్ర కన్వీనర్, కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ లోకాయుక్తలో విచారణ జరుగుతోంది వరంగల్లో 8కి పైగా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. వీటన్నింటిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాం. భద్రకాళీ సహా అన్ని చెరువుల ఆక్రమణపై లోకాయుక్త కోర్టులో చేసిన ఫిర్యాదులపై తదుపరి విచారణ 2024 జూన్ 23న ఉంది. – సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర అధ్యక్షుడు, వినియోగదారుల మండలి చెరువుల ఆక్రమణలపై నోటీసులు వరంగల్ నగరం, పరిసర ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలపై వచి్చన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మా దృష్టికి వచి్చన వాటిని ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి సందర్శించి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చాము. పోలీసు, రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదులు చేశాం. – ఎ.సుధాకర్ రెడ్డి, ఎస్ఈ, జలవనరులశాఖ చదవండి: ‘థర్మల్’కు బై.. ‘రెన్యూవబుల్’కు జై! -
తెలంగాణలో 64,056 జల వనరులు
తెలంగాణలో మొత్తం 64,056 జల వనరులు ఉన్నాయని.. వీటిలో 98.5% (63,064) గ్రామీణ ప్రాంతాల్లో, మిగిలిన 1.5% (992) పట్టణాల్లో ఉన్నాయని కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన తొలి జల వనరుల సెన్సస్ నివేదిక వెల్లడించింది. 80.5% (51,593) జల వనరులు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండగా, 19.5% (12,463) ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి. 17.3% (11,076) జల వనరులు ‘కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం’కింద, 10.6% (6,781) గిరిజన ప్రాంతాల్లో, మిగిలిన 72.1% (46,199) వరద పీడిత ప్రాంతాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేగాక 64,056 జల వనరుల్లో 80.8% (51,733) వాడుకలో ఉండగా, 19.2% (12,323) ఎండిపోవడం, పూడిక తీయకపోవడం, మరమ్మతు చేయలేని విధంగా నాశనం కావడం, లవణీయత ఇతర కారణాల వల్ల ఉపయోగంలో లేవని నివేదికలో వెల్లడించారు. – సాక్షి, న్యూఢిల్లీ నిండిన స్థితిలో 43,695 జల వనరులు రాష్ట్రంలో 10,170 సహజసిద్ధమైన, 53,886 మానవ నిర్మిత జల వనరులు ఉన్నాయి. సహజ జల వనరుల్లో 96.2% (9,781) గ్రామీణ ప్రాంతాల్లో, 3.8% (389) పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. మానవ నిర్మిత జల వనరుల్లో 98.9% (53,283) పల్లెల్లో, 1.1% (603) పట్టణాల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని 64,056 జల వనరుల్లో 43,695 వనరులు ‘నిండిన నిల్వ సామర్థ్యం’/ ’నిండిన స్థితి’కలిగి ఉన్నాయి. గత ఐదేళ్లలో నిల్వ సామర్థ్యాన్ని పెంచడం లాంటి ప్రమాణాల ఆధారంగా ఈ 43,695 వనరుల్లో 20.3% (8,862) ప్రతి ఏటా నిండుతున్నట్లు గుర్తించారు. 41.9% (18,301) సాధారణంగా నిండుతుండగా, 29.8% (13,033) చాలా అరుదుగా నిండుతున్నాయని, 8.0% (3,499) ఎప్పుడూ నిండట్లేదని నివేదికలో వెల్లడించారు. మొత్తమ్మీద 38,540 వనరులు జిల్లా నీటిపారుదల ప్రణాళిక/రాష్ట్ర నీటిపారుదల ప్రణాళికలో ఉన్నాయి. వీటిలో 45.9% (17,681) చెరువులు కాగా, 54.1% (20,859) ట్యాంకులు, సరస్సులు, రిజర్వాయర్లు, నీటి సంరక్షణ పథకాలు/చెక్ డ్యామ్లు మొదలైనవి ఉన్నాయి. 1,540 చెరువులు, 1,492 ట్యాంకులు, సరస్సుల్లో ఆక్రమణలు రాష్ట్రంలోని 3,032 జల వనరుల్లో ఆక్రమణలను గుర్తించారు. వాటిలో 50.8% (1,540) చెరువులు, 49.2% (1,492) ట్యాంకులు, సరస్సులు, రిజర్వాయర్లు, జల సంరక్షణ పథకాలు/చెక్ డ్యామ్లు మొదలైనవి ఉన్నాయి. వీటిలో 3,032 ఆక్రమణకు గురైన జల వనరులు, 2,028 జల వనరుల్లో ఆక్రమణ ప్రాంతాన్ని అంచనా వేశారు. ఈ 2,028 వనరులకుగాను 1,415 జల వనరుల్లో 25% కంటే తక్కువ విస్తీర్ణంలో ఆక్రమణలకు గురవుతున్నాయని, 402 జలవనరులు 25%–75% మధ్య ఆక్రమణ కలిగి ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. మిగిలిన 211 జల వనరులు 75% కంటే ఎక్కువ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 64,056 జల వనరుల్లో 63,769 వనరుల్లో ‘జల వ్యాప్తి ప్రాంతం’నివేదించారు. వీటిలో 51.6% (32,914) జల వనరులు 0.5 హెక్టార్ల కంటే తక్కువ జల వ్యాప్తిని కలిగి ఉన్నాయి. అయితే 1.8% (1,166) జల వనరులు 50 హెక్టార్ల కంటే ఎక్కువ జల వ్యాప్తిని కలిగి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. -
Fact Check: ప్రహరీలు తొలగిస్తే ఇళ్లు కూల్చినట్టా?
సాక్షి, అమరావతి: ఆక్రమణలు పెరిగి రోడ్లు ఇరుకైపోవటంతో మంగళగిరి– తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని రోడ్ల వెంట ఉన్న ఆక్రమణలను తొలగించే పని రెండేళ్ల కిందటే మొదలుపెట్టారు. గత జనవరికల్లా పూర్తి చేశారు. తరువాత రూరల్ ప్రాంతంలోని ఆర్ అండ్ బీ రోడ్ల ఆక్రమణలపై చర్యలకు దిగారు. దాన్లో భాగంగానే ఇప్పటం గ్రామ పరిధిలో 75– 80 అడుగుల మేర ఉండాల్సిన ఆర్ అండ్ బీ రోడ్డును ఇరువైపులా 10 అడుగుల మేర ఆక్రమించి ప్రహరీలను నిర్మించుకున్నట్లు గుర్తించారు. ఇలా 54 మంది రోడ్డు ఆక్రమించినట్టు గుర్తించి జనవరిలో మార్కింగ్ చేశారు. ఏప్రిల్, మే నెలల్లో రెండుసార్లు నోటీసులిచ్చారు. అనంతరం ఆక్రమణల తొలగింపును ఆరంభించారు. ఆత్మకూరు– పెద వడ్లపూడిలో తొలగింపు పూర్తయ్యింది కూడా. ఇదీ.. వాస్తవం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు రూ.3 కోట్లతో ఇప్పటం గ్రామంలో అభివృద్ధి పనులు చేయటంతో పాటు గత నెలలో మరో రూ.6 కోట్లను ఈ గ్రామానికి కేటాయించిందనేది కూడా కాదనలేని నిజం. తొలగింపులో భాగంగా రెండు రోజుల కిందట దాదాపు 25 మంది ఇళ్ల ప్రహరీలను తొలగించగా సంబంధింత యజమానులు సైతం సహకరించారు. ఇందులో వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు లచ్చి వెంకటేశ్వరరావు గౌడ్తో పాటు పార్టీ కార్యకర్తల ఇళ్ల ప్రహరీలూ ఉన్నాయి. కానీ, శుక్రవారం చివరి నాలుగు ఇళ్ల ప్రహరీలను తొలగిస్తుండగా జనసేన నాయకులు గొడవకు దిగారు. తాము జనసేనకు సహకరిస్తున్నందుకే ఇళ్లు కూలుస్తున్నారంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. జనసేన ప్లీనరీకి స్థలం ఇచ్చిన వారి ఇళ్లను టార్గెట్ చేసి కూల్చివేస్తున్నారని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే... ♦ఇప్పటం గ్రామంలోని ఆర్ అండ్ బీ రోడ్డు వెంబడి ఉన్న ఆక్రమణలను జనవరిలో మార్కింగ్ చేశారు. ఆ తరువాత ఏప్రిల్, మే నెలల్లో నోటీసులిచ్చారు. ♦తొలగిస్తున్నవి కేవలం రోడ్డును ఆక్రమించుకుని ఉన్న ప్రహరీలే. కానీ జనసేన ప్రచారం చేస్తున్నట్లుగా ఎవ్వరి ఇళ్లనూ కూల్చేయలేదు. ♦ప్రహరీలు తొలగింపునకు గురైన వారిలో వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు లచ్చి వెంకటేశ్వరరావు గౌడ్, పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ♦జనసేన ప్లీనరీ మార్చి నెలలో ఇప్పటం గ్రామంలో జరిగింది. ఆనాడు పవన్ కళ్యాణ్ గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలిస్తానని ప్రకటించారు కానీ ఇప్పటిదాకా రూపాయి కూడా ఇవ్వలేదు. ♦ప్రకటించిన డబ్బులివ్వాలని స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ అడగటంతో జనసేన నేతలు సాకులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకు పథకం పన్నారు. ♦ఇప్పుడు ప్రహరీలు తొలగిస్తుంటే రాజకీయం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్... 2016లో కృష్ణా పుష్కరాల కోసమని తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం, బోట్ యార్డు, ఎన్టీఆర్ కరకట్ట, క్రిస్టియన్పేట తదితర ప్రాంతాల్లో 325 ఇళ్లను నాటి టీడీపీ ప్రభుత్వం తొలగించినపుడు నోరు మెదిపితే ఒట్టు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement