-
ఇలాంటి కూతురు చచ్చినా పర్లేదు అనేవారు.. నాన్న చనిపోయాక..
ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం తలవంచక తప్పదు అంటున్నారు శతాబ్ది. దివ్యాంగురాలిగా మారిన తాను సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని సగర్వంగా చెబుతున్నారు. బ్యాంక్ మేనేజర్గా, క్రీడాకారిణిగా, సామాజిక కార్యకర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ‘శతాబ్ది’ జీవన ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. అందుకే ఆ పేరు పెట్టారు.. చిన్నతనం నుంచే హైపర్ యాక్టివ్. ఒక్కచోట కూడా కాలు నిలవనే నిలవదు. ఎల్లప్పుడూ ఉరుకులూ.. పరుగులే. అందుకే.. వేగంగా ప్రయాణించే శతాబ్ది ఎక్స్ప్రెస్(రైలు) పేరిట.. తమ అమ్మాయికి శతాబ్ది అని నామకరణం చేశారు ఆ తల్లిదండ్రులు. గెంతులు వేస్తూ ఎప్పుడూ సందడి చేసే తమ బిడ్డను చూసుకుంటూ మురిసిపోయారు. కానీ... 21 ఏళ్ల వయస్సులో శతాబ్దికి జరిగిన ప్రమాదం వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. మేడ మీది నుంచి జారిపడ్డ శతాబ్ది.. శాశ్వతంగా చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన పరిస్థితి. నా ప్రపంచం మొత్తం కుప్పకూలిపోయింది.. ‘‘ఆరోజు నా కేక విని అమ్మానాన్న పరిగెత్తుకుని వచ్చారు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సుమారు 5 గంటల తర్వాత నాకు స్పృహ వచ్చింది. నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. ఇక జీవితంలో నేను నడవలేనని డాక్టర్లు చెప్పారు. అప్పుడే నా ప్రపంచం మొత్తం కూలిపోయినట్లు అనిపించింది. పూర్తిగా విషాదంలో మునిగిపోయాను. ఇతరుల సాయం లేకుండా కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితి. సిగ్గు అనిపించేది. భయం వేసేది. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అలాంటి సమయంలో బంధువులు తమ మాటలతో మరింత చిత్రవధ చేసేవారు. ఫొటో: హ్యూమన్స్ ఆఫ్ బాంబే చచ్చిపోవడమే మేలు అనేవారు.. ‘‘ఇలాంటి కూతురి వల్ల ఏం ప్రయోజనం. ఇంత ఘోరమైన పరిస్థితి అనుభవించే కంటే చచ్చిపోవడమే మంచిది’’ అని అమ్మానాన్నలను మరింతగా బాధపెట్టేవారు. అయితే, నా కుటుంబం నాకు అండగా నిలిచింది. ‘‘నా కూతురు కచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తుంది. తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని నాన్న వాళ్లకు సమాధానమిచ్చేవారు. ఆరేళ్లపాటు ఆస్పత్రే నాకు ఇల్లు. నాకు వైద్యం చేయించడానికి నా కుటుంబం చాలా కష్టపడింది. అమ్మ తన పెన్షన్ డబ్బుతో బిల్లు కట్టేది. ఇవన్నీ చూస్తూ నా మీదే నాకే జాలివేసేది. అప్పుడే బలంగా నిర్ణయించుకున్నాను. ‘‘ఈ దుర్ఘటనకు నా జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఇవ్వకూడదు. నాకంటూ గుర్తింపు కావాలి’’ అని అనుకున్నాను. మొదటి ప్రయత్నంలోనే... అందుకు అనుగుణంగానే బ్యాంకు ఉద్యోగం సాధించేలా అహర్నిశలు కృషి చేశాను. మొదటి ప్రయత్నంలోనే ఎగ్లామ్ పాసై జాబ్ తెచ్చుకున్నాను. ‘‘మేనేజర్ తండ్రిని’’ అంటూ నాన్న నన్ను చూసి గర్వపడేవారు. అప్పుడు నా ఆనందం అంతా ఇంతాకాదు. ఎవరైతే నన్ను చచ్చిపో అన్నారో వారికి గట్టిగా సమాధానం ఇచ్చినట్లయింది. కానీ విధికి నా సంతోషం చూడబుద్ధికాలేదేమో! ఆరు నెలల్లోనే నాన్న చనిపోయారు. నా గుండె పగిలింది. నేను మేడ మీది నుంచి కిందపడిపోయినపుడు కూడా అంతటి బాధను అనుభవించలేదు.ఆ బాధాకరమైన ఘటన నుంచి బయటపడేందుకు సామాజిక కార్యక్రమాల్లో భాగమవడం అలవాటు చేసుకున్నాను. ఆర్మీ ఆఫీసర్ అయి దేశానికి సేవ చేయాలన్న చిన్ననాటి కల ఎలాగో నెరవేరలేదు కాబట్టి... సమాజ సేవ చేయాలని ఫిక్సయ్యాను. ఫొటో: హ్యూమన్స్ ఆఫ్ బాంబే 31 వయస్సులో మళ్లీ అయితే, పారాలింపిక్స్లో దీపా మాలిక్ను చూసిన తర్వాత నాకు కూడా క్రీడల్లో పాల్గొనాలనిపించింది. 31 ఏళ్ల వయస్సులో కోచ్ సహాయంతో షాట్పుట్, జావెలిన్ త్రో, డిస్కస్త్రో ప్రాక్టీసు చేశాను. బరువులు ఎత్తిన ప్రతీసారీ ప్రాణం పోయినట్టు అనిపించేది. క్రమేణా.. అలవాటైపోయింది. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మూడు విభాగాల్లోనూ స్వర్ణం సాధించాను. అమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. నాన్నే గనుక ఉండి ఉంటే ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. న్యూస్ పేపర్లలో నా గురించి కథనాలు చూసిన ప్రతిసారి నాన్నే గుర్తుకువస్తారు. ఇలాంటి కూతురి వల్ల ఏం ప్రయోజనం అన్న వారికి వీటిని సమాధానంగా చూపేవారు అనిపిస్తుంది. ప్రస్తుతం కామన్వెల్త్ క్రీడల కోసం సన్నద్ధమవుతున్నాను. కచ్చితంగా పసిడి సాధిస్తాను. ఆరేళ్ల పాటు నరకం అనుభవించిన నేను.. విధిరాత అని సరిపెట్టుకోకుండా ముందడుగు వేశాను కాబట్టే.. వీల్చైర్లో కూర్చునే నా కలలు నెరవేర్చుకున్నాను’’ అని తన జీవితంలోని విషాదాలు, వాటి నుంచి తేరుకుని ఎదిగిన విధానాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శతాబ్ది పంచుకున్నారు. -వెబ్డెస్క్ చదవండి: Shana Parmeshwar: అలాంటప్పుడు నాకు ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లు ఏముంటాయి? -
ఇది ఆరంభం మాత్రమే: దీపా మలిక్
టోక్యో పారాలింపిక్స్లో 19 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది. తొమ్మిది క్రీడాంశాల్లో కలిపి మొత్తం 54 మంది క్రీడాకారులతో టోక్యోకు బయలుదేరినపుడు ఈసారి మనం చరిత్ర సృష్టిస్తామని పూర్తి విశ్వాసంతో ఉన్నాను. 1968లో తొలిసారి పారాలింపిక్స్లో భారత్ అరంగేట్రం చేశాక 2016 రియో పారాలింపిక్స్ వరకు మనం మొత్తం 12 పతకాలు గెలిచాం. అయితే ఈసారి మనం ఏకంగా 19 పతకాలు నెగ్గడం... 162 దేశాలు పాల్గొన్న ఈ దివ్యాంగుల విశ్వ క్రీడల్లో 24వ స్థానంలో నిలువడం ఆనందం కలిగించింది. భారత క్రీడాకారులు పతకాలు గెలిచే క్రమంలో ప్రపంచ, పారాలింపిక్, ఆసియా రికార్డులు సృష్టించడం నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. మరికొందరు పతకాలను త్రుటిలో చేజార్చుకున్నా వారి ప్రదర్శనను ప్రశంసించాల్సిందే. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుండి నడిపించడంతో దేశం మొత్తం మమ్మల్ని అనుసరించి ఆదరించింది. పారాలింపిక్స్కు బయలుదేరేముందు ఆయన మాతో రెండు గంటలపాటు మాట్లాడి మాలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. దేశానికి చెందిన అత్యున్నత నాయకుడి నుంచి ఈ తరహా మద్దతు లభిస్తే ఏ క్రీడాకారుడి కెరీర్ అయినా సాఫీగా సాగిపోతుంది. ఈసారి పారాలింపిక్స్లో భారత్ పతకాల పంట పండించడం ఎలా సాధ్యమైందని చాలాసార్లు నన్ను అడిగారు. కేంద్ర ప్రభుత్వం, భారత పారాలింపిక్ కమిటీ, ప్రభుత్వేతర సంస్థలు పారా స్పోర్ట్స్కు మద్దతు నిలవడంవల్లే ఈసారి మేము అత్యధిక పతకాలు గెలవగలిగాం. 2016 రియో పారాలింపిక్స్లో నాలుగు పతకాలు గెలిచిన తర్వాత పారా స్పోర్ట్స్ను ప్రత్యేక దృష్టి కోణంలో చూడటం మొదలైంది. వైకల్యం ఉన్నా ఆటల ద్వారా అత్యున్నత వేదికపై సత్తా చాటుకునే అవకాశం ఉందని, తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవచ్చని దివ్యాంగులు ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవైపు కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినా క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఈ ప్రదర్శనతో భారత్లో పారాలింపిక్స్కు సంబంధించి కొత్త శకం మొదలైంది. టోక్యో కేవలం ఆరంభం మాత్రమే! చదవండి: Tokyo Paralympics 2021: కలెక్టర్ సాబ్ కథ ఇదీ.. Viral Video: ఊహించని ట్విస్ట్.. గ్రౌండ్లోకి పోలీసుల రంగప్రవేశం, భయంతో ప్లేయర్స్.. -
అవనికే తొలి ప్రత్యేక ఎస్యూవీ: ఆనంద్ మహీంద్ర ఆఫర్
సాక్షి,ముంబై: టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్ అవని లేఖరాకు పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. భారత పారా ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ దీపా మాలిక్ అభ్యర్థన మేరకు ప్రత్యేక ఎస్యూవీల తయారీకి మొగ్గు చూపిన ఆయన తాజాగా అవనికి బంపర్ ఆఫర్ ప్రకటించారు ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నవారికి తయారు చేయనున్న తమ తొలి ఎస్యూవీని ఆమెకే ఇస్తానని ప్రకటించారు. షూటింగ్లో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన అవనిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చదవండి : Avani Lekhara: గోల్డెన్ గర్ల్ విజయంపై సర్వత్రా హర్షం పారా ఒలింపిక్స్ అవని సాధించిన ఘనతపై దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కురుస్తోంది. మరోవైపు తనకు బంగారు పతకం లభించడంపై అవని సంతోషాన్ని ప్రకటించారు. ఈ అనుభూతిని వర్ణించ లేనిదని ప్రపంచం శిఖరానికి ఎదిగిన భావన కలుగుతోందని పేర్కొన్నారు. కాగా తన లాంటి ప్రత్యేక సామర్థ్యం ఉన్న వారికోసం భారతదేశంలో ప్రత్యేక ఎస్యూవీలను తయారు చేయమని భారత ఆటోమొబైల్ పరిశ్రమను దీపా మాలిక్ అభ్యర్ణించారు. తనకు ఎస్యూవీ నడపడం అంటే చాలా ఇష్టమనీ, ఇలాంటి కార్లలో ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేయాలని మహీంద్రా, టాటా మోటార్స్, ఎంజీ ఇండియా లాంటి భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలను కోరారు. ఎవరైనా ప్రత్యేక సీట్లతో కూడిన ఎస్యూవీని మార్కెట్లోకి తీసుకువస్తే, తప్పనిసరిగా కొనుగోలు చేస్తానని ఆమె ప్రకటించారు.ఈ మేరకు ఆమె ఒక వీడియోను షేర్ చేశారు. దీపా మాలిక్ ట్వీట్పై ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఈ సవాలును స్వీకరించి వారికోసం ఎస్యూవీలను తయారీపై దృష్టి పెట్టాలని తన ఉద్యోగి వేలును కోరిన సంగతి తెలిసిందే. A week ago @DeepaAthlete suggested that we develop SUV’s for those with disabilities. Like the one she uses in Tokyo.I requested my colleague Velu, who heads Development to rise to that challenge. Well, Velu, I’d like to dedicate & gift the first one you make to #AvaniLekhara https://t.co/J6arVWxgSA — anand mahindra (@anandmahindra) August 30, 2021 Impressed with this technology.Sincerely hope Automobile world in India can give us this dignity and comfort.. I love to drive big SUVs but getting in and out is a challenge, Give me this seat n I buy your SUV @anandmahindra @TataCompanies @RNTata2000 @MGMotorIn #Tokyo2020 pic.twitter.com/0yFGwvl46V — Deepa Malik (@DeepaAthlete) August 20, 2021 -
వీల్ చెయిర్..విల్ చెయిర్
పట్టుదలతో ఏదైనా మార్చుకోవచ్చు అని తన జీవితాన్ని ఉదాహరణగా చూపుతుంది దీపా మాలిక్. దేశంలో పారా ఒలింపిక్ పతకం సాధించిన మొట్టమొదటి మహిళ గా ఘనత సాధించింది. హర్యానాలో పుట్టి పెరిగిన దీప వెన్నెముకలో ఏర్పడిన కణితి కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. అనేక సవాళ్లను ఎదుర్కొని పతకాలు, పురస్కారాలు అందుకుంది. తన సమస్యలతో ఇప్పటికీ పోరాడుతూనే ఆ శక్తిని కుటుంబానికీ ఇస్తూ తనలాంటి వారిలో స్ఫూర్తిని నింపుతోంది. పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డు, ఆసియా పారా గేమ్స్లో 4 పతకాలు, యమునా నది మీదుగా ఈత కొట్టడం ఇవన్నీ సాధించడానికి ఒక జీవితం సరిపోదేమో అనిపిస్తుంది. కానీ, వాటన్నింటినీ సాధించి, ఓడిస్తున్న జీవితం తో పోరాడి గెలిచి చూపించింది. శక్తి పుంజం దీపా మాలిక్ తన చక్రాల కుర్చీలో కూర్చోగానే ఆ కుర్చీకే శక్తి వస్తుందేమో అనిపిస్తుంది. విధికి లొంగని శక్తి పుంజం అక్కడా ప్రకాశిస్తున్నట్టుగా ఉంటుంది. ‘భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఎప్పుడూ ఫుల్గా ఛార్జ్ చేసి ఉంచండి. పరుగు, ఆట, గెంతడం.. వంటి వాటితో మీలో శక్తిని నింపండి’ అని మహిళలకు చెబుతుంది. దీపా బాల్యమంతా జైపూర్ లో గడిచింది. పెళ్లై ఇద్దరు కూతుళ్లకు తల్లి ఆమె. వారిద్దరూ చదువుకుంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేదు దీపా తన కుటుంబానికి వెన్నెముక. జూన్ 3, 1999న వెన్నెముక లో కణితి ఉన్నట్టు వైద్య పరీక్షలో తేలింది. నడుస్తున్న జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. కణితి ఆపరేషన్ తర్వాత, పక్షవాతం బారిన పడింది. కొన్నాళ్లు మంచానికే పరిమితమైన దీప తనకు తాను శక్తిని కూడగట్టుకుంది. రెండు యుద్ధాలను జయించిన వేళ కార్గిల్ యుద్ధ మేఘాలు శివార్లలో ఉరుముతున్న కాలం. ఈ యుద్ధంలో దీప భర్త విక్రమ్ కూడా దేశం కోసం పోరాడుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు యుద్ధం చేస్తున్నప్పుడు ఇది చాలా కష్టమైన సమయం, ఒకటి దేశ శివార్లలో, మరొకటి శరీర శివార్లలో. ఈ సమయం దీప కుటుంబానికి చాలా సవాల్గా మారింది. కానీ చివరికి దీప కుటుంబం రెండు యుద్ధాలను గెలిచింది. ఒక వైపు భారత్ కార్గిల్ యుద్ధంలో విజయం సాధించింది. దీపకు మూడు వెన్నెముక కణితి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. కానీ, పక్షవాతం రావడంతో మంచానికే పరిమితం అయ్యింది. దీంతో కొన్నిసార్లు దీప విచారంగా ఉండేది. ‘ఆ సమయంలో మా నాన్న ‘చీకటిని శపించడంలో అర్థం లేదు, నువ్వే దీపం కావాలి. అందుకే నీకా పేరు పెట్టాను’ అని చెప్పడంతో ఓ కొత్త శక్తి ఆవరించినట్టు అనిపించింది. అప్పటి నుంచి నాకు నేనుగా నిలదొక్కుకోవడానికి ఎంత ప్రయత్నం చేశానో మాటల్లో చెప్పలేను’ అని వివరించిన దీపా మాలిక్ చేతల్లో తన విజయాన్ని ప్రపంచానికి చాటింది. ఇప్పటికీ చాటుతూనే ఉంది. -
పారాలింపియన్ దీపా మలిక్ వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత పారాథ్లెట్, రియో పారాలింపిక్స్ షాట్పుట్ (ఎఫ్53) ఈవెంట్ రజత పతక విజేత దీపా మలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. అయితే తాను గతేడాది సెప్టెంబర్ 16వ తేదీనే ఆట నుంచి తప్పుకున్నానని, ఈ మేరకు భారత పారాలింపిక్ కమిటీకి లేఖ కూడా అందజేశానని తెలిపింది. నిబంధనల ప్రకారం ఆటకు వీడ్కోలు పలికాకే ఫిబ్రవరిలో జరిగిన భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొని విజేతగా నిలిచి ఆ పదవిని స్వీకరించినట్లు 49 ఏళ్ల దీపా స్పష్టం చేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement