-
కర్రలతో కొట్టి.. గాయాలపై కారం చల్లి
కొత్తగూడ: చోరీకి పాల్పడ్డాడనే అనుమానంతో ఓ దళిత యువకుడిని కర్రలతో చావకొట్టి.. రక్తం కారుతున్న గాయాలపై కారం చల్లి చిత్ర హింసలు పెట్టిన అమానవీయఘటనకు సంబంధించిన వీడియో శనివారం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగవానిగూడెం(రాంపూర్) గ్రామానికి చెందిన యువకుడు వంకాయల కార్తీక్ను అదే మండలం పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన టెంట్హౌస్ యజమాని గద్ద అశోక్ పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో డీజే(సౌండ్ బాక్స్)లో ఉపయోగించే యాంప్లిఫైయర్ చోరీకి గురైందని, దాన్ని ఖానాపూర్లో విక్రయించారని యజమాని అశోక్ గుర్తించాడు. దీంతో అశోక్ కొందరు వ్యక్తులను తీసుకుని ఈ నెల 19వ తేదీన జంగవానిగూడెం వెళ్లి కార్తీక్తో పని ఉందని చెప్పి కారులో ఎక్కించుకుని పొగుళ్లపల్లి సమీప అటవీప్రాంతానికి తీసుకెళ్లి కర్రలతో చితకబాదారు. తప్పించుకుని పారిపోయే క్రమంలో మళ్లీ పట్టుకుని పొగుళ్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. ఒంటిపై షర్ట్ విప్పి కార్యాలయ కిటికీకి కట్టి కర్రలతో బాదారు. రక్తం కారుతుండగా గాయాలపై కారం చల్లుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. స్పృహ కోల్పోయిన కార్తీక్ను ఇంటి వద్ద వదిలేశారు. గాయాలతో మూలుగుతున్న యువకుడిని బంధువులు నర్సంపేట పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కార్తీక్పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు టెంట్హౌస్ యజమాని ఫిర్యాదు మేరకు కార్తీక్పై చోరీ కేసు, కార్తీక్పై దాడి చేసిన ఘటనలో అశోక్తోపాటు మరికొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సమాచారం తెలుసుకున్న దళిత సంఘాలు మహబూబాబాద్ డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి దాడి ఘటన వివరాలు బయటికి వచ్చాయి. -
దళిత యువకుల అరెస్టులో.. పోలీసుల తీరుపై జగ్గిరెడ్డి ఆగ్రహం
కొత్తపేట/రావులపాలెం: కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం వివాదంలో అమాయకులైన దళిత యువకుల అరెస్టులో పోలీసుల తీరుపై స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గోపాలపురం వద్ద ఒక ఫాస్ట్పుడ్ సెంటర్లో ఈనెల 5న డిస్పోజబుల్ ప్లేట్లపై అంబేడ్కర్ చిత్రం ఉండటంపై తలెత్తిన వివాదం కేసులో ఒక వర్గానికి చెందిన ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా, మరో వర్గానికి చెందిన 18 మంది దళిత యువకులపై కేసులు నమోదుచేసి రిమాండ్కు పంపిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా వైఎస్సార్సీపీ ప్లీనరీలో నిమగ్నమైన ప్రభుత్వ విప్ ఆదివారం రావులపాలెం చేరుకున్నారు. దళిత యువకుల అరెస్టుపై ఆరా తీశారు. ఈ విషయంలో పోలీసులు అత్యుత్సాహంతో అమాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ దళిత నాయకులు, పార్టీ కార్యకర్తలతో రావులపాలెం సెంటర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. తానులేని సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ వివాదాన్ని రాజకీయం చేస్తూ వైఎస్సార్సీపీకి, తనకు ఆపాదించేందుకు ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు. తమ కుటుంబం ఆది నుంచీ దళిత పక్షపాతిగా సాగుతోందన్నారు. తానులేని సమయంలో జరిగిన ఘటనను కుట్రపూరితంగా గోరంతను కొండంత చేసి రాజకీయంగా బురదజల్లేందుకు ప్రయత్నించడం తగదని జగ్గిరెడ్డి ఖండించారు. అరెస్టయిన 18 మంది దళిత యువకుల్లో తమ గ్రామానికి చెందిన వారు 10 మంది ఉన్నారని.. అలాగే, పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది ఉన్నారన్నారు. కేసు విషయంలో పోలీసులు అత్యుత్సాహంగా చూపి కేసులు నమోదు చేయడాన్ని నిరసించారు. దళిత యువకుల అరెస్టులో తన ప్రమేయం ఉన్నట్లు ప్రతిపక్షాలు రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు. అనంతరం.. రావులపాలెం పోలీస్స్టేషన్ వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తంచేసి ఎస్సై చాంబర్ వద్ద బైఠాయించారు. అమలాపురం డీఎస్పీ వై. మాధవరెడ్డి, సీఐ వెంకటనారాయణ స్టేషన్కు చేరుకుని జగ్గిరెడ్డితో చర్చలు జరిపారు. దళిత యువకులకు న్యాయం చేస్తా : విక్టర్ప్రసాద్ ఇక ఈ ఘటనలో అరెస్టయిన దళిత యువకులకు న్యాయం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం. విక్టర్ప్రసాద్ హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం నుంచి గోపాలపురం చేరుకున్న ఆయన బాధితులతో సమావేశమై వివాదంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ కేసుల్లో అరెస్టయిన దళిత యువకులను వారం రోజుల్లో బయటకు తీసుకువచ్చేందుకు ఎస్సీ కమిషన్ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఈయన వెంట రామచంద్రపురం ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం, అమలాపురం డీఎస్పీ వై. మాధవరెడ్డి, సీఐ వెంకటనారాయణ తదితరులు రాగా వారిని స్థానిక దళితులు వ్యతిరేకిస్తూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో విక్టర్ ప్రసాద్ ఒక్కరే దళితులతో సంప్రదింపులు జరిపారు. -
రాయపూడిలో టీడీపీ నాయకుడి రౌడీయిజం
తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, అమరావతి మైనార్టీ జేఏసీ నేత షేక్ జానీ తన గ్యాంగ్తో హల్చల్ చేశాడు. పెదపరిమికి చెందిన దళిత యువకుడిని నిర్బంధించి కారులో తీసుకెళ్లి చితకబాదడంతో పాటు, కాళ్లు పట్టి క్షమాపణ కోరాలని బెదిరించిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. పెదపరిమికి చెందిన పాటిబండ్ల శ్రీకాంత్ అనే యువకుడు తుళ్లూరుకు చెందిన తన స్నేహితులైన మరో ఇద్దరితో కలిసి మోతడక నుంచి బైక్పై వస్తుండగా, వాహనంపై ఉన్న ఓ యువకుడికి జానీ గ్యాంగ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న సమయంలో మిగిలిన ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్న సంభాషణను అపార్థం చేసుకున్న జానీ గ్యాంగ్ సభ్యులు.. తమ బాస్ను దుర్భాషలాడారంటూ వాదనకు దిగారు. అంతటితో ఆగకుండా జానీకి చెందిన కారులో పెదపరిమి గ్రామానికి వచ్చి దళిత యువకుడు పాటిబండ్ల శ్రీకాంత్పై దాడిచేసి కారులో నిర్బంధించి అమానవీయంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకొని కారు సీజ్ చేశారు. -
దళిత యువకులపై టీడీపీ నేతల దాష్టీకం
అనకాపల్లి టౌన్: విశాఖ జిల్లాలో దళిత యువకులపై టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. స్తంభాలకు కట్టేసి నోటి వెంట రక్తం పడేలా కొట్టారు. అనకాపల్లి మండలంలోని జీవీఎంసీ విలీన గ్రామం కేఎన్ఆర్ పేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ నెల 10వ తేదీ రాత్రి మారేడుపూడి ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు రాకేష్, లోకనాథ్లు బైక్పై వేగంగా వెళుతున్నారు. అదే సమయంలో టీడీపీకి చెందిన ఆ ప్రాంత మాజీ సర్పంచ్ కె.సత్యనారాయణ యువకులపై ఆగ్రహించారు. యువకులు ఎదురు తిరగడంతో ఆగ్రహించిన సర్పంచ్ అనుచరులు సమీపంలోని రెండు స్తంభాలకు వారిని కట్టేసి నోటి నుంచి రక్తం పడేలా తీవ్రంగా కొట్టారు. వారి తల్లి రాజ్యలక్ష్మి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. డీఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కశిరెడ్డి సత్యనారాయణ, కరిత్తుల లక్ష్మణకుమార్, కశిరెడ్డి అప్పారావు, కశిరెడ్డి విరోదికుమార్, బెల్లాన మధు, కశిరెడ్డి ముఖేష్, గొంతిన లక్ష్మిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
వైరల్ వీడియో: చెట్టుకు కట్టేసి, కర్రలతో మర్మాంగాలపై దాడి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement