-
కరోనా కట్టడిలో ‘డి’ విటమిన్ పాత్ర
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో ‘డీ’ విటమిన్ నిర్వహించే పాత్రపై తగిన పరిశోధనలు సాగించాల్సిందిగా బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాన్కాక్ ఇచ్చిన ఆదేశాల మేరకు క్వీన్ మేరీ యూనివర్శిటీ పరిశోధకులు తాజా పరిశోధనలు సాగించారు. ప్రాథమికంగా జరిపిన పరిశోధనల్లో మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కండరాలు, ఎముకలు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడుతుందని తేలింది. శరీరంలోని కాల్షియం, ఫాస్ఫేట్ను క్రమబద్దీకరించడంలో డీ విటమిన్ పాత్ర ఆమోగమని పరిశోధకులు తెలిపారు. డీ విటమిన్ తక్కువగా ఉండి, చర్మం తీవ్రంగా దెబ్బతిన్న 86 మంది శిశువులకు మూడు నెలల పాటు డీ విటమిన్ ఇవ్వగా వారి చర్మం పూర్తిగా మెరగుపడిందని వారు చెప్పారు. బ్రిటన్లో సగానికి సగం జనాభా డీ విటమిన్ కొరతతో బాధ పడుతున్నారు. సహజసిద్ధంగా సూర్య రశ్మితో మానవ శరీరంలో డీ విటమిన్ అభివృద్ధి చెందుతుంది. అయితే చలికాలంలో ఆ దేశంలో సూర్య రశ్మియే తగులక పోవడంతో వారిలో డీ విటమిన్ కొరత ఏర్పడుతోంది. అలాంటి వారు రోజుకు డీ 3 విటమన్ను 10 ఎంసీజీ ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. ప్రతి మనిషికి రోజుకు 23 ఎంసీజీల డీ విటమిన్ అవసరం అవుతుందని, మనం తినే ఆహారం ద్వారా కొంత డీ విటమిన్ లభిస్తుంది కనుక రోజుకు 10ఎంసీజీ డీ 3 విటమిన్ ట్యాబ్లెట్లు సరిపోతాయని వారు చెబుతున్నారు. ద్రవరూపంలో కూడా డీ 3 విటమిన్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఎక్కువగా శిశువులకు ఉపయోగిస్తున్నారని వారు తెలిపారు. పాల ఉత్పత్తులతోపాటు మాంసం, చేపలు, కోడి గుడ్లు, చిరు ధాన్యాల్లో డీ విటమిన్ ఎక్కువగా ఉంటోంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా కరోనా కట్టడికి ఉపయోగపడుతున్న డీ విటమిన్ పాత్రపై మరిన్ని ప్రయోగాలను సాగించడం కోసం 5 వేల మంది వాలంటీర్లను ఎంపిక చేసినట్లు యూనివర్శిటీ పరిశోధకలు తెలిపారు. -
డీ విటమిన్ ఉంటే ఢోకాలేదు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకిన వారిలో డీ విటమిన్ ఎక్కువ ఉన్న వారు బతికి బయట పడతారని ఇంగ్లండ్లోని నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. అదే డీ విటమిన్ తక్కువ ఉన్న వారు తీవ్ర అనారోగ్య సమస్యలపాలై చివరకు మరణించే ప్రమాదం కూడా ఉందని వారు తేల్చారు. పెద్దవారిలో ప్రతి రోజు పది మైక్రోగ్రాముల డీ విటమిన్ ఉండాలని ఎన్హెచ్ఎస్ ఆరోగ్య మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. (కేర్ సెంటర్లలోనే కరోనా కేసులెక్కువ!) చేపలు, ఇతర మాంసాహారం, పుట్ట గొడుగులు తినడం ద్వారా, వంటికి ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యరశ్మి తగలడం వల్ల మానవ శరీరంలో డీ విటమిన్ తయారవుతుందన్న విషయం తెల్సిందే. ప్రజల్లో డీ విటమిన్ తక్కువగా ఉన్న దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆమ్స్టర్డామ్లోని వ్రిజి యూనివర్శిటీ జరిపిన మరో పరిశోధనలో తేలింది. చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, అమెరికా, బ్రిటన్, ఇరాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్విడ్జర్లాండ్ దేశాల్లో నమోదైన కరోనా కేసులను ఈ యూనివర్శిటీ పరిశోధన బందం విశ్లేషించింది. విటమిన్ డీ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో 50 శాతం మందికి ఛాతీపరమైన ఇన్ఫెక్షన్లు తగ్గాయని ‘యూనివర్శిటీ ఆఫ్ గ్రెనడా’ జరిపిన పరిశోధనలో తేలింది. (కరోనా వైరస్: మరో నమ్మలేని నిజం) -
డీ విటమిన్తో కరోనాకు ఢీ
కాన్బెర్రా : ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడినప్పటికీ ప్రాణాలతో బయట పడాలంటే ప్రతి రోజు పది నిమిషాలపాటు ఎండలోకి వెళ్లడం ఒక్కటే అత్యుత్తమమైన పరిష్కార మార్గమని ఆస్ట్రేలియాకు చెందిన స్కిన్ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ రాచెల్ నీల్ తెలియజేశారు. తాను పరిశీలించినంత వరకు విటిమిన్ డీ తక్కువగా ఉన్నవారిలోనే ఎక్కువగా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆమె చెప్పారు. డీ విటమిన్ ఎక్కువగా ఉన్నట్లయితే వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. రోగ నిరోధక శక్తి ద్వారానే కరోనా వైరస్ను ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు. డీ విటమిన్ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో శ్వాసకోశ ఇబ్బందులు తగ్గిపోవడం తాను గతేడాదే కనుగొన్నానని డాక్టర్ రాచెల్ తెలిపారు. డీ విటమిన్ ఎక్కువగా ఉన్న వారిలో కూడా శ్వాసకోశపరమైన ఇబ్బందులు ఉంటాయని ఆమె తెలిపారు. అయితే డి విటమిన్ తక్కువగా ఉన్న 78 వేల మంది రోగులను అధ్యయనం చేశానని, వారిలో డీ విటమిన్ ఎక్కువగా ఉన్న వారిలో ఉండే శ్వాసకోశ ఇబ్బందులకన్నా డీ విటమిన్ తక్కువగా ఉన్నవారిలో రెట్టింపు ఇబ్బందులు కనిపించాయని ఆమె చెప్పారు. వాతావరణ పరిస్థితులనుబట్టి అంటే, ఎండ తీవ్రతను బట్టి ప్రతి రోజు ఐదు నుంచి 15 నిమిషాలపాటు ఎండలోకి వెళ్లడం మంచిదని ఆమె సూచించారు. (కరోనా టెస్ట్ కిట్ల ‘కొనుగోల్మాల్’!) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గుడ్డు తింటున్నారు సరే.. పెంకు పారేస్తారేం!
సాధారణంగా గుడ్ల పెంకులను బయట పారవేస్తుంటాం కదా. అయితే ఆ పెంకుల వల్ల ఉన్న ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా మనం ఇక నుంచి పారవేయడం ఆపేస్తామని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గుడ్డు పెంకును మనం స్వీకరిస్తే శరీరానికి కావలసిన క్యాల్షియం లభిస్తుందంటా. దీనిద్వారా ఎముకలు, దంతాలు మరింత గట్టిపడుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే నేరుగా కాకుండా.. గుడ్డు పెంకులను పొడిగా చేసుకుని తినాలని తెలిపారు. అలా ప్రతిరోజు సగం టేబుల్ స్పూన్ తీసుకుంటే ఆ రోజుకు మనకు కావల్సిన క్యాల్షియంలో 90 శాతం అందుతుందని, 1,000 నుంచి 1,500 మిల్లీగ్రాముల క్యాల్షియం ఎముకలు, దంతాలకు అందుతుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతో మంది సూర్యకాంతిని పొందలేకపోతున్నారు. అలాంటి వారికి డి విటమిన్ లోపం ఏర్పడుతుంది. డి విటమిన్ లోపం తలెత్తితే ఎముకలు, దంతాలకు సరిపడ క్యాల్షియం అందదు. తద్వారా మనం త్వరగా అలసిపోవడం, పనిలో చికాకు రావడం జరుగుతుంటుంది. అందుకే గుడ్డు పెంకు పొడిని నీళ్లు లేదా పాలలో కలుపుకుని తాగితే క్యాల్షియం సమస్య సులువుగా పరిష్కారమవుతుంది. -
డీ విటమిన్తో మరెన్నో ఉపయోగాలు
న్యూయార్క్: మానవ శరీరంలోని ఎముకలు, కండరాలు గట్టిగా, దృఢంగా ఉండాలంటే శరీరంలో చాలినంత డీ విటమిన్ ఉండడం తప్పనిసరి. శరీరంలోని కాల్షియం, ఫాస్పేట్, న్యూట్రియంట్ల పాళ్లను క్రమబద్ధీకరించడంలో డీ విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది. సూర్యరశ్మి నుంచి ఉచితంగా లభించే ఈ డీ విటమిన్ వల్ల ఇంతకుముందు అంచనా వేసిన వాటికన్నా మరెన్నో ఉపయోగాలున్నాయని ప్రపచంవ్యాప్తంగా నిర్వహించిన పలు తాజా పరిశోధనల్లో తేలింది. డీ విటమిన్ లోపం వల్ల పిల్లల్లో డయాబెటీస్ ఒకటవ రకం వస్తుంది. డీ విటమిన్ ఎక్కువ వున్న వారికంటే డీ విటమిన్ తక్కువ ఉన్న యువకులలో పెద్దవాళ్లలో గుండె జబ్బులు, కార్డియో వాస్కులర్ డిసీజ్లు వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువ. డీ విజమిన్ లోపం క్యాన్సర్కు కారణం అవుతుందని తేలింది. డీ విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకోవడం వల్ల క్యాన్సర్ను తగ్గించవచ్చా అన్న అంశంలో మాత్రం ఇంకా ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంది. డీ విటమిన్ ట్యాబ్లెట్లను వాడడం వల్ల గుండె జబ్బులు తగ్గాయన్న అంశం ఇప్పటికే రుజువైంది. డీ విటమిన్ల వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో బ్యాక్టరీ ఇన్ఫెక్షన్లను కూడా సమర్థంగా ఎదుర్కొనవచ్చు. శిశుప్రాయంలో డీ విటమిన్ సప్లిమెంట్లను తరచుగా ఇవ్వడం వల్ల 90 శాతం మంది పిల్లల్లో డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గిందని ఫిన్లాండ్లో 30 ఏళ్లపాటు నిర్వహించిన సర్వేలో తేలింది. డీ విటమిన్ కండరాల నొప్పులు రాకుండా నిరోధిస్తుంది. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో రోజుకు ఒక మనిషి 15 గ్రాముల డీ విటమిన్ తీసుకోవాలి. నేడు డీ విటమిన్ లోపమన్నది ప్రపంచ సమస్య. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మంది ప్రజలు డీ విటమిన్ లోపం వల్ల బాధ పడుతున్నారు. సూర్య కిరణాలు ఎక్కువలేని ప్రాంతాలే కాదు, సంవత్సరం పొడవున సూర్య కిరణాలు ప్రసరించే దేశాల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది. నల్ల వాళ్లుండే ఆఫ్రికా దేశాల్లో మరి ఎక్కువగా ఉంది. మాంసం, గుడ్లు, చేపల్లో లభించే డీ విటమిన్, శాకాహారమైన ఒక్క పాలల్లో మాత్రమే లభిస్తుంది. అందుకని ఎక్కువ మంది డీ విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం ఎండల్లో డీ విటమిన్ ఉచితంగా లభిస్తుందిగానీ కొన్ని దేశాల సంప్రదాయ దుస్తులు సూర్య కిరణాలు చర్మాణికి సోకకుండా అడ్డు పడతాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement