-
ఒడిశా ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదానికి సంబంధించి.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముగ్గురు రైల్వే ఉద్యోగుల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ రాత్రిపూట జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 290 మంది దాకా మృతి చెందిన సంగతి తెలిసిందే. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. పలువురిని విచారించింది. ఘటనకు కారకులు అవ్వడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు అనే అభియోగాల మీదే వీళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ మగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వాళ్లు అరుణ్ కుమార్ మహంత, ఎండీ అమీర్ ఖాన్ , పప్పు కుమార్గా తెలుస్తోంది. వీళ్లపై హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య కింద, అలాగే.. సాక్ష్యాలను నాశనం చేసిన అభియోగాలు మోపింది సీబీఐ. ఈ ముగ్గురి చర్యలు.. ప్రమాదానికి దారితీశాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. తాము చేసిన పని పెనుప్రమాదానికి.. విషాదానికి దారి తీస్తుందనే అవగాహన వాళ్లకు ఉందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. ఇదీ చదవండి: ఒడిశా దుర్ఘటన.. అమీర్ ఖాన్ ఇంటికి సీల్ -
ఒడిశా కోరమాండల్ ప్రమాద వీడియో వైరల్!
Balasore Train Accident Video Viral: ఒడిశా బాలేశ్వర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాద వీడియో ఇదేనంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా ఒడిశా ఛానెల్స్ కూడా ఈ వీడియోను అధికారికమేనంటూ తెరపైకి తెచ్చాయి. ప్రమాదానికి ముందు క్షణాలంటూ ఆ వీడియో ఆధారంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. మీరు ఒకవేళ సున్నిత మనస్కులు అయితే గనుక దయచేసి ఈ వీడియో చూడకండి. ఒడిశాలో జూన్ 2వ తేదీ సాయంత్రం కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదానికి ముందు వీడియో అంటూ ఒకటి వైరల్ అవుతోంది. అందులో కోరమాండల్ ఎక్స్ప్రెస్గా చెప్తున్న రైలులో.. రైల్వే సిబ్బంది కోచ్ ఫ్లోర్ ను శుభ్రం చేస్తున్నాడు. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ప్రయాణికులు ప్రశాంతంగా కొందరు పడుకోగా.. మరికొందరు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరో తన మొబైల్లో అదంతా రికార్డు చేస్తున్నారు. అంతలో.. ఒక్కసారిగా కల్లోల పరిస్థితి.. హాహాకారాలతో వీడియో ఆగిపోయింది. ఈ వీడియోనే కోరమాండల్ప్రమాద వీడియో అంటూ విస్తృతంగా షేర్ అవుతోంది. కానీ ఇది ఒడిశా రైలు ప్రమాదానికి చెందినదా ? కాదా ? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రైల్వేశాఖ, ఒడిశా అధికార యంత్రాంగం సైతం దీనిపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఒడిశా ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరింది. ఈ మృతదేహాల్లో ఇంకా 82 మందిని గుర్తించాల్సి ఉంది. బాడీలు పాడైపోయే అవకాశం ఉండడంతో వీలైనంత త్వరగా వాటిని బంధువులకు అప్పగించే ప్రయత్నంలో అధికారులు తలమునకలయ్యారు. డీఎన్ఏ టెస్టులు సహా చివరి ఆప్షన్గా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ని ఉపయోగించాలని నిర్ణయించారు. -
బహనాగా బజార్ దుర్ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ
భువనేశ్వర్: రాష్ట్రంలో సంభవించిన ట్రిపుల్ రైలు ప్రమాదం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) మంగళవారం వెల్లడించింది. ఈనెల 2న బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్లో కోరమాండల్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్–హౌరా ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలుకు మధ్య జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడేందుకు సీబీఐకి చెందిన 10మంది సభ్యుల బృందం సోమవారం రాత్రి ఒడిశాకు చేరుకుంది. ఈ మేరకు ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. రైల్వేశాఖ అభ్యర్థన మేరకు, ఒడిశా ప్రభుత్వ సమ్మతితో కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు వర్గం సభ్యులు తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించి బాలాసోర్ ప్రభుత్వ రైల్వే పోలీసు(జీఆర్పీఎస్)లో నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేపట్టిందన్నారు. సీఆర్ఎస్ విచారణ.. రైలు దుర్ఘటనలో ప్రాణహాని సంభవించే పరిస్థితుల్లో రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్ఎస్) దర్యాప్తు చేపట్టడం నిబంధన. ఈ నేపథ్యంలో ఇటీవల బహనాఘా బజార్ రైల్వే స్టేషన్లో జరిగిన ట్రిపుల్ రైలు దుర్ఘటనలో మృతులు సంభవించిన ఘటనపై సీఆర్ఎస్ విచారణ కోసం రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో ప్రత్యక్షంగా సందర్శించిన అనుబంధ అధికార, సిబ్బంది వర్గాలతో ముఖాముఖి సంప్రదించింది. ఆదివారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన రైల్వే భద్రతా కమిషనర్ శైలేష్కుమార్ పాఠక్.. కొంతమంది వ్యక్తుల వాంగ్మూలం నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఇదో ఉద్దేశపూర్వక ట్యాంపరింగ్ సంఘటనగా ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేష్రాయ్ మీడియాతో అన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్లో మార్పు కారణంగా రైలుప్రమాదం సంభవించిందని.. అయితే ప్రమాదానికి గురైన రైళ్లలో ఒకటైన చైన్నెకి వెళ్లే కోరమండల్ ఎక్స్ప్రెస్ లోకోపైలట్(ఎల్పీ), అసిస్టెంట్ లోకోపైలట్ వివరణ ప్రకారం గ్రీన్సిగ్నల్ వచ్చినట్లు వెల్లడైందన్నారు. ఈ ఘటనకు వీరివురు ప్రత్యక్ష సాక్షులు. ఈ పరిస్థితుల దృష్ట్యా సిగ్నలింగ్ వ్యవస్థలో ‘ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్‘ ఉండవచ్చని డీఆర్ఎం సందేహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు రైల్వేబోర్డు ఆదివారం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు, పరిసరాలు, నిర్వహణ ఇతరేతర అనుబంధ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని రైల్వేబోర్డు తదుపరి విచారణ, దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు సిఫార్సు చేసినట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం స్పష్టం చేశారు. ఈ ఘటనలో 21 కోచ్లు ఢీకొని పట్టాలు తప్పడంతో 288 మృతులు నమోదయ్యాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. సమ్మతించిన రాష్ట్రప్రభుత్వం రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు ఒడిశా ప్రభుత్వం సమ్మతి తెలిపింది. సీబీఐ విచారణకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి సంతకం చేసిన సమ్మతి లేఖ జారీ చేశారు. ఈనెల 2న బహనాగా బజార్లో కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి దారితీసిన కారణాలపై సీబీఐ విచారణకు ఒడిశా ప్రభుత్వం తర ఫున అదనపు చీఫ్ సెసీ(హోమ్) డీకే సింగ్ సమ్మతి తెలిపారు. ఈ ప్రమాదం యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లోని 2 కోచ్లను కూడా ప్రభావితం చేసింది. గుర్తించాల్సినవి.. 83 బహనాగా బజార్ స్టేషన్ కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్యలో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. మృతుల జాబితా విస్తృత ధ్రువీకరణ, అనుబంధ వర్గాల సమాచారం, ఘటనా స్థలం ఇతరేతర రంగాల్లో 2రౌండ్ల కూబింగ్ నిర్వహించిన అనంతరం 288మరణాలను నిర్థారించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్కుమార్ జెనా మంగళవారం సాయంత్రం వెల్లడించారు. 205 మృతదేహాలను గుర్తించి బంధు వర్గాలకు అప్పగించగా, మరో 83 ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. భువనేశ్వర్లో 110, బాలాసోర్లో 94, భద్రక్లో 1 గుర్తించిన వాటిలో ఉన్నాయి. పలు ప్రాంతాలకు మృత దేహాలను ప్రభుత్వ ఖర్చులతో తరలించారు. అయితే గుర్తించని మృతదేహాల్లో పలు సందర్భాల్లో వివాదం తలెత్తుతోంది. ఒక్కో మృతదేహం కోసం ఒకరి కంటే ఎక్కువ మంది ముందుకు రావడంతో ఈ పరిస్థితి నెలకొంటుంది. వివాదం నుంచి బయట పడేందుకు సందిగ్ధ 83 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అనుబంధ వర్గాల నుంచి సహాయ, సహకారాలు అభ్యర్థించారు. రాష్ట్ర మృతులు 39.. కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటనలో రాష్ట్రం నుంచి 39మంది ప్రయాణికులు మృతిచెందారు. వీరిలో బాలాసోర్ జిల్లా నుంచి 14, మయూర్భంజ్ 9, భద్రక్ 8, కటక్ 3, జాజ్పూర్ 2, ఖుర్దా 2, కెంజొహర్ జిల్లా నుంచి ఒకరు మృతి చెందినట్లు ఖరారు చేశారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటన మేరకు మృతుల కుటుంబీకులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1.95 కోట్ల పరిహారం మంజూరు చేశారు. ఒక్కో మృతుని కుటంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. పరిహారం పొందడం ఇలా.. ఈనెల 2న బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు రైల్వేశాఖ నష్టపరిహారం ప్రకటించింది. వాస్తవ బాధిత, పీడిత వర్గాలు ఈ పరిహారం లబ్ధిదారులు. పరిహారం పొందేందుకు దశలవారీ క్రమ విధానం ఇలా ఉంది. మృతులు, గాయపడిన వారు, గుర్తు తెలియని మృతదేహాల చిత్రాలతో కూడిన వెబ్సైట్ల లింక్లను రైల్వేశాఖ విడుదల చేసింది. మృతదేహాలను ఉంచిన ఆస్పత్రులు, చికిత్స పొందుతున్న, గాయపడిన వ్యక్తుల పేర్లు, చిరునామాలను కూడా ఈ సైట్లో పేర్కొంటాయి. రైల్వేశాఖ మృతుల కుటుంబీకులకు రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తుంది. ఈ మొత్తంలో రూ.50వేల నగదు, రూ.9.5 లక్షల చెక్కు అందిస్తారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం పంపిణీ చేస్తారు. మృతుల గుర్తింపు చర్యలు ముమ్మరం కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల గుర్తింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. మృతుల బంధువులు, ఆత్మీయులు సులువుగా గుర్తించేందుకు పలు రకాల సన్నాహాలు చేశారు. ఈ చర్యలు అంతంత మాత్రంగా ఫలప్రదమయ్యాయి. ఇదిలా ఉండగా మృతదేహాల కోసం పలువురు ముందుకు రావడంతో పరిస్థితి మరింత బిగుసుకుంది. ఈ నేపథ్యంలో మృతదేహాలను దీర్ఘకాలం తాజాగా ఉంచేందుకు శక్తివంతమైన కంటైనర్లు వంటి సాంకేతిక సదుపాయాలతో మృతుల వివరాలు ప్రదర్శన వంటి సన్నాహాలు చేపట్టారు. వీటిపై వివాదం తలెత్తడంతో మృతులు, బంధువర్గాల డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్థానిక అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ప్రాంగణంలో డీఎన్ఏ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. 10మంది వ్యక్తులు డీఎన్ఏ పరీక్షలకు ముందుకు వచ్చారు. వీరిలో 5మంది పరీక్షలు పూర్తి చేసినట్లు అనుబంధ వర్గాలు తెలిపాయి. సచివాలయ సేవాసంఘం.. బాధితుల సహాయార్థం రాష్ట్ర సచివాలయ సేవాసంఘం రూ. 2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ మేరకు సేవాసంఘం సభ్యుల బృందం ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయంలో సీఎస్ ప్రదీప్ జెనాతో భేటీ అయ్యారు. బాధితులకు సాయం.. రైలు ప్రమాద బాధితుల సహాయార్థం ఒడిశా వెటర్నరీ సర్వీసెస్ అసోసియేషన్ రూ.20 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ ప్రదీప్కుమార్ జెనాకు దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు. వెబ్పోర్టల్ వివరాలు: ► ఘోర ప్రమాదంలో మరణించిన వ్యక్తుల చిత్రాలను https://srcodisha.nic.in వెబ్సైట్లో చూడవచ్చు. ► వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న, గాయపడిన ప్రయాణికుల పేర్లను తెలుసుకునేందుకు https://www.bmc.gov.in ► కటక్ ఎస్సీబీ మెడికల్ కశాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తుల ఫోటోల వివరాలు ఈ క్రింది వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ► https://www.bmc.gov.in/train&accident/ download/Un&identified&person&under&treatment&atSCB&Cuttack.pdf ► ప్రభావిత వర్గలు ప్రటకించిన నష్టపరిహారం పొందేందుకు క్రమ పద్ధతిలో అనుబంధ వర్గాలను సంప్రదించాల్సి ఉంది. ► తొలుత మృతదేహం భద్రపరిచిన ఆస్పత్రిని సంప్రదించాలి. ఈ మేరకు రైల్వేశాఖ జారీ చేసిన జాబితాను పరిగణలోకి తీసుకోవాలి. ► బాధితులతో తమ సంబంధాన్ని ధ్రువీకరించే పత్రాలు దాఖలు చేయాలి. ► అభ్యర్థన మేరకు దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన మేరకు ధ్రువీకరించిన తరువాత మృతదేహాన్ని అప్పగిస్తారు. ► ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులు డిశ్చార్జి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ► తదుపరి పరిహారం పొందేందుకు డిశ్చార్జ్ సర్టిఫికెట్తో పాటు అవసరమైన దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. ► మృతుల రక్త సంబంధీకులకు మాత్రమే పరిహారం చెల్లిస్తారు. వివాహిత జంట(దంపతులు) విషయంలో భర్త లేదా భార్యకు మాత్రమే పరిహారం ముడుతుంది. రైల్వే సిబ్బంది ప్రస్తావన లేదు: సీబీఐ 288 మంది మృతికి కారణమైన బాలాసోర్ రైలు ప్రమాదంలో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) లోతుగా పరిశీలించినట్లు మంగళవారం తెలిపింది. ఎఫ్ఐఆర్ దాఖలు సమయానికి నిర్దిష్ట రైల్వే ఉద్యోగుల నేరం నిర్థారించలేదు. తదుపరి దర్యాప్తు సమయంలో ఈ అంశం నిర్థారిస్తామని పేర్కొంది. కటక్ ఓపీఎస్ ఎస్డీఆర్పీఓ రంజిత్ నాయక్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్సీబీలో ఎల్ఈడీ ప్రదర్శన కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి ప్రాంగణంలో ఎల్ఈడీ టీవీ ప్రదర్శన ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో హెల్ప్డెస్క్, సమాచార కేంద్రాలు పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ గుర్తించని బాధితుల బంధు వర్గాలు ముందుకు వచ్చేందుకు వీలుగా ఆస్పత్రి ఆవరణలో చికిత్స పొందుతున్న వారి ఫొటోలను ఎల్ఈడీ టీవీలో ప్రదర్శిస్తున్నారు. బాధితుల వివరాలతో సమగ్ర జాబితా ఈ ప్రదర్శనలో లభ్యమవుతోంది. -
వందేభారత్ పరుగులు.. కోరమండల్ ఎక్స్ప్రెస్ లోకోపైలట్ల నుంచి వాంగ్మూలం
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ స్టేషన్ కోరమండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన మార్గంలో ప్రభావితమైన రైలు రవాణా సేవలు పునః ప్రారంభించారు. ఈ ప్రక్రియలో అనుబంధ యంత్రాంగాలు అవిశ్రాంతంగా కృషి చేసి స్వల్ప వ్యవధిలో సహాయక, పునరుద్ధరణ చర్యలు పూర్తి చేయడం సర్వత్రా అభినందనలు అందుకుంటున్నాయి. ఈ ప్రమాదం పట్ల నిష్పక్షపాత విచారణకు రైల్వేశాఖ నిర్ణయించింది. మరోవైపు నిబంధనల మేరకు ఆగ్నేయ సర్కిల్ రైల్వే భద్రత కమిషనర్(సీఆర్ఎస్) బహనాగా ప్రమాద ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. మూడు రోజుల తర్వాత రైల్వే భద్రత కమిషనర్ శైలేష్కుమార్ పాఠక్ కారణాన్ని తెలుసుకోవడానికి స్వతంత్ర దర్యాప్తులో భాగంగా పరిశీలించారు. రైల్వేస్టేషన్ సిగ్నల్, కంట్రోల్ రూమ్ను సందర్శించి, అక్కడి ఉన్నతాధికారులతో మాట్లాడారు. స్వతంత్ర విచారణ నివేదిక ఆధారంగా చట్టబద్ధమైన దర్యాప్తు ఫలితాలు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే ఘటనపై రైల్వేశాఖ సీబీఐ విచారణ కోరిన నేపథ్యంలో స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఉచిత బస్సు ప్రయాణం.. బహనాగా రైలు ప్రమాదం కారణంగా రైలు సేవలకు అంతరాయం ఏర్పడిన దృష్ట్యా కోల్కతాకు వెళ్లాలనుకునే ప్రజలకు ఒడిశా ఉచిత బస్సు సేవలను అందిస్తోంది. పూరీ నుంచి 20 బస్సులు, భువనేశ్వర్ నుంచి 23, కటక్ నుంచి 16 బస్సులు ఆదివారం రాత్రి 11.30 గంటలకు కోల్కతాకు బయలుదేరాయి. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఆరోగ్యశాఖ మృతదేహంతో బంధువులను రవాణా చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఈ సన్నాహాల కోసం 58 అంబులెన్స్, డీబీసీ వాహనాలను మొహరించారు. అలాగే బహనాగా రైలు దుర్ఘటన ప్రభావంతో పూరీ, భువనేశ్వర్, కటక్ నుంచి కోల్కతాకు ప్రయాణించే ప్రజలకు అత్యవసర సహాయాన్ని అందించేందుకు ఒడిశా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(ఓఎస్ఆర్టీసీ) కొన్ని మార్గాల్లో బస్సు సేవలను రద్దు చేసింది. రైల్వేమంత్రి ఉత్సాహం.. ప్రమాదంతో బహనాగా బజార్ స్టేషన్లో చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు కోచ్లను పూర్తిగా తొలగించి, పట్టాలను పునర్నిర్మించారు. రైళ్ల రవాణాకు పటిష్టత నిర్థారించిన మేరకు రాకపోకలకు అనుమతించారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం విశేషం. రైలు ప్రమాదం జరిగిన 51గంటల అనంతరం ప్రభావిత మార్గంలో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఘోరమైన దుర్ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మంత్రి.. అమాంతంగా రంగంలోకి దిగారు. పట్టాల పునర్నిర్మాణం, పటిష్టతతో తొలుత నడిచిన గూడ్స్ రైలు సిబ్బందికి చేయి ఊపుతూ, సురక్షితమైన ప్రయాణం కోసం ఘటనా స్థలంలో ప్రార్థించారు. వైజాగ్ ఓడరేవు నుంచి రూర్కెలా స్టీల్ప్లాంట్కు బొగ్గుతో కూడిన గూడ్స్రైలు ఆదివారం రాత్రి 10.40 గంటలకు తొలుత పట్టాలెక్కి పరుగులు తీసింది. ఆచూకీ తెలియని మృతదేహాల తరలింపు అగమ్య గోచరంగా పరిణమిస్తోంది. ఈ విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం ఆచితూచి అడుగులు వేస్తోంది. శక్తివంతమైన సాంకేతిక కంటైనర్లను అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తోంది. ఈ మేరకు పారాదీప్ పోర్టు వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. స్థానిక ఎయిమ్స్ వంటి ప్రముఖ ఆరోగ్యసేవా కేంద్రాల్లో కూడ మృతదేహాలు దీర్ఘకాలం తాజాగా ఉంచే సౌకర్యాలు అందుబాటులో లేనందున ఈ పరిస్థితి తలెత్తింది. పారాదీప్ నుంచి 5శక్తివంతమైన కంటైనర్లను తీసుకు వచ్చి, స్థానిక ఎయిమ్స్ ప్రాంగణంలో తాత్కాలికంగా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కో కంటైనర్లో 40 నుంచి 50 వరకు మృతదేహాలను భద్ర పరిచేందుకు వీలఅవుతుంది. వీటిలో 2నెలల వరకు మృతదేహాలు తాజాగా ఉంటాయని భావిస్తున్నారు. 2 దశాబ్దాల విపత్తు నిర్వహణ అనుభవంతో రాష్ట్రప్రభుత్వం మరో మైలురాయిని ఆవిష్కరించే దిశలో అడుగులు వేయడం ప్రధానంగా చెప్పవచ్చు. రాత్రికి రాత్రి స్థానికులు గాడాంధకార చీకటిలో సెల్ఫోన్ల కాంతిలో బాధితులను హుటాహుటిన రక్షించేందుకు ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన తొలి సహాయక బృందంగా నిలవడం దీనికి తార్కాణం. సత్వర చికిత్స కోసం రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా యువత ముందుకు రావడం మానవీయతకు అద్దం పట్టింది. వీరి సత్వర సహాయక చర్యలే సమారు 1,200మంది గాయపడిన ప్రయాణికుల ప్రాణాలను రక్షించగలదని పరిశ్రమల శాఖ కార్యదర్శి హేమంత్ శర్మ ప్రశంసించారు. గుర్తింపే పెను సవాల్..! కోరమండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన తదనంతర కార్యాచరణ పెను సవాల్గా మారింది. పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులు 1, 2 రోజల్లో పూర్తిస్థాయిలో పూర్తికావడం ఖాయం. అయితే సహాయక చర్యలు పూర్తయినట్లు రైల్వేవర్గాలు చేస్తున్న ప్రకటనలు వాస్తవ దూరంగా ఉన్నాయి. బాధితులు, మృతుల సంఖ్య ఖరారు చేయడంలో అటు రైల్వే, ఇటు రాష్ట్రప్రభుత్వం అనుక్షణం మార్పుచేర్పులు చేస్తునే ఉంది. గుట్టలుగా పడి ఉన్న మృతదేహాల్లో సజీవంగా ఉన్న బాధిత యువకుడిని అతని తండ్రి గుర్తించాడనే వార్త దీనికి తార్కాణంగా చెప్పవచ్చు. మరోవైపు మృతులను గుర్తించడంలో బంధువర్గాలు తల్లడిల్లుతున్నారు. ఒకే మృతదేహానికి ఇద్దరు, ముగ్గురు బంధువులు తమదిగా పేర్కొంటూ ముందుకు వస్తున్న విచారకర పరిస్థితులు తలెత్తుతున్నట్లు సమాచారం. ఇటువంటి సందిగ్ధత తలెత్తిన పరిస్థితుల్లో ఆచూకీ లభించని మృతదేహాలుగా పరిగణించి యంత్రాంగం ఊగిసలాడిస్తోంది. మృతదేహాలను అయిన వారికి అప్పగించడంలో అత్యంత జాగరూకత ప్రదర్శిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడం అనివార్యమయ్యే అవకాశం ఉంటుందని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్అమృత కులంగా తెలిపారు. ఇప్పటి వరకు 170 మృతదేహాలను గుర్తించగా, దాదాపు 50కి పైగా ఆచూకీ తేలనవిగా ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్కుమార్ జెనా స్పష్టం చేశారు. నిర్ణీత ప్రక్రియ అనంతరం గమ్యస్థానానికి రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వ ఖర్చులతో పలు ప్రాంతాల్లో గమ్యస్థానం వరకు బంధువర్గాలతో మృతదేహాలను వాహనాలు ఇతరేతర అనుకూల రవాణా మాధ్యమాల్లో ఉచితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాలను వివిధ రాష్ట్రాలకు తరలించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరణ ధ్రువీకరణ పత్రాలు త్వరలో కుటుంబాలకు ఎలక్ట్రానిక్ లేదా పోస్ట్ ద్వారా పంపించనున్నట్లు వివరించారు. వందేభారత్ పరుగులు.. గూడ్సు రైలు రవాణాతో పునరుద్ధరణ పటిష్టత ఖరారు కావడంతో ప్రయాణికుల రైళ్ల రవాణాకు అనుమతించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులతో కూడిన పూరీ ఎక్స్ప్రెస్(12837)ను తొలుత నడిపించారు. పునరుద్ధరించిన ట్రాక్లపై సోమవారం ఉదయం 9.30 గంటలకు హౌరా–పూరీ వందేభారత్ ఎక్స్ప్రెస్ బహనాగా బజార్ స్టేషన్ను సురక్షితంగా దాటింది. ఘటనా స్థలంలో మొదటి సెమీ హైస్పీడ్ రైలు ప్రయాణిస్తున్నప్పుడు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రత్యక్షంగా హాజరై, చేతులుపుతూ లోకోపైలట్లను ఉత్సాహ పరిచారని అధికారులు తెలిపారు. అలాగే ఈ మార్గంలో రాజధాని ఎక్స్ప్రెస్ రైలు రవాణా పునరుద్ధరించారు. 28 రైళ్లు ఇప్పటికే అప్ అండ్ డౌన్ లైన్లను దాటాయి. నియంత్రిత వేగంతో ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వేవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు సోమవారం 2 ప్రయాణికుల రైలుసేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు. వీటిలో పూరీ–పాట్నా(18449) బైద్యనాథం ఎక్స్ప్రెస్, ఖుర్దారోడ్–ఖరగ్పూర్(18022) ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. -
పట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్ప్రెస్
సాక్షి, చైన్నె: చైన్నె నుంచి షాలిమర్ వైపుగా కోరమాండల్ ఎక్స్ప్రెస్ రెండురోజుల అనంతరం పట్టాలెక్కింది. ఈ రైలు మంగళవారం షాలిమర్కు చేరుకోనుంది. వివరాలు.. ఒడిశా బాలసోర్ వద్ద శుక్రవారం కోరమాండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు, హౌరా ఎక్స్ప్రెస్లు ఢీకొన్న దుర్గటనతో చైన్నె నుంచి అనేక రైళ్ల సేవలు రద్దు చేశారు. ఈ ప్రమాదంలో తమిళులు పెద్దసంఖ్యలో చిక్కుకున్నట్టుగా వచ్చిన సమాచారంతో సహాయక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో తమిళులు ఎవరూ మరణించలేదు. స్వల్పగాయాలతో బయట పడ్డ వాళ్లే అధికం. అందరూ సురక్షితంగా రాష్ట్రానికి వచ్చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశాలో ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైల్వే ట్రాక్ను పునరుద్ధరించడంతో మళ్లీ రైళ్ల సేవలపై అధికారులు దృష్టి పెట్టారు. దీంతో చైన్నె నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపుగా వెళ్లే పలు రైళ్లు సేవలను సోమవారం పునరుద్ధరించారు. అలాగే రెండురోజులుగా పూర్తిగా నిలుపుదల చేసిన చైన్నె – షాలిమర్ కోరమాండల్ ఎక్స్ప్రెస్ను మళ్లీ ప్రారంభించారు. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలు దేరే సమాచారాన్ని మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పంపించారు. దీంతో ఈ రైలు సోమవారం ఉదయం చైన్నె ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 10.45 గంటలకు బయలు దేరింది. ఈ రైలు విజయవాడ, రాజమండ్రి, విశాఖ పట్నం మీదుగా బాలాసోర్ వైపుగా కోలకతాలోని షాలిమర్కు మంగళవారం ఉదయం చేరుకోనుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement