-
‘పెండింగ్’పై 23న భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారానికి ఏర్పాటైన కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ ఈ నెల 23వ తేదీన సమావేశమై సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ (సమన్వయ) కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ ఎం.చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపారు. ఈ–సమీక్ష పోర్టల్లో పొందుపరిచిన ఏపీకి చెందిన అంశాలపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ లోటు, హోదా.. సమన్వయ కమిటీ వద్ద పెండింగ్లో ఉన్న 34 అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద అపరిష్కృతంగా ఉన్న 15 అంశాలను సమీక్ష అజెండాలో చేర్చారు. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట్ర విభజన జరిగిన ఏడాది రెవెన్యూ లోటు భర్తీతో సహా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా అజెండాలో పొందుపరిచారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లకు సంబంధించి పెండింగ్ అంశాలను అజెండాలో చేర్చారు. అజెండాలో ముఖ్యాంశాలు ఇవీ... ► విభజన చట్టం 13వ షెడ్యూల్లో పేర్కొన్న మేరకు ఆరు నెలల్లోగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు. ► కొత్త రాజధాని నుంచి హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ముఖ్యమైన నగరాలకు ర్యాపిడ్ రైలుతోపాటు రోడ్డు కనెక్టివిటీ కల్పించడం. ► విభజన చట్టం 13వ షెడ్యూల్ ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. ► 2014–15 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూ లోటు భర్తీకి నిధులు అందించడం. ► 2016లో ప్రధాని ప్రకటన మేరకు విశాఖలో జాతీయ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ ఏర్పాటు. ► కొత్త రాజధానిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందించడం. ► పోలవరంలో ఆర్ అండ్ ఆర్తో సహా ప్రాజెక్టుకయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించడం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు ఒడిశా, చత్తీస్గడ్లో ప్రజాభిప్రాయ సేకరణకు చర్యలు తీసుకోవడం. ► విశాఖలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఏర్పాటు చేయడం. ► విశాఖలో మెట్రో రైలు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం. ► వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అందించడం. ► ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడం. ► విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి పన్ను రాయితీలు ఇవ్వడం. హైదరాబాద్లో ఉన్న వివిధ శిక్షణ సంస్థలను ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడం. ► కాకినాడ పోర్టు సమీపంలో ఎలక్ట్రానిక్ (హార్డ్వేర్) ఉపకరణాల తయారీ కేంద్రం ఏర్పాటు. 16న పీపీఏ సర్వసభ్య సమావేశం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 16న హైదరాబాద్లో జరగనుంది. సమావేశంలో ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులు, సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్..ఆ మేరకు నిధుల మంజూరుపై చర్చించనున్నారు. పీపీఏ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని 4 నెలల క్రితం పీపీఏ సీఈవోకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లేఖ రాశారు. పీపీఏ నుంచి స్పందన లేకపోవడంతో ఇటీవల అదే అంశాన్ని గుర్తు చేస్తూ మరో లేఖ రాశారు. దీనిపై స్పందించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ 16న సమావేశాన్ని నిర్వహిస్తామని ఏపీకి సమాచారమిచ్చారు. కాగా, ఏడాది క్రితం పీపీఏ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. -
పార్టీ నేతలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
సాక్షి, అమరావతి: టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కొందరు నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సి, డి గ్రేడ్లల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తెలుగుదేశం పైనా చర్చ సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతున్న తీరును జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు వివరించారు. ఇప్పటికీ నలభై నియోజకవర్గాలు సీ, డీ గ్రేడుల్లోనే ఉన్నాయని లోకేష్ తెలిపారు. మున్సిపల్ శాఖకు సంబంధించే అత్యధిక ఫిర్యాదులందాయని పేర్కొన్నారు. కమిటీ భేటీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం ప్రస్తావనకు వచ్చింది. పని చేసే వారికే పదవుల భర్తీలో ప్రాధాన్యమని చంద్రబాబు స్పష్టం చేవారు. ఇంటింటికీ తెలుగుదేశంలో సి, డి గ్రేడ్లల్లో ఉన్న ఎమ్మెల్యేలకు, ఇన్చార్జ్లకు బాబు క్లాస్ తీసుకున్నారు. ‘మహానుభావుల పనితీరు ఇదేనా’ అంటూ వారిపై వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్టణం పార్లమెంట్ పరిధిలోని పామర్రు, గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలు సి-గ్రేడ్ లో ఉండటంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరినీ గాడిలో పెట్టాలని ఇంచార్జి మంత్రి యనమలకు బాబు సూచన చేశారు. అలాగే గండికోట ప్రాజెక్ట్ పనుల్లో ఆలస్యంపై చంద్రబాబు అసంతృప్తి చెందారు. కాంట్రాక్టర్లు ఎవరైనా సరే పనిలో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అవసరం అయితే పోలీసుల్ని పంపుతామని వ్యాఖ్యలు చేశారు. కాగా సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. -
వాడివేడిగా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
♦ తమ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపణలు ♦ పార్టీలో గ్రూపులు ఉన్నాయని గగ్గోలు ♦ తమ్ముళ్ల మధ్య పరస్పర వాగ్వాదం కడప రూరల్ : జిల్లా ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆ«ధ్వర్యంలో ఆదివారం కడప ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో నిర్వహించిన జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి ఇన్చార్జిలు, ఆ ప్రాంతాలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఆ మేరకు పులివెందుల నుంచి సతీష్రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, రాయచోటి నుంచి రమేష్రెడ్డి, బద్వేలు నుంచి ఎమ్మెల్యే జయరాములు, విజయజ్యోతి, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, ప్రొద్దుటూరు నుంచి వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, రైల్వేకోడూరు నుంచి విశ్వనాథనాయుడు, బత్యాల చెంగల్రాయులు, రాజంపేట నుంచి మాజీమంత్రి బ్రహ్మయ్య, జమ్మలమడుగు నుంచి మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. కొన్ని అంశాలపై తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. సమాచారం మేరకు ఒక నియోజకవర్గానికి చెందిన నేత మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరినైనా గెలిపించాలంటే పార్టీ మొత్తం సమష్టిగా కృషి చేయాలి.. అయితే మా నియోజకవర్గంలో గ్రూపులు ఎక్కువగా ఉండడం, ఆ గ్రూపులను ప్రోత్సహించడం ఎంతవరకు సబబని నిలదీశారు. ఆ నియోజకవర్గానికి చెందిన మరో నేత మధ్యలో కల్పించుకుని గ్రూపుల్లేవని, కలిసికట్టుగానే పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను ఏదైనా చేయడానికి తనకు ఏమంత ప్రాధాన్యత గల పదవి ఇచ్చారని తన మనసులో మాటను బయటపెట్టారు. అందుకు మంత్రి సోమిరెడ్డి కల్పించుకుని నువ్వు అలా మాట్లాడడం తగదు.. నీకు ఆ పదవి ఇవ్వడమే గొప్ప అని నిర్మోహమాటంగా బదులిచ్చారు. అలాగే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగల నియోజకవర్గానికి చెందిన నాయకుడు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఏనాడో వేసిన రింగ్రోడ్లు, అప్పుడు వేసిన రోడ్లు, ఏర్పాటు చేసిన లైట్లు తప్పితే ఇప్పుడు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. అలాగే తనను స్థానికంగా ఎవరూ గుర్తించడం లేదని, చివరికి ఎస్ఐ కూడా పలకడం లేదని వాపోయినట్లు తెలిసింది. అందుకు మంత్రి సోమిరెడ్డి కల్పించుకుని కాసింత నవ్వుతూనే చాల్లేవయ్యా.. అంత పదవి అనుభవించావు.. ఆఖరికి ఎస్ఐ కూడా మాట వినలేదంటే ఎవరైనా వింటే నవ్విపోతారు.. చెప్పేదానికైనా ఒక అర్థం పర్థం ఉండాలంటూ బదులిచ్చారు. ఇంకొక జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రముఖ నాయకుడు మాట్లాడుతూ పార్టీలో సీనియర్ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని, మొన్న వచ్చిన వారికే పట్టం కడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. అందుకు మధ్యలోనే కల్పించుకున్న ఓ ప్రముఖ నేత మాట్లాడుతూ ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు మనకు ఓట్లు–సీట్లే ప్రధానం.. అలాంటి నాయకులకు ప్రాధాన్యత ఇస్తానని ఏనాడో చెప్పారని గుర్తు చేశారు. దీంతో ఆ నాయకుడు కిమ్మనకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్బంగా ఒక జిల్లా అధికారి తీరుపై సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దక్షిణం వైపున గల నియోజకవర్గానికి చెందిన ఇటీవల టీడీపీలో చేరిన ఒక నాయకుడు కల్పించుకుని ఆ అధికారి ఉండాల్సిందేనని బదులిచ్చారు. అందుకు ఆ నియోజకవర్గ ఇన్చార్జి ఆగ్రహించినట్లు తెలిసింది. అందుకు ఆ నాయకుడు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా చాల్లేవయ్యా.. నీవెపుడు నియోజకవర్గంలో ఉంటున్నావని.. 24 గంటలు తిరుపతిలోనే ఉండి నీ పనులు చూసుకుంటున్నావని ఎద్దేవా చేశారు. అలాగే ఉత్తర ప్రాంత నియోజకవర్గానికి చెందిన ఒక నేత తాను ప్రజాప్రతినిధిగా ఉంటునప్పటికీ ఎవరూ గుర్తించడం లేదని, తన అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఏకరువు పెట్టారు. అలాగే పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు తమ ప్రాంత అభివృద్ధిపై తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మనం ఎన్నో వాగ్దానాలు చేశాం.. వాటిల్లో చాలా వాటిని నామమాత్రంగానైనా అమలు చేయలేదు.. దీనిపై ప్రజలు నిలదీస్తున్నారు.. తాము ఏమని సమాధానం చెప్పాలని వాపోయారు. అందుకు బదులుగా మంత్రి సోమిరెడ్డి కొన్నింటికి సమయస్ఫూర్తిగా సమాధానమిచ్చారు. మరికొన్నింటిపై దాట వేశారు. ఇంకొన్నింటికి కాలమే సమాధానం చెబుతుందన్నట్లుగా మౌనం పాటించారు. మొత్తం మీద టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం వాడివేడిగా కొనసాగినట్లుగా తెలిసింది. -
ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఉదయం విజయవాడలో ప్రారంభమైంది. ఆంధ్రరత్నభవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు తిరువనక్కరసు, కొప్పుల రాజు, రఘువీరా, పల్లంరాజు, కేవీపీ, పనబాక లక్ష్మీ, జేడీ శీలం తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఆరు కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విభజన చట్టంలోని హామీల అమలు, టీడీపీ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. -
కలసికట్టుగా సమస్యలకు చెక్
సమన్వయ సమావేశంలో 14 విభాగాల ఉన్నతాధికారుల తీర్మానం ఇకపై నెలనెలా సమావేశాలు సర్కిల్, జోనల్ స్థాయిల్లోనూ అమలు సమన్వయం లేకే ప్రజలకు సమస్యలని ఒప్పుకోలు నగర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. ఇందుకు సమన్వయం ఎంతో ముఖ్యమని ప్రకటించారు. ఈమేరకు జీహెచ్ఎంసీలో శుక్రవారం గ్రేటర్ పరిధిలోని 14 విభాగాల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్లో ప్రజల మన్ననలు పొందేందుకు కృషి చేద్దామని తీర్మానించారు. సిటీబ్యూరో: వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం గ్రేటర్ ప్రజలకు శాపంగా మారుతోంది. ఏటా రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, ఆయా ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయం లేక సదరు ప్రాజెక్టులు పూర్తికావడం లేవు. సంక్షేమ పథకాలు కుంటుతుండటంతో ప్రజలకు పూర్తి ప్రయోజనం లభించడం లేదు. పనుల్లో జాప్యంతో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతోంది. ఇవే అంశాల్ని శుక్రవారం జీహెచ్ఎంసీలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులు ప్రస్తావించారు. ఇకపై ఇలాంటి వాటికి తావులేకుండా అన్ని విభాగాల వారు సమన్వయంతో కలిసిమెలసి పనిచేద్దామని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రజల ఇబ్బందులు తొలగిద్దామని నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్స్థాయిలోనే కాకుండా జోనల్, సర్కిల్ స్థాయిలోనూ ఇలాంటి సమన్వయ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. నగరవాసుల ఇబ్బందులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రతినెలా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని 14 శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఈసమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. పౌరసేవలు, అభివృద్ధిపనులకు సంబంధించి వివిధశాఖల మధ్యసమన్వయ సమావేశాలు నిర్వహించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, శాఖల మధ్యసమన్వయంతో వేల కోట్ల పనులు కుంటుతున్నాయన్నారు. ము ఖ్యంగా జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు, మెట్రోరైలు, టెలికాం శాఖల మధ్య సమన్వయలోపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇంకా సమావేశంలో ఎవరేమన్నారంటే.. వచ్చే నెల 5న మళ్లీ భేటీ ఈ సమావేశంలో వచ్చిన సలహాల అమలుకు, సమస్యల పరిష్కారానికి తగుచర్యలు తీసుకోవాలని జనార్దన్రెడ్డి సంబంధిత శాఖల అధికారులకు విజ్ఞప్తి చేశారు. వచ్చేనెల 5వ తేదీన మెట్రోరైలు కార్యాలయలో సమన్వయ సమావేశం నిర్వహించాలని లాటరీ ద్వారా నిర్ణయించారు. ఖాళీ స్థలాల్లో పౌర సదుపాయాలు నగరంలో వివిధ పౌరసదుపాయాలకు కేటాయించిన అనేక స్థలాల్లో వాటిని కల్పించకపోవడంతో ఖాళీగా ఉండి కబ్జాలపాలవుతున్నాయి. అలా జరగకుండా వెంటనే తగు నిర్మాణాలు ప్రారంభించాలి. క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలోని మూడు ఎకరాల భూమి వివాదంలో ఉన్నందున దానిని ఎస్సార్డీపీ, తదితర పనులకు కేటాయించడం సాధ్యం కాదు. - రాహుల్ బొజ్జా, హైదరాబాద్ కలెక్టర్ పైప్లైన్ల పరిరక్షణకు కమిటీలు.. గోదావరి, కృష్ణాఫేజ్-3 పనులు త్వరలో పూర్తికానున్నాయి. నగరానికి నీరందించేందుకు వేసిన 168 కి.మీ.ల ప్రధాన పైప్లైన్లను ఎవరూ ధ్వంసం చేయకుండా పైప్లైన్ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తాం. జలమండలి చేపట్టే పనుల వివరాలను ముందస్తుగానే ఆయా విభాగాలకు తెలియజేస్తాం. జీహెచ్ఎంసీ త్వరలో ప్రారంభించనున్న 2 వేల ఆటో టిప్పర్లు, 44 లక్షల డస్ట్బిన్ల పంపిణీ ఇతరత్రా కార్యక్రమాల అమలుకు అందరి సహకారం అవసరం. - బి.జనార్దన్రెడ్డి (జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎం.డి) ట్రాఫిక్కు అనుగుణంగా రహదారులు దశాబ్దాల నాటి బస్షెల్టర్లు, బస్బేలు ప్రస్తుత జనాభాకు సరిపోవడంలేవు. పెరిగిన ట్రాఫిక్కు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దాలి. ముఖ్యంగా బల్దియా, జలమండలి, టెలికాంల మధ్య సమన్వయం అవసరం. అవి చేపట్టే పనుల వివరాలను ముందస్తుగా తెలియజేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపడతాం. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలి. - జితేందర్, అడిషనల్ సీపీ(ట్రాఫిక్) చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యంత్రాంగం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, నీటిపారుదల శాఖలకు చెందిన వందలాది చెరువులు కబ్జాకావడానికి కారణం వాటిమధ్య సమన్వయం లేకపోవడమే. సకాలంలో స్పందించకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. వివిధశాఖల పరిధిలో ఉన్న చెరువులన్నింటినీ ఒకే శాఖ కిందకు తెస్తే మేలు. జవహర్నగర్ డంపింగ్యార్డులో చెత్తతో నిండిన ప్రదేశాన్ని వెంటనే క్యాపింగ్ చేయాలి. - రఘనందన్రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బస్షెల్టర్లు వెంటనే నిర్మించాలి జీహెచ్ఎంసీలో 116 బస్షెల్టర్లు, 14 బస్బేలు నిర్మించేం దుకు ప్రతిపాదనలు పంపాం. వీటిని వెంటనే నిర్మించాలి. నగర ప్రజలకు సదుపాయంగా ఉండేలా బస్షెల్టర్లను డిజైన్ చేయాలి. - పురుషోత్తం, టీఎస్సార్టీసీ ఈడీ చట్టాల్లోని లొసుగులతోనే ఉల్లంఘనలు నగరంలో ఫుట్పాత్ల ఆక్రమణ, అక్రమపార్కింగ్లు, భూకబ్జాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇందుకు కారణం చట్టాల్లోని లొసుగులే. వీటిపై అన్నిశాఖల అధికారులు ఉమ్మడిగా స్పందిస్తే చాలావరకు అరికట్టవచ్చు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి కఠిన చర్యలు తీసుకుంటే చట్టాలు అతిక్రమించేందుకు భయపడతారు. - మహేందర్రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అన్ని శాఖల సహకారం అవసరం మెట్రోస్టేషన్లలో ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పనకు వివిధ ప్రభుత్వశాఖల సహాయ సహకారాలు ఎంతో అవసరం. ముఖ్యంగా నాగోల్, ఉప్పల్ మెట్రోస్టేషన్లలో పీపీపీ లేదా బీపీఓ పద్ధతిలో ఆయా సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ స్టేషన్లలో మీసేవ తరహాలో పౌరసేవాకేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. - ఎన్వీఎస్రెడ్డి, మెట్రోరైలు ఎండీ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement