-
మహిళలకు 4.73 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు
♦ ఉజ్వల పథకం ద్వారా త్వరలోనే అందజేస్తాం: దత్తాత్రేయ ♦ హైదరాబాద్లో 2019 నాటికి పైపులైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం కింద త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 4.73 లక్షల మంది మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. శనివారం హైదరాబాద్లోని ఈపీఎఫ్ ప్రాంతీ య కార్యాలయంలో పెట్రోలియం శాఖ, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులతో దత్తాత్రేయ సమావేశమయ్యారు. గ్యాస్ కనెక్షన్లతో పాటు గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్లను వాయిదాల పద్ధతిలో అందజేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 4.73 లక్షల మం దికి మంజూరు చేయనున్నట్లు చెప్పారు. గతేడాది తెలంగాణలో దీపం పథకం కింద 2.43 లక్షల కనెక్షన్లు, కేంద్రం తరఫున సీఎస్ఆర్ ఉచిత గ్యాస్ స్కీం ద్వారా 3.26లక్షల కనెక్షన్లు ఇచ్చినట్లు వివరించారు. మొత్తం 85.6 లక్షల మంది గ్యాస్ కనెక్షన్ను నిత్యం వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. సీఎన్జీ స్టేషన్లను పెంచుతాం.. హైదరాబాద్ మహానగర వాసులకు 2018-19 నాటికి వంటగ్యాస్ను పూర్తిస్థాయిలో పైపులైన్ ద్వారా సరఫరా చేస్తామని దత్తాత్రేయ చెప్పారు. ఇప్పటికే మొదటి ఫేజ్లో భాగంగా శామీర్పేట నుంచి కుత్బుల్లాపూర్ వరకు 1,100 కుటుంబాలకు గ్యాస్ పైపులైన్ ద్వారా విజయవంతంగా వంటగ్యాస్ సరఫరా అవుతోందని పేర్కొన్నారు. రెండో విడతలో కుత్బుల్లాపూర్ నుంచి కూకట్పల్లి జేఎన్టీయూ వరకు చేపట్టిన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలి పారు. ఇక వాహనదారుల కోసం ఏర్పాటు చేసిన సీఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్లను భారీగా పెంచనున్నట్లు చెప్పారు. -
పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరా విస్తరణ
కుత్భుల్లాపూర్లో ప్రారంభించిన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ హైదరాబాద్: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్(బీజీఎల్) సంస్థ ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరాను విస్తరించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కుత్భుల్లాపూర్ సమీపంలోని గోదావరి హోమ్స్కు పైప్లైన్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) సరఫరా చేసే ప్రక్రియను బుధవారం ప్రారంభించింది. ఇప్పటివరకు నల్సార్ వర్సిటీ క్యాంపస్, మేడ్చల్ మండల కేంద్రానికే పీఎన్జీ పరిమితమైంది. లక్ష కుటుంబాలకు 2014 ఏప్రిల్ నాటికి పీఎన్జీ అందించాలని లక్ష్యం నిర్దేశించుకున్న బీజీఎల్ ఇప్పుడు 440 కుటుంబాలకే ఇవ్వగలుగుతోంది. విస్తరణపనులు కేవలం 32కి.మీ. మేరకు సాగాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మూడంచెల పటిష్ట భద్రత
గురుకులాల్లో ఇంటర్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్కు ఎంపిక
సింగరేణి ఎక్స్టర్నల్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ
అమ్మో ఇవేం పరీక్షలు..?
ప్రభుత్వాస్పత్రిలో ఇంటి దొంగలు..!
రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ప్లాంటేషన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
తప్పక చదవండి
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement