-
వరంగల్లో విషాదం.. రిజర్వాయర్లో పడి..
సాక్షి, వరంగల్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బీమారంలో ఉన్న పుట్టలమ్మ రిజర్వాయర్లో పడి గురువారం ముగ్గురు బాలురు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. బీమారానికి చెందిన దొడ్డిపాటి మనివిత్ (11), దొడ్డిపాటి మహేష్ బాబు(14), మ్యూనికుంట్ల విష్ణు తేజ (14) ఈ ముగ్గురు బాలురు సైకిల్పై వెళ్లి పుట్టలమ్మ రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడి పిల్లలు గల్లంతు కావటంతో స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లని దింపి గాలింపు చర్యలు చేపట్టారు. (ఆయన గొంతు విన్నాక.. కన్నీళ్లు ఆగలేదు! ) సమాచారం అందుకున్న కేయూసీ పోలీసులు హుటాముటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెండు మృతదేహాలను వెలికి తీయగా.. వారిని మనివిత్, మహేష్ బాబుగా గుర్తించారు. మరో బాలుడి కోసం గాలిస్తున్నారు. ఇక ఈ దుర్ఘటనతో బాధితుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బిడ్డల కోసం తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. (తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్న్యూస్..) -
ఈత.. కడుపుకోత
వేసవికాలం.. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందాలన్నా.. స్నేహితులతో సరదాగా గడపాలన్నా ఈత ఒకటే మార్గం.. ఈ నేపథ్యంలో ఎంతోమంది విద్యార్థులు, పెద్దవారు సైతం బావులు, కాల్వలు, చెరువుల్లో సేదతీరుతూ కనిపిస్తుంటారు.. అయితే కొంత మంది ఈత రాకపోయినా.. ఎలా కొట్టాలో తెలియకపోయినా ఈ తపడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. ప్రతియేటా పదుల సంఖ్యలో ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు.. ఈ క్రమంలో ఇ టు తల్లిదండ్రులు గాని.. అటు ప్రభుత్వ యంత్రాంగం గాని వీరిపై ప్రత్యేక దృష్టిసారించలేకపోతున్నారు.. ఫలితంగా తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చుతున్నారు.. మహబూబ్నగర్ క్రైం : వేసవి సెలవుల్లో పిల్లలు.. పెద్దలు ఈత నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మండు వేసవిలో ఎండవేడిమి నుంచి ఉపశమనానికి.. సెలవుల సరదాతో కాలక్షేపం కోసం ఈతకు వెళ్లడం అందరికీ అభిరుచిగా మారుతోంది. అలాంటిది ఈత రాక ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. కనీసం అవసరమైన స్విమ్మింగ్ పూల్స్ లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతుంది. భౌగోళికంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో వాగులు, వంకలు, నదులు, బావులు, కాల్వలకు కొదువ లేదు. జిల్లాకేంద్రంతో పాటు ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈత సరదాను తీర్చుకునేందుకు బావులకు వెళ్తుంటా రు. పట్టణంలో కంటే గ్రామీణ ప్రాంతా ల్లోని విద్యార్థులు, యువకులు ఆయా ప్రాంతాల్లో ఉండే బావులు, కుం టలు, చెరువులు, కాల్వలను అధికంగా ఆశ్రయిస్తున్నారు. చాలామందికి ఈత కొట్టడం ఎలాగో తెలియక ప్రమాదాల ను కొని తెచ్చుకుంటున్నారు. రక్షణ చర్యల్లేక ఈత మాటున నిండు ప్రాణాలను పోగొట్టుకుని కన్నవారికి కడుపుకో త మిగులుస్తున్నారు. వేసవిలో బాలలు, యువకులు జిల్లాలో ఈతకు వెళ్తూ నీటిలో మునిగి మృత్యువాత పడుతున్న సంఘటనలు ఏటా పెరుగుతున్నాయి. నీటిలోతు, ఈత కొట్టే పద్ధతులు తెలియక అందులో మునిగిపోతుండగా రక్షణ చర్యలు కరువయ్యాయి. రక్షించడం ఇలా.. ప్రత్యక్ష పద్ధతి ద్వారా నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించే వీలుంటుంది. అయితే రక్షించబోయే వ్యక్తికి ఈత రావడంతోపాటు ధైర్యం కలిగి ఉండాలి. నీటిలో మునుగుతున్న వ్యక్తి వెనుక నుంచి వెళ్లి అతని వెంట్రుకలు, అండర్వేర్, మొలతాడు వంటి వాటిలో ఏదో ఒకటి పట్టుకొని ఒడ్డుకు తీసుకురావాలి. పరోక్ష పద్ధతి.. ఈ పద్దతి ద్వారా ఈత వచ్చిన వారితోపాటు రాని వారు కూడా నీటిలో మునుగుతున్న వారిని రక్షించవచ్చు. రక్షించే వారు నీటిలోకి దిగకుండా ఒడ్డున ఉండే ప్రమాదంలో చిక్కుకున్న వారికి ఆసరాగా ఒడ్డునుంచే దేన్నైనా పట్టుకునేలా అందించాలి. దగ్గరగా ఉంటే కర్ర, టవల్, ప్యాంట్ వంటివి అందించాలి. దూరంగా ఉంటే తాడు, పొడవాటి కర్రను అందించి ఒడ్డుకు చేర్చాలి. నీటిపై తేలియాడే పరికరాలను నీటిలోకి విసిరి వేయాలి. ప్రథమ చికిత్స ముఖ్యం.. నీటిలో ప్రమాదానికి గురైన వ్యక్తిని ఒడ్డుకు చేర్చగానే అతన్ని వెల్లకిలా పడుకోబెట్టాలి. అవసరమైతే నోట్లో నోరు పెట్టి శ్వాసను ఊదుతూ కృత్రిమ శ్వాస అందించాలి. ఛాతిపై చేతులతో ఒత్తాలి. దీంతో శ్వాస పెరుగుతుంది. ప్రథమ చికిత్స చేస్తూనే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలి. జాగ్రత్తలు అవసరం.. ఈత కొలనులోకి నేర్చుకునేందుకు వెళ్తున్నప్పుడు అక్కడ సుశిక్షితులైన కోచ్లు, ఇతర సిబ్బంది రక్షణ చర్యలు ఉన్నాయో లేదో చర్యలు ఉన్నాయో లేదో పెద్దలు పరిశీలించాల్సిన తర్వాతే పిల్లలను పంపించాలి. చెరువులు, కాల్వల్లో, ఈతకు వెళ్తున్నప్పుడు బాలల వెంట పెద్దవారు తప్పక వెళ్లాలి. కొత్త ప్రదేశంలో బావులు, కాల్వలు, చెరువుల్లో ఈత కొట్టే ముందు కర్ర సాయంతో లోతును పరిశీలించాలి. ఈత రాని వారు దాన్ని నేర్చుకునేందుకు ట్యూబ్లు, ఇతర పరికరాలను ఉపయోగించి పూర్తిగా ఈత కొట్టడం వచ్చాకే లోతుకు వెళ్లాలి. సెలవులు కాబట్టి పిల్లలు బయటికి వెళ్లి చాలా సమయం అయితే వారి వారి తల్లిదండ్రులు పిల్లల సమాచారంపై వాకబు చేసుకుని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విహార యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు స్నానం ఆచరించాలే తప్ప అక్కడి వాటిల్లోకి వెళ్లి ఈత కొట్టడం చేయవద్దు. మట్టిని లోతుగా తవ్విన ప్రాంతాల్లో నిలిచిన నీటిలో లోతు తెలియదు. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఈతకు సాహసం చేయరాదు. జిల్లాలో కృష్ణ, జూరాల, కోయిల్సాగర్, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో సెలవులు గడపడానికి వచ్చిన పిల్లలు ఈతకు వెళ్లినప్పుడు వారి వెంట పెద్దవారు తప్పకుండా ఉండాలి. ఇవీ ప్రమాద ఘటనలు.. కందూరు రామలింగేశ్వర ఆలయ కోనేరులో ఈ నెల 8న ఈత రాక నీటలో మునిగి మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని ఏనుగొండకు చెందిన రవికుమార్, పవన్కుమార్, ఆంజనేయులు అనే అన్నదమ్ములు మృత్యువాతపడ్డారు. ఈ నెల 15న గద్వాల మండలం జమ్మిచేడ్కు చెందిన జశ్వంత్ బావిలో నీట మునిగి మృతిచెందాడు. ఈ నెల 18న ధన్వాడ ఎస్సీ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న నరేష్కుమార్ బావిలో గల్లంతు అయితే మరసటి రోజు ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. -
లారీ ఢీకొని ఆరేళ్ల బాలుడి మృతి
బాపులపాడు : కృష్ణా జిల్లా బాపులపాడులో పెనువిషాదం చోటుచేసుకుంది. స్కూల్కు వెళ్లేందుకు రోడ్డుపై నిల్చున్న ఆరేళ్ల బాలుడిని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో జరిగింది. వివరాలు..గ్రామానికి చెందిన గొల్ల మురళి కృష్ణ(6) సమీపంలోని వీరవల్లు గ్రామంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం గ్రామంలోని బస్స్టాప్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తుండగా వేగంగా వెళ్తున్నలారీ అదుపుతప్పి బాలుడిని ఢీ కొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రేన్ కిందపడి చిన్నారి మృతి
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. హస్తినాపురంలో శుక్రవారం ఉదయం ఓ బాలుడు క్రేన్ కిందపడి మృతి చెందాడు. హస్తినాపురంలో నర్సరీ చదువుతున్న విద్యార్థి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన క్రేన్ వాహనం బాలుడుని ఢీకొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. స్తానికుల వెంటనే స్పందించి క్రేన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని స్తానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్కు ప్రమాదం
Indraja Sankar: విజిల్ నటి బర్త్డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
పంజాబ్పై ఘన విజయం.. సెకెండ్ ప్లేస్కు ఎస్ఆర్హెచ్
అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement