-
భారత్ తడబాటు
భారత స్పిన్నర్ జడేజా మిగిలిన మూడు వికెట్లను పడగొట్టిన మన స్పిన్ పిచ్పై ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఆ తర్వాత అంతకు మించి పట్టు సాధించాడు. ఇది భారత తొలి ఇన్నింగ్స్ను దెబ్బకొట్టింది. అలాగే ‘అంపైర్ కాల్’ భారత వికెట్లను ప్రభావితం చేసింది. క్రీజులో ప్రధాన బ్యాటర్ అంటూ లేకుండా చేయడంతో పరుగుల పరంగా టీమిండియా వెనుకబడింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ పైచేయి సాధించడం ఖాయమైంది. రాంచీ: మ్యాచ్కు ముందు రోజు వికెట్ను పరిశీలించిన ఇరుజట్ల వర్గాలు ‘పిచ్పై అంచనా కష్టం. ఏ రోజు టర్న్ అవుతుందో కచ్చితంగా చెప్పలేం’ అని అభిప్రాయపడ్డాయి. అనూహ్యంగా రెండో రోజే పిచ్ పూర్తిగా స్పిన్కు స్వర్గధామమైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో మిగిలిపోయిన మూడు వికెట్లను జడేజా పడేశాడు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ తమ యువ ఆఫ్స్పిన్నర్ బషీర్తో వరుసగా ఓవర్లు వేయించాడు. అతను 31 ఓవర్లు నిర్విరామంగా బౌలింగ్ చేసి విలువైన వికెట్లను పడేయడంతో ఆతిథ్య భారత్ కష్టాల పాలైంది. శనివారం ఆట నిలిచే సమయానికి టీమిండియా 73 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (117 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. బషీర్ 4 వికెట్లు పడగొడితే మరో స్పిన్నర్ హార్ట్లీ కూడా 2 వికెట్లు తీసి భారత్ కష్టాల్ని పెంచాడు. మరో 51 పరుగులు... రెండో రోజు 302/7 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన ఇంగ్లండ్ 104.5 ఓవర్లలో 353 పరుగుల వద్ద ఆలౌటైంది. మరో 14.5 ఓవర్లు ఆడి తొలి రోజు స్కోరుకు 51 పరుగులు జోడించింది. జో రూట్ (274 బంతుల్లో 122 నాటౌట్; 10 ఫోర్లు) అజేయగా నిలువగా... చకాచకా బౌండరీలు బాదిన ఒలీ రాబిన్సన్ (96 బంతుల్లో 58; 9 ఫోర్లు, 1 సిక్స్) టెస్టుల్లో తొలి సారి అర్ధ శతకాన్ని సాధించాడు. వీరిద్దరు 8వ వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఎట్టకేలకు రాబిన్సన్ను అవుట్ చేయడం ద్వారా జడేజా ఈ జోడీని విడగొట్టాడు. 347 పరుగుల వద్ద ఈ వికెట్ పడగా, మరో ఆరు పరుగుల వ్యవధిలో బషీర్ (0), అండర్సన్ (0) వికెట్లను కూడా జడేజానే తీయడంతో లంచ్కు ముందే ఇంగ్లండ్ ఆట ముగిసింది. రాణించిన యశస్వి ఈ సిరీస్లో అసాధారణ ఫామ్లో ఉన్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. లేదంటే పరిస్థితి మరింత భిన్నంగా ఉండేది! కెప్టెన్ రోహిత్ (2) మూడో ఓవర్లోనే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన శుబ్మన్ గిల్తో జైస్వాల్ జోడి కుదరడంతో తొలి సెషన్లో మరో వికెట్ పడలేదు. ఇక రెండో సెషన్ను సాఫీగా నడిపిస్తున్న తరుణంలో బషీర్ స్పిన్ భారత్ను పదేపదే కష్టాల్లోకి నెట్టేసింది. జట్టు స్కోరు 86 పరుగుల వద్ద గిల్ను బషీర్ ఎల్బీగా అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రజత్ పటిదార్ (17) క్రీజులోకి రాగా... జైస్వాల్ 89 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. కానీ మరోవైపు పటిదార్ బషీర్కే వికెట్ అప్పగించాడు. టీ విరామానికి ముందు అనుభవజు్ఞడైన ఆల్రౌండర్ జడేజా (12; 2 సిక్సర్లు)ను అవుట్ చేయడం ద్వారా బషీర్ భారత్ను చావుదెబ్బ తీశాడు. 131/4 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. ధ్రువ్ నిలకడ ఆఖరి సెషన్లో కూడా స్పిన్ హవానే కొనసాగింది. దీంతో భారత్ 47 పరుగుల వ్యవధిలో మరో మూడు వికెట్లను కోల్పోయింది. ముందుగా జట్టు స్కోరు 150 పరుగులు దాటిన కాసేపటికి యశస్విని బషీర్ బౌల్డ్ చేశాడు. ఇది జట్టును కోలుకోనివ్వలేదు. దాంతో స్వల్ప వ్యవధిలో సర్ఫరాజ్ (14), అశ్విన్ (1)లను హార్ట్లీ పెవిలియన్ చేర్చాడు. 177 స్కోరు వద్ద 7 వికెట్లను కోల్పోయిన దశలో ధ్రువ్ జురెల్ (58 బంతుల్లో 30 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్), కుల్దీప్ (72 బంతుల్లో 17 బ్యాటింగ్; 1 ఫోర్) చూపించిన తెగువ భారత్ను ఆలౌట్ కాకుండా ఆపగలిగింది. ఇద్దరు 17.4 ఓవర్ల పాటు ప్రత్యర్థి స్పిన్, పేస్కు ఎదురునిలిచి అబేధ్యమైన 8వ వికెట్కు 42 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్: 353 భారత్ తొలిఇన్నింగ్స్: యశస్వి (బి) బషీర్ 73; రోహిత్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 2; శుబ్మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బషీర్ 38; పటిదార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బషీర్ 17; జడేజా (సి) పోప్ (బి) బషీర్ 12; సర్ఫరాజ్ (సి) రూట్ (బి) హార్ట్లీ 14; జురెల్ బ్యాటింగ్ 30; అశ్విన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హార్ట్లీ 1; కుల్దీప్ బ్యాటింగ్ 17; ఎక్స్ట్రాలు 15; మొత్తం (73 ఓవర్లలో 7 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–4, 2–86, 3–112, 4–130, 5–161, 6–171, 7–177. బౌలింగ్: అండర్సన్ 12–4–36–1, రాబిన్సన్ 9–0–39–0, బషీర్ 32–4–84–4, హార్ట్లీ 19–5–47–2, రూట్ 1–0–1–0. -
వీణామాలిక్కు 26 ఏళ్ల జైలుశిక్ష
ఇస్లామాబాద్: దైవ దూషణతో కూడిన కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు పాక్ మీడియా గ్రూప్ జియో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రె హ్మాన్, నటి వీణామాలిక్, ఆమె భర్త బషీర్, టీవీ యాంకర్ షయి ష్టా వాహిదిలకు 26ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ యాంటీ టైజమ్ కోర్టు తీర్పు చెప్పింది. జైలుశిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. -
మడకశిరలో లాకప్ మరణం
మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర పోలీస్స్టేషన్లో మంగళవారం లాకప్ డెత్ జరిగింది. మడకశిర మండలం కల్లుమర్రి గ్రామానికి చెందిన బషీర్ (35) లాకప్లో మరణించాడు. విషయం తెలియగానే మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. స్థానిక ఎస్ఐ సద్గురుడు, మరో నలుగురు కానిస్టేబుళ్లు కలిసి బషీర్ను కొట్టి చంపారని ఆరోపించారు. తీవ్రతను గమనించిన ఎస్ఐ, కానిస్టేబుళ్లు అక్కడి నుంచి ఉడాయించారు. గత నెల 12న మడకశిరలో 20 టన్నుల ఐరన్ రాడ్ల అపహరణ కేసులో బషీర్ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు అర్ధరాత్రి బషర్ లాకప్లో ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే.. బషీర్ను పోలీసులు గత శుక్రవారమే స్టేషన్కు తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యుల కథనం. కాగా, అనంతపురం ఎస్పీ సెంథిల్కుమార్ మడకశిర ఎస్ఐ సద్గురుడుతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement