-
పంట కాలువలోకి దూసుకెళ్లిన ఆటో
పి.గన్నవరం: మండలంలోని రాజవరం–పొదలాడ రోడ్డులో 11 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ ప్రధాన పంటలోకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతి చెందగా, నలుగురికి గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఎల్.గన్నవరం శివారు నడిగాడి, పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లంక గ్రామాలకు చెందిన 11 మంది కూలీలు వరికోతల నిమిత్తం ఎల్.గన్నవరం నుంచి ఆటోలో జి.పెదపూడికి వెళ్తున్నారు. ఈదరాడకు చెందిన కాండ్రేగుల సత్య హేమంత్, పొదలాడ గ్రామానికి చెందిన కె.సింహాచలం మోటారు సైకిల్పై రావులపాలెం నుంచి మేకను తీసుకువస్తున్నారు. బెల్లంపూడి పెట్రోలు బంకు సమీపంలో మేక కదలడంతో మోటారు సైకిల్ను ఆపారు. దీంతో వెనుక వస్తున్న మరో మోటారు సైకిల్ మేక ఉన్న మోటారు సైకిల్ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. అదే సమయంలో ఎదురుగా కూలీలతో వస్తున్న ఆటో మోటారు సైకిల్ను ఢీకొట్టి పంట కాలువలోకి బోల్తా పడింది. ఈక్రమంలో ఈతకోట నుంచి వస్తున్న నర్శింహరాజు, ఊడిమూడికి చెందిన కొల్లు గోవింద్, కొల్లు చిన్న కాల్వలోకి దూకి నీట మునిగిపోతున్న డ్రైవర్ రామకృష్ణతో సహా 11 మందిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. వీరికి మోటారుసైక్లిస్టు సత్యహేమంత్ సాయం అందించాడు. ఈ ప్రమాదంలో నీటమునిగిన నడిగాడికి చెందిన రాపాక ఆదిలక్ష్మి (65) మరణించింది. గాయాలపాలైన అయోధ్యలంక కూలీలు మోసుగంటి సుహాసిని, మానుకొండ ఆదిలక్ష్మి, మానుకొండ భాగ్యవతి, డ్రైవర్ రామకృష్ణను అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రాణాలకు తెగించి కూలీలను కాపాడిన ముగ్గురినీ పలువురు అభినందించారు. ఆదిలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పి.గన్నవరం ఎస్సై పి.వీరబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా : తొమ్మిది మందికి గాయాలు
సీతంపేట : మండలంలోని పూతికవలస పంచాయతీ పరిధిలోని బంజారుగూడకు సమీపంలో ఆటో బోల్తా పడిన సంఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈతమానుగూడకు చెందిన 12 మంది గిరిజనులు ఆటోలో పూతికవలస వైపు బుధవారం వస్తుండగా మార్గమధ్యలో బంజారుగూడ డౌన్ దిగుతుండగా అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎ.కృష్ణారావు, వి.వెంకటేష్, ఎ.లక్కమ్మ, వి.ఈస్టర్, వి.నాగమ్మ, పి.పస్టు, ఎ.చంపి, ఎ.దమయంతి, ఎ.లక్ష్మయ్యలకు గాయాలయ్యాయి. వీరందరినీ మర్రిపాడు పీహెచ్సీకి తరలించగా అక్కడ వైద్యాధికారి చంద్రమౌళి వైద్యసేవలు అందించారు. వీరిలో చంపి, దమయంతి, లక్ష్మయ్యలకు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన వైద్య సేవల కోసం పాలకొండ ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. -
ఆటో బోల్తా : తొమ్మిది మందికి గాయాలు
సీతంపేట : మండలంలోని పూతికవలస పంచాయతీ పరిధిలోని బంజారుగూడకు సమీపంలో ఆటో బోల్తా పడిన సంఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈతమానుగూడకు చెందిన 12 మంది గిరిజనులు ఆటోలో పూతికవలస వైపు బుధవారం వస్తుండగా మార్గమధ్యలో బంజారుగూడ డౌన్ దిగుతుండగా అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎ.కృష్ణారావు, వి.వెంకటేష్, ఎ.లక్కమ్మ, వి.ఈస్టర్, వి.నాగమ్మ, పి.పస్టు, ఎ.చంపి, ఎ.దమయంతి, ఎ.లక్ష్మయ్యలకు గాయాలయ్యాయి. వీరందరినీ మర్రిపాడు పీహెచ్సీకి తరలించగా అక్కడ వైద్యాధికారి చంద్రమౌళి వైద్యసేవలు అందించారు. వీరిలో చంపి, దమయంతి, లక్ష్మయ్యలకు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన వైద్య సేవల కోసం పాలకొండ ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. -
ఆటో ఢీకొని చిన్నారి మృతి
నాగోలు: ఆటో ఢీకొని చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మన్సూరాబాద్ వినాయక్నగర్కు చెందిన పి.సోమయ్య కూతురు పి.అనూష (ఒకటిన్నర సంవత్సరాలు) ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆటో (ఏపీ22 డబ్ల్యు 4945) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అనూష తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి అనూష మృతి చెందింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement