ఇద్దరు విద్యార్థుల అదృశ్యం | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

Published Sat, Feb 28 2015 2:03 PM

two students missing in hyderabad

హైదరాబాద్ : మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. సెంట్‌ఆన్స్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న మనీష్, పవన్ శుక్రవారం స్కూలుకు వెళుతున్నామని ఇంటి నుంచి బయలుదేరారు. సాయంత్రానికి కూడా ఇల్లు చేరకపోయేసరికి తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యాన్ని అడిగారు.

స్కూలు రాలేదని టీచర్లు చెప్పటంతో బంధువులు, పరిచయస్తుల ఇళ్లలో వెదికారు. ఆచూకీ దొరకక శనివారం మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించగా రైల్వేట్రాక్ వద్ద సదరు విద్యార్థుల స్కూల్ బ్యాగులు లభ్యమవటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement