సాక్షి, హైదరాబాద్: పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉన్న గిరిజన తండాల్లో ఉచిత భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏయే జిల్లాల్లో, ఏయే ప్రాంతాల్లో ఈ ఉచిత భోజన పథకం అవసరముంది, ఎన్ని సెంటర్లలో అమలు చేయాలి, ఈ బాధ్యతను ఎవరికి అప్పగించాలనే వివరాలతో సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 5కే భోజన పథకం విజయవంతంగా అమలవుతోంది. అన్నార్తుల ఆకలి తీర్చేదిగా ప్రశంసలు అందుకుంటున్న ఈ పథకం స్ఫూర్తితో... దుర్భర పరిస్థితులున్న గిరిజన తండాల్లో ఉచిత భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో శిశు మరణాలు, పౌష్టికాహార లోపంతో వచ్చే వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తోంది.
ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో మారుమూలన ఉన్న గిరిజన తండాల్లో ఈ దుర్భర పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి తండాలను ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టుగా ఉచిత పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
అన్ని వయసుల వారికీ..
ప్రస్తుతం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం అమల్లో ఉంది. గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లలకు ప్రతిరోజు ఒకపూట అన్నం, పప్పు, పాలు, గుడ్డు అందిస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఈ రెండింటినీ కలిపి.. గిరిజన తండాల్లో అన్ని వయసుల వారికి ఉచిత భోజనం అందించేలా కొత్త పథకాన్ని రూపొందించనున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చవుతుంది, ఎంత మందికి భోజనం వడ్డించాల్సి ఉంటుందన్న వివరాలను అధ్యయనం చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన సోమేష్కుమార్ ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 5 భోజన పథకం రూపకల్పనతోపాటు అమలు తీరు తెన్నులపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. దీంతో తండాల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా ఉచిత భోజన పథకంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
గిరిజన తండాల్లో ఉచిత భోజనం
Published Tue, Feb 9 2016 2:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement