నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని కోమలంచలో నివాసం ఉంటున్న కుర్మ బాలమణి కొడుకు రాజు తమ తండాలో దొంగతనం చేశాడని కోమలంచ తండావాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని చితకబాదడంతో ఆ దెబ్బలు తట్టుకోలేక తన తల్లికి ఇచ్చానని చెప్పాడు. దీంతో అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో రాజును తీసుకుని ముగ్గురు కానిస్టేబుళ్లతో ఎస్ఐ వారి ఇంటికి వెళ్లారు.
ఇద్దరు కానిస్టేబుల్స్ను ఇంటి బయట ఉంచి ఇల్లంతా సోదా చేశారు. అయినా ఏమీ దొరక్కపోవడంతో నీ కొడుకు ఇచ్చిన బంగారం, డబ్బులు ఎక్కడ పెట్టావు అంటూ తనను చితకబాదారని రాజు తల్లి ఆరోపిస్తున్నది. ఎస్ఐ తన లాఠీతో వాతపడేలా కొట్టాడని బాలమణి చెప్పింది. పోలీసు దెబ్బలకు ఆమె కనీసం లేచి నిలబడలేని స్థితిలో ఉంది. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు..
ఇద్దరు కానిస్టేబుల్స్ను ఇంటి బయట ఉంచి ఇల్లంతా సోదా చేశారు. అయినా ఏమీ దొరక్కపోవడంతో నీ కొడుకు ఇచ్చిన బంగారం, డబ్బులు ఎక్కడ పెట్టావు అంటూ తనను చితకబాదారని రాజు తల్లి ఆరోపిస్తున్నది. ఎస్ఐ తన లాఠీతో వాతపడేలా కొట్టాడని బాలమణి చెప్పింది. పోలీసు దెబ్బలకు ఆమె కనీసం లేచి నిలబడలేని స్థితిలో ఉంది. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు..