సాక్షి, హైదరాబాద్: శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని రెండు రోజుల్లో నిలిపేయాలన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాలపై న్యాయపోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు, న్యాయ నిఫుణులతో చర్చించింది. బోర్డు నిర్ణయం తెలిసిన తర్వాత ఈ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులతో విడతలవారీగా చర్చలు జరిపారు. శనివారం దీనిపై మరోమారు చర్చించాలని, ఒకట్రెండు రోజుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. న్యాయ నిపుణులతో పూర్తిస్థాయి చర్చల తర్వాతే శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి కొనసాగింపుపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయంలో న్యాయపోరాటానికి సిద్ధమని నీటి పారుదల మంత్రి హరీశ్రావు స్వయంగా వెల్లడించారు. అలాగే బోర్డు నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తూ బోర్డుకు రాష్ర్టం తరఫున నీటిపారుదల శాఖ ప్రత్యుత్తరం పంపింది. ఏపీ వ్యవహారంపై తామిచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకుండా, పూర్తి ఏకపక్షంగా, అనైతికంగా నిర్ణయం తీసుకున్నారని లేఖలో ప్రస్తావించినట్లుగా తెలిసింది.
అధికారులతో సీఎం అత్యవసర భేటీ
కృష్ణా బోర్డు నిర్ణయం వెలువడిన వెంటనే అధికారులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ నిర్వహించారు. మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్లతో పాటు అడ్వకేట్ జనరల్ హాజరైనట్లు సమాచారం. తెలంగాణ లేవనెత్తిన అంశాలను, అవసరాలను, ప్రయోజనాలను పట్టించుకోకుండా నిర్ణయం తీసుకున్నదని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి కేటాయించిన 34 టీఎంసీలకు మించి అధికారికంగా 62 టీఎంసీలు, అనధికారికంగా 90 టీఎంసీల మేర నీటిని వాడుకున్నారని ఫిర్యాదు చేసినా బోర్డు పట్టించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. చట్టంలో పేర్కొన్న మేరకు విద్యుత్ వాటా ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వని బోర్డు.. తెలంగాణ పంటలకు అవసరమైన రీతిలో, తమకున్న హక్కుల మేరకు విద్యుదుత్పత్తి చేస్తుంటే అడ్డుకోవడం సబబు కాదని అధికారులు వివరించారు. నీటి పంపకాలను నిర్ణయించే హక్కు బోర్డుకు లేదని, కేవలం కేటాయించిన నీటి వాడకాలపై పర్యవేక్షణకే పరిమితమని చట్టంలో పేర్కొన్న అంశాన్ని న్యాయవాదులు కేసీఆర్ దృష్టికి తేగా బోర్డు ఆదేశాలపై న్యాయ పోరాటానికి ఆయన మొగ్గు చూపినట్లు తెలిసింది.
ఒత్తిళ్లకు తలొగ్గిన బోర్డు: హరీశ్
బోర్డు నిర్ణయం ఏకపక్షం, అనైతికమని మంత్రి హరీశ్రావు అన్నారు. న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని, రాష్ర్ట హక్కులు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటించారు. ఆదేశాల విషయంలో కేంద్రం, ఏపీ ఒత్తిళ్లకు బోర్డు తలొగ్గిందని, పరిధిని మించి ప్రవర్తించిందని ఆరోపించారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని కొనసాగించడంపై న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీశైలంలో నీటి నిల్వలను కాపాడాలంటున్న ఏపీ, హంద్రీనీవా ద్వారా ఇప్పటికీ నీటిని తరలిస్తోందని, అసలు కేటాయింపులే లేని చోట నీటిని ఎలా తీసుకుంటందని మంత్రి ప్రశ్నించారు. బోర్డు నిర్ణయంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు ఎంత ఖర్చయినా విద్యుత్ కొనుగోలు చేసి పంటలను కాపాడతామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ బీజేపీ నేతలు తమ వైఖరేంటో వెల్లడించాలని కూడా హరీశ్ డిమాండ్ చేశారు. వారి కేంద్ర నాయకత్వాన్ని నిలదీయాలని సూచించారు. రాష్ర్ట ప్రభుత్వం 30 లేఖలు రాసినా, వంద దరఖాస్తులు పెండింగ్లో ఉన్నా అలాంటివేమీ లేవంటూ కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్గోయల్ వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు.
బోర్డుకు నిరసన లేఖ
బోర్డు ఆదేశాలపై నిరసన తెలియజేస్తూ రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యుత్తరం పంపింది. ఈ మేరకు వెంటనే లేఖ రాయాలని సీఎం ఆదేశించడంతో సమావేశం తర్వాత ముఖ్య కార్యదర్శి జోషి, ఈఎన్సీ మురళీ అప్పటికప్పుడు దాన్ని రూపొందించారు. అందులో బోర్డు చర్యలను తీవ్రంగా ఆక్షేపించినట్లు తెలిసింది. అలాగే కేంద్ర జల సంఘం, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసేందుకూ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
న్యాయపోరాటానికే మొగ్గు!
Published Sat, Nov 1 2014 1:55 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..
టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్
రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
రూ.100 వరకు క్యాష్బ్యాక్ ప్రకటించిన పేటీఎం
టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు దోచిన సొమ్ము అంతా ప్రజలదే..
ప్రత్యేక హోదా కూడా అమ్మేశారు
నయనతారకు క్రేజీ ఛాన్స్.. భారీగా డిమాండ్ చేస్తోన్న భామ!
తప్పక చదవండి
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement