భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల గోదావరి వరదలతో తీవ్రంగా నష్టపోయిన ముంపు రైతులకు ఏపీ ప్రభుత్వమే పంట నష్టపరిహారం ఇస్తుందని స్పష్టత వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికారులు చేస్తున్న సర్వేను ఏపీ ప్రభుత్వం ఏ మేరకు ప్రాతిపదికగా తీసుకుంటుందన్న దానిపై రైతుల్లో కొంత అనుమానం నెలకొంది.
ముంపు మండలాల విలీనంపై ఫైనల్ గెజిట్ ఇచ్చినా..పాలనా వ్యవహారాలపై ఉభయ గోదావరి జిల్లాల అధికారులు పెద్దగా దృష్టి సారించలేదు. వరద నష్టంపై ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నా వీరిపై తగిన అజమాయిషీ చేసే అధికారులు లేకపోవటంతో ముంపు మండలాల్లో ఇది అస్తవ్యస్తంగా సాగుతోంది. రేపోమాపో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న రెవెన్యూ అధికారులు పంట నష్టం అంచనాలపై కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నారని రైతులు బాహటంగానే అంటున్నారు.
పంటలు నష్టపోయిన తమకు తగిన పరిహారం అందుతుందో లేదోననే ఆందోళన రైతుల్లో నెలకొంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 14 మండలాల్లో 8,967 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లుగా జిల్లా అధికారులు లెక్క తేల్చారు. ఇందులో భద్రాచలం డివిజన్లోని భద్రాచలం రూరల్, కూనవరం, చింతూరు, వీఆర్పురం, పాల్వంచ డివిజన్ బూర్గంపాడులోని ఆరు రెవెన్యూ గ్రామాలతో పాటు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఏపీలో విలీనం అయ్యాయి. ఏపీలో విలీనం అయిన ఏడు మండలాల్లో 5,308 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనికి నష్ట పరిహారం ఏపీ అధికారులే ఇవ్వాల్సి ఉంటుంది. పంట నష్టం ఎంత చెల్లించాలనే దానిపై ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.
గతే డాది నష్ట పరిహారం ఇచ్చేదెవరు?
గతేడాది గోదావరి వరదలతో ఇప్పటికంటే ఎక్కువే పంట నష్టం జరిగింది. కానీ నష్టపోయిన రైతులు, ఇళ్లు కూలిపోయిన బాధితులకు ఇప్పటి వరకు నయాపైసా సాయం అందలేదు. రెండు రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో ఏడు మండలాల్లోని బాధిత రైతులకు గతేడాది నష్ట పరిహారం ఎవరు ఇస్తారనే దానిపై స్పష్టత లేదు. ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పంట రుణాల మాఫీకి హామీ ఇచ్చాయి. ఇప్పటికే తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ మొదలైంది. కానీ జిల్లాలో రుణం ఆ ఏడు మండలాలకు చెందిన రైతులు, ప్రస్తుతం ఏపీలోకి వెళ్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ముంపు రైతులకు ఎటువంటి భరోసా రాలేదు.
పోలవరం ముంపు భూములకు పరిహారం లేనట్లే
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పునరావాస ప్యాకేజీ చెల్లించిన భూముల్లోని పంటలకు నష్ట పరిహారం ఇచ్చేది లేదని అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసమని ఏపీ విలీనమైన ఏడు మండలాల్లో 74,751.96 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటికే 45,756.90 ఎకరాలుకు పునరావాస ప్యాకేజీ పంపిణీ చేశారు. కానీ ఈ భూముల్లోని పంటలకే ఎక్కువ నష్టం జరిగింది. పునరావాస ప్యాకేజీ తీసుకున్నా ఇంకా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోవటంతో వేలాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి రైతులు పంటలు సాగుచేస్తున్నారు. కానీ ఈ భూములకు నష్ట పరిహారం ఇచ్చేది లేదని ఏపీ ప్రభుత్వం చెబుతుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
ముంపు రైతుకు ముప్పేనా?
Published Wed, Sep 24 2014 2:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement