మిరుదొడ్డి: బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నెలకు రూ. 1,000ల జీవన భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు బీడీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం మిరుదొడ్డిలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల స్వామి మాట్లాడుతూ బీడీ కార్మికుల కోసం రూ. వెయ్యి జీవన భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందన్నారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు నెలకు రూ. 1,000 జీవన భృతి చెల్లిస్తామని ప్రకటించడంతో కార్మికుల్లో ఆశలు రేకెత్తాయన్నారు. అయితే బడ్జెట్లో మాత్రం జీవనభృతికి నిధులు కేటాయించక పోవడంతో కార్మికుల ఆశలు సన్నగిల్లే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కార్మికుల ఆశలను వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవన భృతి చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గతంలో బీడీ కార్మికులు 32 రోజుల పాటు సమ్మె చేసి సాధించుకున్న 41జీఓను వెంటనే అమలు చేయాలని కోరారు. బీడీ కార్మికులకు నెలకు 26 రోజుల పని కల్పించేలా యాజమాన్యాలు చొరవ చూపాలన్నారు. కార్మికుల పిల్లలకు గత మూడు సంవత్సరాలుగా ఉపకార వేతనాలు అందడం లేదన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు తహశీల్దార్ వసంత లక్ష్మికి వినతి పత్రం అందించారు.
బీడీ కార్మికుల అందోళనకు డీబీఎఫ్ రాష్ట్ర నాయకులు ముత్యాల భూపాల్ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ దుబ్బాక డివిజన్ కార్యదర్శి గొడ్డుబర్ల భాస్కర్, మండల కార్యదర్శి భిక్షపతి, బీడీ వర్కర్స్ మండల కార్యదర్శి తోకల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రమేష్, రాజు, నర్సింలు, సాధిక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
బీడీ కార్మికులకు రూ.వెయ్యి చెల్లించాలి
Published Sat, Dec 27 2014 11:04 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
‘అర్బన్’ పోరు రూ.3.55 కోట్లు
ఇడ్లీ పిండిపైనా 18 శాతం జీఎస్టీ: అప్పిలేట్ అథారిటీ
కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్బాస్ బ్యూటీ (ఫోటోలు)
వాన నీటిలో ‘పరుపు’ ప్రయాణం.. వీడియో వైరల్
బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్ అరెస్ట్
దెయ్యం సినిమాలో మృణాల్.. మరి ఒప్పుకొంటుందా?
సంతకం చేయండి.. మార్పు డిమాండ్ చేయండి
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
వయనాడ్కే రాహుల్ టాటా!
తప్పక చదవండి
- చెల్లిని కాపాడబోయి నీట మునిగిన అక్క మృతి
- ఉబ్బసం రోగులకోసం చేప ప్రసాదం
- మావోయిస్టుల ఏరివేతకు ‘జల్శక్తి’
- T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
- పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
- ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
- పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. పోలీస్ డాగ్స్కు అరుదైన గౌరవం
- పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ ప్రయోగం
- Russia: భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత
Advertisement