హన్మకొండ కల్చరల్, న్యూస్లైన్ : ప్రముఖ కూచిపూడి నాట్యాచారిణి వెంపటి నాగేశ్వరి ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కిడ్నీలు పాడై నెలరోజులుగా బాధప డుతున్న ఆమెకు గుండెపోటు రావడంతో మరణించారు. తన జీవితాన్నంతా నాట్యశిక్షణకే వెచ్చించారు. నాగేశ్వరికి టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పిన్నా శివకుమార్, జనప్రియ గానసభ కార్యదర్శి నర్సింహారావు, సంగీత ఉపాధ్యాయులు వద్దిరాజు నివేదిత తదితరులు నివాళుల ర్పిం చారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోవడం ఓరుగల్లు కళా లోకానికి తీరని లోటు అని వారు పేర్కొన్నారు.
నేపథ్యం..
నాగేశ్వరి ఓరుగల్లుకు చెందిన సాంప్రదాయ కుటుంబంలో 1957 అక్టోబర్ 24న జన్మించారు. జిల్లాకు కూచిపూడి నాట్యాన్ని పరిచయం చేయడంతోపాటు 43 సంవత్సరాల పాటు సేవలందించి నాట్య కళాకారిణులకు స్ఫూర్తిగా నిలి చారు. ఆమె తండ్రి కోదండరామశాస్త్రి, తాత వెంపటి వెంకటనారాయణ కూచిపూడి త్రిమూర్తులలో ఒక్కరు. తాతగారి పేరిట నాగేశ్వరి 1979లో వరంగల్లో శ్రీవెంపటి వెంకటనారాయణ కాకతీయ నృత్యకళాక్షేత్రాన్ని స్థాపించారు.
నాట్యాచార్యులలో ఆధ్యులు, ప్రముఖ నాట్యాచార్యులైన ఉమావైజయంతిమాల, భ్రమరాంబ, గీత, రాజ్యలక్ష్మి తది తర కూచిపూడి కళాకారిణులు నాగేశ్వరి వద్ద నేర్చుకున్న విద్యార్థులే. ఇంకా అనేకమంది శిష్యులున్నారు. కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. విద్యారణ్యపురి ప్రభుత్వ నృత్యసంగీత కళాశాల ప్రిన్సిపాల్ కుప్పా పద్మజ, బాలభవన్ ప్రిన్సిపాల్ ఝూన్సీ, నృత్యస్రవంతి బాధ్యురాలు తాడూరి రేణుక తదితరులు నాగేశ్వరి వద్ద శిక్షణ పొందిన వారే. వెంపటి నాగేశ్వరి భక్తప్రహ్లద, గంగాగౌరి సంవాదం, భక్తశిరియాల వంటి అనేక నృత్యనాటికలకు దర్శకత్వం వహించారు. ఇవి దూరదర్శన్లో ప్రసారమయ్యాయి.
నాగేశ్వరి పేరిట అవార్డు ఏర్పాటు చేయాలి
వెంపటి నాగేశ్వరి నాకు గురువు. ఆమె ఆకస్మిక మరణం జిల్లా సాంస్కృతిక రంగానికి తీరని లోటు. వెంపటి నాగేశ్వరి పేరిట జిల్లాలో అవార్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
- కుప్పా పద్మజ, ప్రిన్సిపాల్ విద్యారణ్య సంగీత నృత్య కళాశాల
‘నాగేశ్వరి’ మృతి కళా లోకానికి తీరని లోటు
Published Mon, Jun 9 2014 4:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement