కామారెడ్డి నియోజకవర్గ ప్రజలను పులి భయపెడుతోంది. భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో అడుగుజాడలు కనిపించాయి. దోమకొండలో ఇద్దరు వ్యక్తులు తాము పులిని చూశామని పేర్కొనడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
- పులిని చూశానంటున్న మహిళ
- భిక్కనూరు సౌత్ క్యాంపస్లో అడుగుజాడలు!
- భయాందోళనల్లో మూడు మండలాల ప్రజలు
- రంగంలోకి అటవీ అధికారులు
దోమకొండ : మండల కేంద్ర శివారులో బుధవారం మళ్లీ పులి కలకలం సృష్టించింది. దీంతో రైతులంతా ఉలిక్కిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన రైతు కదిరె వెంకట్రెడ్డి తన భార్య ఇందిరతో కలిసి బుధవారం ఉదయం మల్లన్న గుడి వెనకాల గల వ్యవసాయ భావి వద్దకు వెళ్లాడు. ఇందిర బంతిపూలు తెంపుతుండగా వెంకట్రెడ్డి పొలానికి నీరు పెట్టడానికి వెళ్లాడు. పూలు తెంపిన అనంతరం ఇందిర భర్త దగ్గరికి వెళ్లడానికి బంతి పూల చెట్ల మధ్యలోంచి లేవగానే పులి కనిపించింది. దీంతో భయపడి చెట్ల మధ్యలోనే దాక్కుంది. భయం వల్ల స్పృహతప్పి పడిపోయింది. కొద్దిసేపటికి అటుగా వచ్చిన వెంకట్రెడ్డి ఆమెను లేపాడు. దీంతో ఆమె విషయం చెప్పింది.
వెంటనే వారు అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయా రు. బుధవారం ఉదయం మల్లన్న గుడి శివారులో పులి కనిపించిందని ఆలయ వాచ్మన్ నేతుల మల ్లయ్య కూడా తెలిపాడు. తాను అక్కడే ఉండి రైతులు పులి వెళ్లిన వైపు వెళ్లకుండా చూశానన్నారు. రైతులు ఈ సమాచారాన్ని అటవీ అధికారులకు అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వేణు, బీట్ ఆఫీసర్ పారూఖ్ల ఆధ్వర్యంలో ఆరుగురు కానిస్టేబుళ్లు మల్లన్న గుడి వెనకాల ఉన్న పొలాల్లో పులికోసం గాలించారు. పొలాల వద్ద గడ్డి ఉండడంతో పులి అడుగులను గుర్తించలేకపోతున్నామని వారు పేర్కొన్నారు.
మాచారెడ్డి అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిన రెండేళ్ల వయసున్న చిరుతపులి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోందన్నారు. రైతులు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి వెంట కర్రలు తీసుకొని వెళ్లాలని సూచించారు. పులి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు. పులిని బం ధించడానికి మెదక్లో రెస్క్యూ టీం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. దోమకొండ శివారుతో పాటు భిక్కనూరు మండలంలోని జంగంపల్లి, పొందుర్తి, మాచారెడ్డి మండలంలోని పల్వంచ, ఎల్పుగొండ తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అమ్మో పులి.. వచ్చెను మళ్లీ
Published Thu, Oct 2 2014 4:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement