జలచర జీవుల్లో ఓ మగ చేప ఆడ చేప పెట్టిన గుడ్లను నోటిలో భద్ర పరచుకుంటుంది. పిల్లలు అయ్యే దాకా ఆహారం కూడా తీసుకోదు. ఒక్కోసారి ఆకలి తట్టుకోలేక మృత్యువాత కూడా పడుతుంది. తన సంతాన్ని కాపాడుకోవడానికి ఆ మగ చేప అంతటి త్యాగానికి సిద్ధమవుతుంది. కానీ కొందరు మనుషులు సభ్య సమాజం తలదించుకునేలా తమ సంతానాన్నే చేజేతులా బలి తీసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం రవీందర్. కట్టుకున్న భార్య, రెండేళ్ల కూతుర్ని కర్కశంగా హతమార్చాడు.
- అదృశ్యమైన తల్లి, కూతురు హత్య
- బావతో కలిసి హత్యలకు పాల్పడిన భర్త
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతన్న
రాయికోడ్: మండలంలోని నాగన్పల్లి గ్రా మానికి చెందిన స్వప్న (23) ఆమె కూ తురు ఐశ్వర్య (2) అదృశ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. అదృశ్యమైన తల్లి, కూతురు హత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న రాయికోడ్ విలేకరులకు తెలిపారు.
రాయికోడ్ మండలం నాగన్పల్లి గ్రామానికి చెందిన బీ రవీందర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో తన క్లాస్మేట్ అయిన వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన స్వప్నను ప్రేమించి 2011లో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రవీందర్ తల్లిదండ్రులు కొడుకు, కోడలును తమ ఇంట్లో ఉంచుకోవడానికి నిరాకరించారు. దీంతో గ్రామపెద్దలు సహకారంతో నాగన్పల్లిలో రవీందర్ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కొంత కాలం తరువాత రవీందర్, అతని తల్లి లక్ష్మమ్మ, తండ్రి నాగయ్య కట్నం కోసం స్వప్నను వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆమె 2013లో రాయికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లిపోంది. అప్పటికే గర్భిణి అయిన ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కూతురు ఐశ్వర్య వయస్సు రెండు సంవత్సరాలు.
జహీరాబాద్ కోర్టులో అదనపు కట్నం వేధింపుల కేసుకు సంబంధించి వాదనలు కొనసాగుతుండగా రవీందర్ లోక్ అదాలత్లో కేసును రాజీ చేసుకున్నాడు. స్వప్న కాపురానికి అంగీకరించి రవీందర్తో నాగన్పల్లికి వెళ్లింది. రాజీ అనంతరం లోక్ అదాలత్పేషిలకు స్వప్న హాజరు కాకపోవడంతో ఆమె తల్లి సాంబ లక్ష్మి కూతురు ఏదీ అని స్పప్న తల్లిదండ్రులు అల్లుడి రవీందర్ను ప్రశ్నించారు. తనకు తెలియదని చెప్పడంతో ఈ నెల 20న రవీందర్పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రవీందర్ను అరెస్ట్ చేసి విచారించగా తల్లి, కూతురు హత్యకు గురైనట్లు తేలింది. జోగిపేట మండలం నేరేడుకుంటకు చెందిన తన బావ కిష్టయ్యతో కలిసి మే 15న నాగన్పల్లి నుంచి స్వప్న నేరేడుకుంట సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు తీసుకువెళ్లి చున్నీని మెడకు బిగించి హత్య చేశాడు. శవాన్ని అక్కడే తగులబెట్టి ఎముకలను మంజీర నదిలో కలిపేశారు. మే 18న అభం శుభం తెలియని చిన్నారి ఐశ్వర్య(2)ను నేరేడుకుంట గ్రామశివారులోని నిర్మానుష్య ప్రాంతంలో గొంతు నులిమి హత్య చేశారు. శవాన్ని అక్కడే తగులబెట్టినట్లు బావ, మరిది రవీందర్, కిష్టయ్య తమ విచారణలో ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు వివరించారు. కార్యక్రమంలో జహీరాబాద్ రూరల్ సీఐ రఘు, స్థానిక ఎస్ఐ శివప్రసాద్, సిబ్బంది అంజిరెడ్డి, శ్రీనివాస్, సికిందర్ ఉన్నారు.
కాపాడాల్సినవాడే కడతేర్చాడు
Published Sun, Aug 30 2015 11:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement