- క్రమశిక్షణ చర్యల పేరిట అంగన్వాడీలపై వేధింపులు
- ప్రవేశాలు తక్కువ ఉన్న కేంద్రాలను మూసివేయాలని సర్కారు ఆదేశాలు
- ప్లేస్కూళ్లను కట్టడి చేయకుండా ప్రవేశాలెలా పెరుగుతాయంటున్న వర్కర్లు
సాక్షి, హైదరాబాద్: లాలించే మనుషులపై పాలించేవారు వేట మొదలు పెట్టారు. అమ్మగా, ఆయాగా చిన్నారుల ఆలనాపాలనా చూసుకునే అంగన్వాడీలపై ప్రభుత్వం వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి అనేక రకాల సాకులను వెతుకుతూ కత్తులు నూరుతోంది. దీనిలో భాగంగా జీవో 14ను వాడుకునేందుకు సిద్ధమైంది.
దీంతో అంగన్వాడీలకు ఉద్యోగభద్రత లేకుండా పోతోంది. వారి పరిస్థితి దినదినగండంగా మారుతోంది. ఇటీవల వారికి గౌరవ వేతనం పెంచడంతో ఆర్థికభారం పెరిగిందని, కొన్ని అంగన్వాడీ కేంద్రాలను ఎత్తేసి దీనికి సంబంధించిన లెక్క సరిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్)లో పనిచేస్తున్న అంగన్వాడీవర్కర్లు, సహాయకుల ఉద్యోగాలు ఎప్పుడు ఊడతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో నియామకమైన కార్యకర్తలను తొలగించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఆయా పోస్టులను తమ వర్గంవారికి ఇప్పించుకునేందుకు ప్రస్తుతం పనిచేస్తున్నవారిపై లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
స్థానిక నేతల ఒత్తిడుల మేరకు జీవో 14ను సాకుగా చూపి అంగన్వాడీలపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిస్తోంది. మరోవైపు లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉన్న కేంద్రాలను మూసివేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది. తగినన్ని ప్రవేశాలు(అడ్మిషన్లు) తీసుకు రాలేకపోయిన ఆయా కేంద్రాల వర్కర్లను, సహాయకులను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. విధులపట్ల నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలను కూడా జీవోలో పేర్కొంది.
ముందస్తు అనుమతి లేకుండా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కేంద్రానికి హాజరు కాకున్నా, కేంద్రానికి వచ్చే 3 నుంచి ఆరేళ్ల చిన్నారుల హాజరు 90 శాతం కన్నా తక్కువగా ఉన్నా తనిఖీ అధికారులు మెమోలు జారీ చేయవచ్చు. ఇలా రెండు, మూడు మెమోలు పొందిన కార్యకర్తలను జీవో 14 ప్రకారం వెంటనే తొలగించవచ్చు. ఆహార నిల్వకు సంబంధించి భౌతిక, బుక్ బ్యాలెన్స్లో తేడా ఉన్నా వెంటనే తొలగించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. జీవోలోని ఇలాంటి అంశాలను ఆసరాగా చేసుకొని స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు అంగన్వాడీ కేంద్రాలపై అధికారులతో ఆకస్మిక తనిఖీలు చేయించి వారి పొట్టగొట్టాలని ప్రయత్నిస్తున్నారని అంగన్వాడీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ప్లేస్కూళ్లను కట్టడి చేయకుండా ప్రవేశాలు ఎలా?
ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ ప్లేస్కూళ్లను నియంత్రించకుండా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశాలను పెంచడం ఏవిధంగా సాధ్యమవుతుందని అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్ల వయస్సున్న చిన్నారులకు అనధికారికంగా అడ్మిషన్లు ఇస్తున్న ఆయా పాఠశాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. ఇక మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులుండే అంగన్వాడీ కేంద్రాలు అన్ని సందర్భాల్లో పరిశుభ్రంగా ఉండడం సాధ్యం కాదంటున్నారు.
ఒకరిద్దరు చిన్నారులు ఉండే ఇళ్లలోనే ప్రతిక్షణం పరిశుభ్రంగా ఉంచేందుకు వీలు కాదని, అలాంటప్పుడు 20-30 మంది చిన్నారులు ఉండే చోట కొంత ఇబ్బందులు ఉంటాయంటున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా అధికారులు శుభ్రత లేదనే సాకుతో తమపై వేటు వేయాలని చూస్తున్నారని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో 14ను రద్దు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నాయి.
అంగన్వాడీలపై వేటుకు వేట!
Published Mon, Oct 5 2015 4:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement