నల్లగొండ అర్బన్ : ఎంసెట్-2014 ఇంజినీరింగ్ విభాగంలో తొలి విడత ప్రవేశ అనుమతులు కోల్పోయిన ఇంజినీరింగ్ కాలేజీలకు బుధవారం సుప్రీం కోర్టు ఇచ్చిన సానుకూల తీర్పు తో రెండవ విడత కౌన్సెలింగ్కు మార్గం సుగమమైంది. సరైన వసతులు, ఫ్యాకల్టీ తదితర లోపాలను ఎత్తిచూపుతూ జేఎన్టీయూ రాష్ట్రంలోని 174 ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్లను నిరాకరించడంతో మొదటి విడత కౌన్సెలింగ్కు అవకాశాన్ని కాల్పోయాయి. ఈ విధంగా జిల్లాలో 34 కాలేజీలు ప్రవేశాలకు దూరమయ్యాయి. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించడం, అక్కడ చుక్కెదరుకావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఆయా కాలేజీలకు రెండవ విడత కౌన్సెలింగ్ జరుపుకునేందుకు కోర్టు సమ్మతించడంతో మళ్లీ ప్రవేశాల కోలాహలం మొదలుకానుంది. కోర్టు తీర్పుతో జిల్లాలో దాదాపు 1500 నుంచి 2000 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందవచ్చునని భావిస్తున్నారు.
1500 మందికి ప్రవేశాలు ?
జిల్లాలో 34 ఇంజినీరింగ్ కాలేజీలు రెండ విడత కౌన్సెలింగ్కు అవకాశం లభించడంతో ఆయా కాలేజీల్లో దాదాపు 1500 నుంచి 2వేల మంది విద్యార్థులు చేరుతారని భావిస్తున్నారు. హైదరాబాద్ తదితర పట్టణాల్లో సీట్లు పొంది పరిస్థితుల ప్రభావంతో చేరలేక డిగ్రీ కోర్సుల్లో చేరిన వారంతా తిరిగి ఇంజినీరింగ్ వైపు రాగలరని ఆశిస్తున్నారు. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని భావించి ఇప్పటికే ఆయా విద్యార్థుల చిరునామాల వేటలో పడిన కాలేజీల యాజమాన్యాలు అడ్మిషన్లకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలి సింది. అంతే కాకుండా జిల్లాలోని దేవరకొండ, కోదాడ, మిర్యాలగూడ, భువనగిరి పరిసర ప్రాంతాల్లోని కొన్ని కాలేజీలు మొదటి విడత కౌన్సెలింగ్కు ముందే కొందరు విద్యార్థులకు వివిధ రకాల ఆశలు చూపి సర్టిఫికెట్లను, ర్యాంక్ కార్డులను సేకరించాయి. కానీ వారికి మొదటి విడతలో ప్రవేశాలు తీసుకునే అవకాశం లభించకున్నా తరగతులు నిర్వహిస్తున్నాయన్న సమాచారం. ఎలాగూ ఆలస్యంగానైనా అనుమతి లభించగలదనే ధీమాతో వారు తరగతులు కొనసాగించారని తెలిసింది.
నవంబర్ 2వ వారం నాటికి ప్రవేశాలు పూర్తి
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రెండవ విడత కౌన్సెలింగ్ అవకాశం పొందిన కాలేజీలు నవంబర్ 2వ వారం నాటికి అడ్మిషన్లను భర్తీ చేసుకోవాలి. మూడవ వారం తరగతులు ప్రారంభించి ఫిబ్రవరి 2వ వారంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల మొదటి సెమిస్టర్ పరీక్షలను, జూన్ 15 నాటికి రెండవ సెమిస్టర్లను పూర్తి చేయాల్సివుంటుంది.
మొదటి విడత కాలేజీలకు నిరాశే..
జిల్లాలో 41 ఇంజినీరింగ్ కాలేజీలుండగా మొదటి విడతలో ఎంజీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీతో పాటు మరో ఆరు ప్రైవేట్ కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్ లభించింది. దీంతో వారు ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను నిర్వహిస్తున్నారు. కొన్ని కోర్సుల్లో సీట్లు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. రెండవ విడతలో అవకాశం వస్తే ఆ సీట్లను భర్తీ చేసుకోవచ్చని ఆశించారు. కానీ సుప్రీం కోర్టు ప్రస్తుతం 34 కాలేజీలకే అవకాశం ఇచ్చింది. వారికి మాత్రమే స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మొదటి విడతలో అవకాశం లభించిన 7 కాలేజీలకు ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. అయితే మొదటి సారి కౌన్సెలింగ్కు హాజరై వెబ్ఆప్షన్ ఇవ్వనివారు, ఇచ్చినా సదరు కాలేజీకి అఫిలియేషన్ లేక అలాట్కాని వారు మాత్రం అవకాశాన్ని వినియోగించుకునే వీలుంది. కానీ ఇప్పటికే ఏదో ఒక కోర్సులో చేరి తరగతులకు హాజరైన వారు స్లైడింగ్ ద్వారా మరో ప్రాధాన్యత గల కోర్సులోకి చేరాలనుకుంటే మాత్రం అవకాశం లేకుం డా పోయింది. కానీ ఇతర ప్రాంతాల్లోని కాలేజీల్లో చేరి అనారోగ్య కర పరిస్థితులతో చదువులు కొనసాగించలేకపోయిన వారు, మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా కాలేజీలు మార్చుకునేందుకు అవకాశాలుంటాయని సమాచారం.
ఇంజినీరింగ్ అడ్మిషన్ల కోలాహలం
Published Thu, Oct 30 2014 3:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement