► ‘రెండాకులు’ చేజారినందుకు ఆగ్రహం
►టోపీ చిహ్నం సిగ్గుసిగ్గు
► దినకరన్కు చీవాట్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీ చేతుల్లో ఉంది...పరువు పోయింది, రెండాకులు రాలిపోగా చివరకు ‘టోపీ’ మిగిలింది’ అంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ లోలోన మదనపడుతున్నారు. ఎంతో నమ్మకంతో పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఇదా నీ నిర్వాకం అంటూ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్కు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. జయలలిత రాజకీయ జీవితంలో 32 ఏళ్లపాటు వెన్నంటి నడిచి, నమ్మకంగా నిలిచిన ఫలితంగా అన్నాడీఎంకే చిన్నమ్మ చేతుల్లోకి వచ్చింది. అయితే నిండా నెలరోజులు కాకమునుపే సీఎం కుర్చీలో కూర్చోవాలన్న ఆమె మోజు తీరకుండానే అక్రమ ఆస్తుల కేసులో జైలుపాలయ్యారు.
నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకుని బైటకు వచ్చిన తరువాత పార్టీని జాగ్రత్తగా తన చేతుల్లో పెట్టే నమ్మకమైన వ్యక్తి కోసం చిన్నమ్మ సాగించిన అన్వేషణలో ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్ మెలిగారు. పార్టీతోపాటు పదవి సైతం ఇచ్చినపుడే పెత్తనం సాధ్యమనే వ్యూహంతో దినకరన్కు దాదాపు తనతో సమానమైన హోదాగా ఉప ప్రధానకార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఇక తన స్థానంలో నమ్మకస్థుడైన వ్యక్తిని సిద్ధం చేసుకున్నామన్న ధీమాతో చిన్నమ్మ జైలు జీవితాన్ని ప్రారంభించారు.
దినకరన్కు సవాళ్లు: అయితే చిన్నమ్మ జైలు కెళ్లిన తరువాతనే దినకరన్కు అసలైన సవాళ్లు ఎదురయ్యాయి. ఎడపాడిని సీఎం చేయడం, విశ్వాస పరీక్షలో నెగ్గేలా ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలను నడిపించడం, ఎమ్మెల్యేలు పన్నీర్వైపు చేజారకుండా జాగ్రత్తలు తీసుకోని విశ్వాసపరీక్షలో ఎడపాడిని నెగ్గించడం వరకు చకచకా సాగిపోయాయి. అయితే అర్కేనగర్లో ఉప ఎన్నికలు దినకరన్కు పెనుసవాళ్లు విసిరాయి. రెండాకుల చిహ్నంకై శశికళ, పన్నీర్ వర్గాలు పోటీపడ్డాయి.
ఎన్నికల కమిషన్ వద్ద వాదోపవాదాలు వినిపించాయి. మెజార్టీ ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నందున రెండాకుల చిహ్నం తమకే దక్కాలని శశికళ వర్గం ఈసీ వద్ద మొరపెట్టుకుంది. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లనపుడు రెండాకుల గుర్తుకు వారు ఎలా అర్హులని పన్నీర్ వర్గం వాదించింది. రెండాకుల గుర్తును ఎన్నికల కమిషన్ ఎవ్వరికీ చెందకుండా చేయడంతోపాటు అన్నాడీఎంకే తరఫున పోటీచేయరాదని ఆంక్షలు విధించింది. దీంతో దినకరన్ ‘అన్నాడీఎంకే అమ్మ’ అనే పార్టీని స్థాపించి ఒక స్వతంత్య్ర అభ్యర్థిగా టోపీ గుర్తుపై పోటీచేసేందుకు సిద్ధమయ్యారు.
శశికళ శిబిరం వెల వెల:
ఎంజీఆర్ స్థాపించి, జయలలిత నడిపించిన పార్టీ అనే అనందం అదృశ్యమైపోగా శశికళ శిబిరం వెలవెల పోయింది. రెండాకుల చిహ్నాన్ని ఎన్నికల సంఘం స్తంభింపజేసిన పరిణామంతో ఇరువర్గాలు హతాశులైనా శశికళ వర్గాన్ని ఎక్కువగా బాధించింది. ఎంతో కష్టపడి స్వాధీనం చేసుకున్న అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం కూడా లేకుండా ఆర్కేనగర్ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి దాపురించడాన్ని శశికళ జీర్ణించుకోలేక పోతున్నారు.
ఆర్కేనగర్ ఎన్నికల్లో పోటీచేయవద్దని చెప్పినా వినలేదు, ఇపుడు రెండాకుల చిహ్నం లేకుండా పోటీకి దిగి ఓటమి పాలైతే పన్నీర్వర్గం దీన్ని పరాభవంగా పరిగణించగలదని ఆమె వాపోతున్నారు. ఇళవరసి కుమారుడు వివేక్ శుక్రవారం బెంగళూరు జైలుకెళ్లి శశికళను కలుసకున్నపుడు.. రెండాకుల చిహ్నం స్థానంలో టోపీ గుర్తును ఎన్నుకోవడం నలుగురిలో ఎద్దేవాగా మారిందని దినకరన్పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపడం ప్రారంభించగానే అప్రమత్తమై సరైన గుర్తును సిద్ధం చేసుకోవడంలో దినకరన్ విఫలమయ్యాడని ఆమె కోప్పడుతున్నారు.
రెండాకుల చిహ్నం చూపిన చేతితో టోపీని సర్దుకోగలమని ఆమె రుసరుసలాడుతున్నారు. రెండాకుల చిహ్నం లేకున్నా రెండు లైట్లను ఎన్నుకోవడం ద్వారా పన్నీర్సెల్వం రాజకీయ పరిణితిని ప్రదర్శించారని వివేక్తో శశికళ వ్యాఖ్యానించారు. అంతేగాక జైల్లో నుంచే ఫోన్ ద్వారా దినకరన్కు చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. పైగా చిహ్నం ఎంపికలో చిన్నమ్మ సలహాను తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడంపై కూడా నిలదీసిçనట్లు తెలుస్తోంది. ప్రజలకు ‘టోపీ’ పెట్టేందుకు వస్తున్నారని ప్రచారాల్లో గేలి చేస్తే గెలుపు ఎలా సాధ్యమని ఆమె తిట్టి పోశారు.
చిన్నమ్మ చిర్రుబుర్రు
Published Sun, Mar 26 2017 3:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement