ఎందుకు నాన్నా ఇంత పని చేశావు? | Sakshi
Sakshi News home page

ఎందుకు నాన్నా ఇంత పని చేశావు?

Published Fri, Mar 27 2015 8:22 PM

ఎందుకు నాన్నా ఇంత పని చేశావు? - Sakshi

బెంగళూరు : ‘నాన్నా... అందరి తండ్రుల మాదిరిగానే నీవు ఉండాలని అనుకున్నాను. ఎంతో ప్రేమగా ముద్దాడుతుంటే పరవశించిపోయాను. నీ కౌగిలిలో ఉన్న తియ్యదనాన్ని ఇంకా నేను మరిచి పోలేదు... ఎందుకు నాన్న ఇంత కఠినాత్ముడిగా మారావు. కష్టసుఖాల్లో నీకు వెనుదన్నుగా వస్తున్న అమ్మను కిరాతకంగా చంపావు. విషయాన్ని కళ్లారా చూశానని నన్ను కూడా నీటి ముంచి ఊపిరాడకుండా చేసి చంపావు. నాన్న నీలాంటి తండ్రి పగవాడికి కూడా ఉండకూడదు.’  అంటూ చిన్నారి హృదయం ఆక్రోశించింది.
 
 కుటుంబంలో చోటు చేసుకున్న చిన్నపాటి గొడవతో కట్టుకున్న భార్యతో పాటు 11 నెలల పసికందును దారుణంగా హతమార్చిన వైనం బెంగళూరులోని కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని సుంకదకట్టెలో చెందిన బాలాజీకి రెండేళ్ల క్రితం దొడ్డబళ్లాపురానికి చెందిన పల్లవీబాయి(28)తో వివాహమైంది. వీరికి 11 నెలల పసికందు ఉన్నాడు. గురువారం సాయంత్రం భార్యభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది.
 
ఆ సమయంలో బాలాజీ రెచ్చిపోయి పల్లవీబాయిని చితకబాది హతమార్చాడు. అదే సమయంలో పసికందు గట్టిగా ఏడుపు మొదలు పెట్టడంతో నీటి తొట్టిలో ముంచి హతమార్చి పారిపోయాడు. విషయాన్ని గుర్తించిన స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని నగర అదనపు డీసీపీ అలోక్‌కుమార్, కామాక్షిపాళ్య పోలీసులు పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement