అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Wed, Feb 15 2017 11:28 AM

farmer commits duicide in adilabad district

నేరేడుగొండ: ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేరేడుగొండ మండలం కుమారి గ్రామానికి చెందిన చిట్టి అశోక్‌(45) అనే రైతు బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత‍్మహత‍్య చేసుకున్నాడు. వ‍్యవసాయానికి అప్పులు చేయడంతో పాటు, ఇద‍్దరు పిల‍్లల అనారోగ్యానికి ఎక్కువ డబ్బు ఖర్చు కావడంతో అప్పులు తీర‍్చే మార‍్గం కనిపించలేదు. దీంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత‍్మహత‍్య చేసుకున‍్నట్లు పోలీసులు తెలిపారు. ఊరికి సమీపంలో పొలానికి వెళ్ళి అక‍్కడ పురుగుల మందు తాగి మృతి చెందాడు. గమనించిన స్థానికులు కుటుంబసబ‍్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స‍్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement