ఆంధ్ర 196/1
గుజరాత్ 308 ఆలౌట్
విజయనగరం: రంజీ ట్రోఫీలో సొంతగడ్డపై ఆంధ్ర జట్టు జోరు కొనసాగుతోంది. గ్రూప్ ‘బి’ లో భాగంగా గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సరికి ఆంధ్ర పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 53 ఓవర్లలో వికెట్ నష్టానికి 196 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్ (176 బంతుల్లో 119 బ్యాటింగ్;18 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో సత్తా చాటగా... కైఫ్ (97 బంతుల్లో 44 బ్యాటింగ్; 6 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్కు ఇప్పటికే అభేద్యంగా 159 పరుగులు జోడించడం విశేషం. చేతిలో 9 వికెట్లున్న ఆంధ్ర ప్రస్తుతం మరో 112 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. అంతకు ముందు 250/5 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన గుజరాత్ 308 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో శివకుమార్, విజయ్, స్టీఫెన్ తలా 3 వికెట్లు తీయగా, అయ్యప్పకు ఒక వికెట్ దక్కింది.
కేరళ 401 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: రోహన్ ప్రేమ్ (452 బంతుల్లో 208 19 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీ సాధించడంతో హైదరాబాద్తో ఇక్కడ జరుగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్లో కేరళ తమ తొలి ఇన్నింగ్స్లో 401 పరుగులు చేసింది. 186/5 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన కేరళ, హైదరాబాద్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంది. గోమెజ్ (41), మోనిశ్ (37), ఫాబిద్ (37 నాటౌట్)లతో వరుసగా మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి ప్రేమ్ జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆకాశ్ భండారి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం హైదరాబాద్ ఆట ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. హైదరాబాద్ మరో 361 పరుగులు వెనుకబడి ఉంది.
సౌరాష్ట్రను గెలిపించిన రవీంద్ర జడేజా
రాజ్కోట్: రెండు రోజుల్లోనే ముగిసిన మరో మ్యాచ్లో సౌరాష్ట్ర జట్టు 8 వికెట్ల తేడాతో జార్ఖండ్ను చిత్తు చేసింది. రవీంద్ర జడేజా (7/55) అద్భుత బౌలింగ్తో చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్లో జార్ఖండ్ 122 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 37 పరుగుల ఆధిక్యం సాధించిన సౌరాష్ట్ర...రెండో ఇన్నింగ్స్లో 86 పరుగుల విజయలక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
శ్రేయస్ డబుల్ సెంచరీ
ముంబై: పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ (176 బంతుల్లో 200; 25 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడుగా ఆడి డబుల్ సెంచరీ సాధించడంతో తొలి ఇన్నింగ్స్లో ముంబై 6 వికెట్లకు 495 పరుగులు చేసింది. తారే (111 నాటౌట్) కూడా సెంచరీ చేశాడు. ముంబై 341 పరుగుల ఆధిక్యం సాధించింది.
సెంచరీతో చెలరేగిన భరత్
Published Sat, Oct 10 2015 12:02 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
ఓటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement