ఆసీస్ దే ట్రై సిరీస్ | Sakshi
Sakshi News home page

ఆసీస్ దే ట్రై సిరీస్

Published Sun, Feb 1 2015 4:02 PM

ఆసీస్ దే ట్రై సిరీస్

పెర్త్:ముక్కోణపు సిరీస్ ను ఆస్ట్రేలియా కైవశం చేసుకుంది. ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 112 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 278 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 39.1 ఓవర్లో 166 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

 

ఇంగ్లండ్ ఆటగాళ్లలో బొపారా(33),మొయిన్ ఆలీ(26),రూట్(25), బ్రాడ్(24) పరుగులు మాత్రమే చేశారు. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్ వెల్ నాలుగు, జాన్సన్ మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.
 

Advertisement
Advertisement