‘కుంభకోణం స్కూల్’లో మంటలకు 94 మంది ఆహుతి కేసులో..
చెన్నై: తమిళనాడులోని ఓ స్కూల్లో 2004లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 94 మంది విద్యార్థులు సజీవదహనమైన కేసులో స్కూలు వ్యవస్థాపకుడు పళనిస్వామి సహా 10 మందిని దోషులుగా నిర్ధరిస్తూ తంజావూరు కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. పళనిస్వామికి ఐపీసీ సెక్షన్లు 427, 467, 197, 304 కింద జీవితఖైదు, సెక్షన్ 304 కింద పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే రూ. 47 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. పళనిస్వామి భార్య, పాఠశాల కరస్పాండెంట్ సరస్వతి, ప్రధానోపాధ్యాయురాలు శాంతలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు విజయలక్ష్మి, వంటమనిషి వసంతిలకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్షతోపాటు మొత్తం రూ. 3.75 లక్షల జరిమానా విధించారు. విద్యాశాఖ ఉద్యోగులు ఎలిమెంటరీ ఆఫీసర్ బాలాజీ, అసిస్టెంట్ ఎలిమెంటరీ ఆఫీసర్ శివప్రకాష్, పీఏ దురైరాజ్, రాష్ట్ర ఎలిమెంటరీ ఆఫీసర్ తాండవన్కు ఐదేళ్ల చొప్పున జైలు శిక్షలతోపాటు రూ.10వేల చొప్పున జరిమానా, ఇంజనీర్ జయచంద్రన్కు రెండేళ్ల జైలు శిక్ష, రూ. 40 వేల జరిమానా విధించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు జడ్జి మొహమ్మద్ అలీ తీర్పు చెప్పారు. 94 మంది విద్యార్థులను బలిగొన్నందున పళనిస్వామి 940 ఏళ్ల శిక్షను అనుభవించాలని జడ్జి పేర్కొన్నారు. అయితే ఇది సాధ్యం కాదు కాబట్టి 10 ఏళ్ల కఠినకారాగార శిక్షను ఏకకాలంలో అనుభవించాలన్నారు. తీర్పు తర్వాత జయచంద్రన్ జరిమానా చెల్లించి బెయిల్ పొందారు. తీర్పుపై బాధిత కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. 11 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని తెలిపాయి.
ప్రమాదం జరిగింది ఇలా...: తంజావూరు జిల్లా కుంభకోణం కాశీరామన్ వీధిలో ఉన్న ఓ ఇరుకైన భవనంలో పళనిస్వామి నిబంధనలకు విరుద్ధంగా మూడు స్కూళ్లను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అయితే 2004 జూలై 16న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే వంటగదిలో అగ్నిప్రమాదం సంభవించడంతో మంటలు మొదటి అంతస్తులో ఉన్న స్కూళ్లకు వ్యాపించాయి. 94 మంది సజీవదహనమవగా మరో 18 మంది తీవ్రగాయలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనపై తొలుత 24 మందిపై అభియోగాలు నమోదు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ముగ్గురిపై అభియోగాలను ఉపసంహరించుకుంది.
స్కూలు యజమానికి జీవితఖైదు
Published Thu, Jul 31 2014 1:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement