♦ అత్యధిక ఓట్ల శాతంలో...12వ స్థానం కోవింద్ది!
పద్నాలుగో రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏబీజేపీ అభ్యర్థి రామ్నాథ్కోవింద్పోలైన ఓట్లలో 65.65 శాతం ఓట్లు సాధించి, ఇప్పటి వరకూ జరిగిన 14 ఎన్నికల్లో (ఏకగ్రీవమైన 1977 నాటి ఎన్నికను మినహాస్తే) అత్యధిక ఓట్లు పొందినవారి వరుస క్రమంలో 12వ స్థానం సంపాదించారు. భారత రాష్ట్రపతి రెండో ఎన్నిక(1957)లో మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్పోలైన ఓట్లలో 98.99 శాతం సాధించి మొదటి స్థానంలో నిలిచారు. అత్యధిక ఓట్లు దక్కించుకోవడంలో రెండో ర్యాంక్రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్కు(1962లో 98.24 శాతం) లభించింది. అప్పట్లో ప్రతిపక్షాలకు బలం లేకపోవడమే కాంగ్రెస్అభ్యర్థులుకు భారీగా ఓట్లు రావడానికి కారణమైంది.
1997లో జరిగిన ఎన్నికలో కేఆర్నారాయణన్94.97 శాతం ఓట్లతో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. అప్పుడు శివసేన వంటి ఒకట్రెండు పార్టీలు మినహా బీజేపీ, కాంగ్రెస్, పాలక యునైటెడ్ఫ్రంట్సహా దాదాపు అందరూ మద్దతు ఇవ్వడంతో కేఆర్కు ఇన్ని ఓట్లుపడ్డాయి. 2002లో జరిగిన ఎన్నికలో వామపక్షాలను మినహాయించి మిగిలిన పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య దాదాపు ఏకాభిప్రాయం కుదరడంతో ఏపీజే అబ్దుల్కలాం 89.57 శాతం ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు.
అత్యల్ప మెజారిటీ వి.వి.గిరికే!
ఓ మోస్తరు త్రిముఖ పోటీ 1969లోనే జరిగింది. ప్రధాని ఇందిరాగాంధీ మద్దతుతో పోటీకి దిగిన వీవీ గిరి, కాంగ్రెస్అభ్యర్థి నీలం సంజీవరెడ్డి మధ్య గట్టిపోటీతోపాటు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి చింతామణ్డి.దేశ్ముఖ్కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో(13 శాతం) ఓట్లు రాబట్టడంతో ఫలితం రెండో లెక్కింపులో తేలింది. మొదటి లెక్కింపులో గిరికి 48 శాతం, నీలంకు 37 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్ప ఓట్ల మెజారిటీతో భారత రాష్ట్రపతి అయిన రికార్డు గిరి పేరు చరిత్రలో నిలిచింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ ఎప్పుడూ రాలేదు. అయితే, అంతకు ముందు జరిగిన 1967 ఎన్నికలో కూడా మొదటిసారి ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య తీవ్రపోటీ నెలకొంది.
కాంగ్రెస్అభ్యర్థి జాకిర్హుసేన్కేవలం 56.23 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. తక్కువ ఓట్లు, మెజారిటీతో గెలిచినవారి జాబితాలో హుసేన్ది వీవీ గిరి తర్వాత రెండో స్థానం. 1967 ఎన్నికల్లో కాంగ్రెస్అనేక రాష్ట్రాల్లో ఓడిపోయింది. దీనికితోడు లోక్సభలో 300 కన్నా తక్కువ సీట్లు సాధించడం, సోషలిస్ట్దిగ్గజం డా. రాంమనోహర్లోహియా ప్రతిపక్షాల మధ్య ఐక్యత సాధించడం వంటి కారణాలే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోకా సుబ్బారావుకు 43.43 ఓట్లు తెచ్చిపెట్టాయి.
65 శాతంతో గెలిచిన ఇద్దరు ప్రతిభ, కోవింద్!
వీవీ గిరి, జాకిర్హుసేన్తర్వాత తక్కువ శాతం ఓట్లు తెచ్చుకున్నవారిలో తర్వాత స్థానం ఇప్పటి బీజేపీ అభ్యర్థి రామ్నాథ్కోవింద్ది. ఆయనకు 65.65 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్అభర్థి మీరాకుమార్34.35 శాతం ఓట్లు సాధించారు. (సాక్షి నాలెడ్జ్సెంటర్)
సంబంధిత వార్త
ఈ లెక్కన వెంకయ్యకు 482 ఓట్లు
రాజన్బాబు నుంచి నేటి వరకూ
Published Fri, Jul 21 2017 2:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement