అక్బరుద్దీన్ కు మళ్లీ సమన్లు! | Sakshi
Sakshi News home page

అక్బరుద్దీన్ కు మళ్లీ సమన్లు!

Published Wed, Jul 23 2014 4:47 PM

అక్బరుద్దీన్ కు మళ్లీ సమన్లు!

ముంబై: హిందూ, ముస్లీంల సఖ్యతను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు మరోసారి ముంబైలోని కుర్లా కోర్టు సమన్లు జారీ చేసింది.  
 
వచ్చె నెలలోపుగా అక్బరుద్దీన్ కోర్టుకు హాజరుకావాలంటూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన సమన్లకు హైదరాబాద్ పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మరోసారి కోర్టు నోటీసులు జారీ చేసిందని ఫిర్యాదుదారుడు గులామ్ హుస్సేన్ ఖాన్ తెలిపారు. 
 
2012లో ఆంధ్రప్రదేశ్ లోని ఆదిలాబాద్ జిల్లాలో బైంసాలో అక్బరుద్దీన్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓవైసీ ప్రసంగం మతపరమైన సెంటిమెంట్ ను దెబ్బ తీసిందని ఫిర్యాదుదారుడు ఖాన్ తెలిపారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement