‘మనం’, ‘దృశ్యం’ తరహాలో... | Sakshi
Sakshi News home page

‘మనం’, ‘దృశ్యం’ తరహాలో...

Published Tue, Dec 1 2015 11:45 PM

‘మనం’, ‘దృశ్యం’ తరహాలో...

సినిమా సినిమాకు విభిన్న తరహా పాత్రలు పోషించి, ప్రేక్షకులను ఆకట్టుకునే కథానాయకుడు సూర్య. అందుకే ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులున్నారు. సూర్య హీరోగా నటిస్తూ పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో నిర్మించిన చిత్రం - ‘పసంగ 2’. ఈ చిత్రాన్ని సాయి సూర్య, కె.ఇ. జ్ఞానవేల్ రాజా సమర్పణలో మణికంఠ పిక్చర్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి తెలుగులో ‘మేము’ పేరుతో అనువదిస్తున్నారు. ఈ నెలాఖరున ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇటీవల సూర్య విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘మనం’, ‘దృశ్యం’ సినిమాల తరహాలో మా చిత్రం ఘన విజయం సాధిస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ‘పిశాచి’ చిత్ర ఫేమ్ అరోల్ కొరెల్లి, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, సాహితి, సహ నిర్మాతలు: ప్రసాద్ సన్నితి, తమటం కుమార్‌రెడ్డి.

Advertisement
Advertisement