► హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కేసీ భాను
► ‘నేర విచారణ–ఎఫ్ఐఆర్ నుంచి తీర్పు వరకు’ అంశంపై ఉపన్యాసం
సాక్షి, హైదరాబాద్: క్రిమినల్ కేసులకు సంబంధించి దర్యాప్తులో, కోర్టు విచారణలో అతి చిన్న ఆధారం కూడా ఎంతో కీలకం అవుతుందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేసీ భాను వ్యాఖ్యానించారు. క్రిమినల్ కేసుల్లో క్లూ మిస్సవ్వకుండా జాగ్రత్త పడుతూనే సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉదహరిం చాల్సి ఉంటుందని చెప్పారు. క్రిమినల్ లా ప్రాక్టీస్ చేసే న్యాయవాదులు సుప్రీంకోర్టు తీర్పుల్ని, విచారణ కేసుల్ని లోతుగా అధ్యయనం చేస్తేనే విజయం సాధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
లైఫ్ లైన్ లాయ ర్స్ లెక్సికన్ ఆధ్వర్యంలో గురువారం ఫ్టాప్సీలో ‘నేర విచారణ–ఎఫ్ఐఆర్ నుంచి తీర్పు వరకు..’ అనే అంశంపై ఆయన ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక తీర్పులను ఉదహరించారు. హైకోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వినోద్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కుమార్ కెయిత్ హాజరయ్యారు. జూనియర్ లాయర్లు నిరంతం అధ్యయనం చేయాలని, చిత్తశుద్ధి అవసరమని, అప్పుడే న్యాయవాదిగా రాణించవచ్చని సూచించారు.
ప్రత్యక్ష సాక్షులు, బాధితులు, నిందితుల ప్రకటనల దగ్గర నుంచి ఆ కేసులోని అంశాని కి, ఇదే తరహాలోని ఇతర కేసుల్లో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనాలు చెప్పిన తీర్పులను ఉటంకించి న్యాయపరమైన వాదనలు చేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయని సూచించారు. సుప్రీంకోర్టులో ఇద్దరు ముగ్గురు జడ్జీలతో కూడిన బెంచ్లు చెప్పిన తీర్పుల కంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు (విస్తృత ధర్మాసనాలు) చెప్పిన తీర్పుల్ని కేసుల్లో ఉదహరించాలని, అదే సమయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పులు వెలువరించిందో లేదో అధ్యయనం చేయకపోతే కేసు వీగిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
చేయి తగిలినా, బైక్ ఢీకొన్నా..
జస్టిస్ సురేశ్ కుమార్ కెయిత్ మాట్లాడుతూ.. తెల్లారి లేచింది మొదలు చిన్నచిన్న సంఘటనలు కూడా కేసులైతే క్రిమినల్ లా వర్తిస్తుందని తెలిపారు. ఆడ పిల్లలకు చేయి తగిలినా, బైక్ ఢీకొన్నా.. కేసు నమోదైతే క్రిమినల్ లా అమలు అవుతుందని చెప్పారు. సిరిసిల్లలో పోలీసులు దళితుల్ని కొట్టిన ఘటన, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లా గరికపాడులో దళితుల గ్రామ బహిష్కరణ తదితర ఘటనల్లో వెంటనే స్పందించి బాధితుల పక్షాన నిలబడినట్లు ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యుడు కె.రాములు చెప్పారు. సాంకేతికంగా వచ్చిన మార్పులను యువ న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ కె.లక్ష్మణ్ సూచించారు. అంతకుముందు జస్టిస్ కేసీ భాను, రాములు, లక్ష్మణ్లను జస్టిస్ సురేశ్ కుమార్ కెయిత్ సత్కరించారు.
చిన్న ఆధారం కూడా కీలకమే
Published Fri, Sep 22 2017 2:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement