- చారిత్రక నగరానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్వాటర్ ముప్పు
- జలాశయాన్ని ఈసారి పూర్తిగా నింపాలని సర్కారు నిర్ణయం
- పురాతన నగరమున్న ప్రాంతంలో కొంతమేర మునిగే అవకాశం
- నీరు చేరకుండా భారీ రక్షణ గోడ ఏర్పాటు యోచన
- సర్వే చేసిన నిపుణులు..త్వరలో పనులు!
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే మూడోవంతు ప్రాంతాన్ని ఏలిన శాతవాహనుల చారిత్రక మహా నగరం ‘కోటి లింగాల’ ఆనవాళ్లకు ముప్పు వచ్చింది. దశాబ్దాల పాటు తీవ్ర నిర్లక్ష్యానికి గురై.. ఇంతకాలానికి వెలుగు చూడబోతోందనగా మరో సమస్య వచ్చి పడింది. ఎల్లంపల్లి ప్రాజెక్టును ఈసారి పూర్తిస్థాయిలో నింపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ చారిత్రక నగరం ఆనవాళ్లున్న ప్రదేశంలో కొంతభాగం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో మునిగిపోయే అవకాశముంది.
దేశంలోనే తొలిసారిగా..
కోటిలింగాలలో దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల నగరం ఆనవాళ్లున్నట్లు 1978లో జరిపిన తవ్వకాల్లో గుర్తించారు. కానీ ఇంతకాలం దానిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ వంద ఎకరాల స్థలంలో తవ్వకాలు జరిపి నగరాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ ప్రదేశానికి ఉత్తరం వైపు గోదావరి నది ఉంది. అక్కడికి కొద్ది దూరంలో కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈసారి 20 టీఎంసీల మేర నీటిని నిల్వచేయాలని తాజాగా సర్కారు నిర్ణయించింది. ఆ మేర నిల్వచేస్తే ప్రాజెక్టు బ్యాక్వాటర్ కోటిలింగాల ప్రాంతంలో కొంతభాగం మునిగిపోయే అవకాశముంది.
అదే జరిగితే తవ్వకాలు జరపడం సాధ్యం కాదు. ఎండాకాలంలో నీటిమట్టం తగ్గినప్పుడు తవ్వినా.. తిరిగి వానాకాలంలో ముంపు తప్పదు. ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కారంగా నదికి వారగా భారీ రక్షణ గోడను నిర్మించాలని పురావస్తుశాఖ నిర్ణయించింది. నీటిని ఇవతలివైపు రానీయని విధంగా విదేశాల్లో నదీముఖంగా అలాంటి గోడలు నిర్మిస్తుంటారు. మనదేశంలో తొలిసారిగా ఓ చారిత్రక కట్టడానికి రక్షణగా ఆ గోడను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి నిపుణుల బృందం ఇటీవల సర్వే చేసింది. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా ఖర్చు అంచనాలు రూపొందించి, ప్రభుత్వం అనుమతితో పనులు చేపట్టాలని పురావస్తుశాఖ భావిస్తోంది. ఇదంతా సెప్టెంబర్లోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
కర్ణమామిడి లోనూ తవ్వకాలు
గోదావరి నదికి అవతలి భాగంలో ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే కర్ణమామిడి వద్ద కూడా పురావస్తు శాఖ తవ్వకాలు జరపనుంది. అయితే ఆ ప్రాంతం పూర్తిగా ప్రాజెక్టు నీటిలో మునిగిపోనుంది. అందువల్ల నీళ్లు చేరేలోపే తవ్వకాలు జరిపి అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రాంతం శాతవాహనుల కంటే ముందు రాజుల ఏలుబడిలో ప్రాధాన్యమున్న ప్రాంతంగా పురావస్తు శాఖ భావిస్తోంది. దాని విస్తీర్ణం స్వల్పంగానే ఉంటుందని అంచనా. అది పూర్తిగా మునిగిపోయే ప్రాంతం కావడంతో.. కట్టడాల ప్రాధాన్యాన్ని బట్టి మరో ప్రాంతానికి తరలించే యోచనలో ఉన్నారు. ఇక్కడ ఆగస్టు చివరికల్లా తవ్వకాలు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
‘కోటి లింగాల’కు కోటి కష్టాలు!
Published Wed, Jul 20 2016 2:35 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
సిమ్రాన్, అవినాష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
T20 World Cup 2024 IND VS PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్
ఆర్ఆర్ఆర్ చాలా నచ్చింది.. ఆ హీరోతో పని చేయాలనుంది: హాలీవుడ్ డైరెక్టర్
కేంద్ర కేబినెట్లోకి నడ్డా
చరిత్ర సృష్టించిన సిలికానాంధ్ర స్నాతకోత్సవం..ఏకంగా 16 మంది..
కాంచన-4లో టాలీవుడ్ హీరోయిన్.. రాఘవ లారెన్స్ క్లారిటీ!
బాబర్.. విరాట్ కాలిగోటికి కూడా సమానం కాడు: పాక్ మాజీ ప్లేయర్
కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి.. మోదీకి కృతజ్ఞతలు
తప్పక చదవండి
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- WI Vs UGA: 39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- ‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
- ముగిసిన చేప ప్రసాదం పంపిణీ, మిస్ అయిన వాళ్ల కోసం..
Advertisement