మావోయిస్టులకు ఎదురుదెబ్బ | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు ఎదురుదెబ్బ

Published Tue, Feb 21 2017 7:30 PM

7 maoists encountered in chattisgarh

ఛత్తీస్‌గఢ్‌: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణ్‌పూర్‌ జిల్లాలోని పుష్పాల్‌ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్‌ డీజీపీ డీఎం అవస్తి తెలిపారు. దంతేవాడ జిల్లా బర్సూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని  అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టిన పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టుల మృతి చెందారు. రెండు ఇన్సాస్‌ రైఫిళ్లు, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Advertisement
Advertisement